Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
స్వతంత్ర విదేశాంగ విధానమే శరణ్యం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2020

స్వతంత్ర విదేశాంగ విధానమే శరణ్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ విజయం ప్రధాని నరేంద్ర మోడీని సంకట పరిస్థితుల్లోకి నెట్టివేసి ఉండాలి. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించిన తొలి భారతీయ ప్రధాని మోడీనే. 2019 సెప్టెంబరులో హూస్టన్‌లో జరిగిన ''హౌడీ మోడీ'' ర్యాలీలో ''ఈసారీ ట్రంప్‌ సర్కారే'' (అబ్‌ కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌) అంటూ మోడీ ఇచ్చిన నినాదం ఇప్పటికీ మనందరి చెవుల్లో గింగురు మంటూనే ఉంది. 2020 ఫిబ్రవరిలో 'నమస్తే ట్రంప్‌' పేరుతో ట్రంప్‌కు అనుకూలంగా అహ్మదాబాద్‌లో మోడీ మరో రాజకీయ కార్యక్రమం నిర్వహించారు.
రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత ప్రభుత్వం ఎప్పుడూ తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తుంది. గత మూడు దశాబ్దాలుగా అమెరికాతో ఏర్పరచుకుంటున్న వ్యూహాత్మక సంబంధాలకు అమెరికాలో ఇరుపక్షాల మద్దతు ఉంది. అధ్యక్షుడిగా డెమొక్రాటా, రిపబ్లికనా ఎవరున్నారనే దాంతో నిమిత్తం లేకుండా అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలే ఆ దేశ విదేశాంగ విధానంలో కీలకంగా ఉంటాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో బుష్‌ ప్రభుత్వంతో వ్యూహాత్మక పొత్తు బలపడింది. ఆ తర్వాత వచ్చిన ఒబామా ప్రభుత్వం దీనిని కొనసాగించిందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి.
ట్రంప్‌ ప్రాపకం కోసం ఆయనతో మరింతగా జత కట్టడం కోసం మోడీ అడ్డదారులు తొక్కారు. ఈ ఇరువురి నేతల మధ్య బంధానికి ఒక సైద్ధాంతికత కూడా ఉంది. ట్రంప్‌లో, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న మితవాద సర్కిల్‌లో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి తమతో భావసారూప్యత కలిగిన మిత్రుల్ని చూసుకున్నాయి. శ్వేతజాతి దురహంకారం, ట్రంపిజంలోని జాత్యహం కారంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని వీరు కనుగొన్నారు. అరిగిపోయిన రికార్డులా ట్రంప్‌ పదే పదే మాట్లాడే 'ఇస్లామో ఫోబియా, చైనా వ్యతిరేకత' వీరికి నచ్చింది. ట్రంపిజానికి, హిందూత్వ జాతీయవాదానికి లంకె కుదిరింది.
విదేశాంగ కార్యదర్శి కావడానికి ముందుగా అమెరికాలో భారత రాయబారిగా వున్న హర్షవర్ధన్‌ శ్రింగ్లా ట్రంప్‌ మాజీ వ్యూహాత్మక సలహాదారు స్టీవ్‌ బానన్‌ను కలసినప్పుడే ఈ సైద్ధాంతిక ప్రేమ వ్యవహారానికి బీజం పడింది. పచ్చి శ్వేతజాతి దురహంకారి, ముస్లింలపై విషం కక్కే బానన్‌ను 2019 సెప్టెంబరులో కలిసిన అనంతరం శ్రింగ్లా ట్వీట్‌ చేస్తూ, ''ప్రఖ్యాత సైద్ధాంతికవేత్త, ధర్మ పోరాట యోధుడిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. హిందూ పురాణగ్రంథం భగవద్గీతను ఆసక్తిగా అనుసరించే వ్యక్తి బానన్‌'' అని పేర్కొన్నారు.
బానన్‌ వ్యాఖ్యలు మరీ దుర్మార్గంగా ఉన్నాయని అభిప్రాయపడిన ట్రంప్‌ సర్కిల్‌ ఆయను వైట్‌ హౌస్‌ సిబ్బంది నుంచి తొలగించారు. అయినా, అమెరికాలో భారత దూతగా ఉన్న శ్రింగ్లా ఆయనను ఏరి కోరి కలిశారు. తాను చేసిన ట్వీట్‌ను తర్వాత శ్రింగ్లా తొలగించినప్పటికీ మోడీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ఈ సంఘటన తెలియచేస్తుంది. ఆ వెంటనే శ్రింగ్లాకు విదేశాంగ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.
అమెరికన్‌ కాంగ్రెస్‌కు చెందిన మహిళ పరిమళ జైపాల్‌ ఉందన్న కారణంతో విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన అమెరికన్‌ పార్లమెంటరీ కమిటీ నాయకత్వాన్ని కలవడానికి భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశకంర్‌ తిరస్కరించడం ట్రంప్‌ ప్రభుత్వంతో మోడీ భాగస్వామ్యం ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పడానికి మరో ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్‌లో కమ్యూనికేషన్స్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, రాజకీయ బందీలనందరినీ విడుదల చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ 2019 డిసెంబరులో అమెరికన్‌ కాంగ్రెస్‌ కమిటీలో పరిమళా జైపాల్‌ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జైపాల్‌ సభ్యురాలిగా ఉన్నందున ఆ ప్రతినిధి బందాన్నే కలవడానికి జైశంకర్‌ నిరాకరించారు.
ఇక ఇప్పుడు బైడెన్‌-హారిస్‌ బందానికి స్వాగతం పలకడం తప్ప మోడీ ప్రభుత్వానికి మరో మార్గం లేదు. జమ్మూ కాశ్మీర్‌పై భారత ప్రభుత్వ విధానాలను కమలా హారిస్‌ కూడా విమర్శించిందన్న వాస్తవాన్ని జైశంకర్‌ జీర్ణించుకోవాల్సిందే. భారత్‌తో వ్యూహాత్మక పొత్తును బైడెన్‌ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. అమెరికా మూడు దశాబ్దాల ప్రాజెక్టులో భాగంగా భారత్‌ను మిత్రపక్షంగా చేర్చుకుంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నాక దీని నుంచి అది వెనక్కి మళ్లే అవకాశం లేదు.
అయితే, ఇందులో ఒక కీలకమైన అంశాన్ని మనం గమనించడం లేదు. భారతదేశ కీలక ప్రయోజనాలు-అవి వాతావరణ మార్పులు కావచ్చు లేదా ఇరాన్‌తో సంబంధాలు కావచ్చు లేదా వాణిజ్య, వీసా నిబంధనలకు సంబంధించినవి కావచ్చు-ఏవైనా మన దేశ ప్రయోజనాలను దెబ్బతీసేవే. ప్రమాదకరమైన సామ్రాజ్యవాద శత్రువుతో జత కలిసిన ఈ నాలుగు సంవత్సరాల చేదు అనుభవాల నుంచి భారత ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు, తన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు భారత్‌ను ఒక డోర్‌ మ్యాట్‌ (కాలి కింద ఉండే పట్టా)లా ఉపయోగించు కోవాలని ట్రంప్‌, పాంపియో చూశారు.
అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో భారత్‌ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరముంది. అలాగే తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని విస్తరించుకోవడంపై దష్టి పెట్టాలి. భారత్‌ తనకు తానుగా అమెరికాకు బంటుగా మార్చే విధానం నుంచి విడగొట్టుకుని బయటకు వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం. అయితే, హిందూత్వ జాతీయవాదుల కూర్పులోనే అమెరికా సామ్రాజ్యవాదంతో మిలాఖత్‌ ఒక అవిభాజ్య అంశంగా ఉంది. అయితే వారు ఈ నైజాన్ని అంత తేలికగా వదులుకోరు.
-'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
రైతుల ఐక్యతే ప్రభుత్వ మెడలు వంచుతుంది!
ధర్మం నడిచేది నాల్గు పాదాలమీద కానేకాదు!
అమెరికాలో అగంతక రాజకీయాలు
పదోన్నతులకు ప్రాతిపదిక ఏమిటి?
పదవీ విరమణ వయసు పెంపు
ఇది మరో జాతీయ పోరాటం
కేరళే ప్రత్యామ్నాయం
'మార్పు మనలోనూ రావాలి.!'
చైనాపై మాటలకుస్తీ.. మోడీ విదేశీ భక్తి..
మరో ప్రమాదకర ప్రతిపాదనలు
వద్దంటుంటే రుద్దుతారెందుకు?
యోగి.. రాజ్యాంగ వ్యతిరేకి..

తాజా వార్తలు

12:29 PM

టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

12:26 PM

రూ.5కే కిలో ట‌మాట‌

12:19 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతి

12:10 PM

రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు భూమి పూజ చేసిన మోడీ

12:03 PM

కారునే వెనక్కి లాగాలని చూసిన పులి..

11:55 AM

వండర్‌లా రూ .699 ఆఫర్ మరో రెండు వారాల పాటు

11:52 AM

ప్రేమజంట ఆత్మహత్య

11:49 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

11:32 AM

మాజీ క్రికెట‌ర్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆస్పత్రికి తరలింపు

11:23 AM

అల్లుడికి 125 వంటకాలు వడ్డించిన అత్తింటి వారు

11:17 AM

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లతో అపశృతి..

11:09 AM

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

11:05 AM

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది?: ఈటల

10:44 AM

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్‌

10:37 AM

తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

10:35 AM

బర్డ్ ఫ్లూపై కేంద్రం కీలక ప్రకటన..

10:27 AM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టాలు త‌ప్పిన రైలు...

10:15 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న వార్డు బాయ్ మృతి

10:06 AM

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం...

09:58 AM

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

09:11 AM

2కే రన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్

08:50 AM

కత్తులు, రాళ్లతో కొట్టుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు

08:42 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై చిరుత‌

08:33 AM

మణిపూర్‌, మహారాష్ట్రలో స్వల్ప భూకంపం

08:30 AM

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌..భారీ డిస్కౌంట్ ఆఫర్లు

08:12 AM

బాలాకోట్ సెక్టారులో పాక్ ఆర్మీ కాల్పులు

07:52 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

07:48 AM

ఫేస్​బుక్​, ట్విట్టర్​కు పార్లమెంటరీ కమిటీ సమన్లు

07:40 AM

రైతుల 'రిపబ్లిక్​ డే' ట్రాక్టర్ ర్యాలీపై నేడు సుప్రీం విచారణ

07:31 AM

నేటి నుంచి బెంగాల్​, అసోంలో సీఈసీ పర్యటన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.