Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రైతులకు రక్షణేది? | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Nov 19,2020

రైతులకు రక్షణేది?

రాష్ట్రంలో ఈ వర్షా కాలం లో కోటి 34లక్షల ఎకరాల విస్తీర్ణం సాగు అయింది. అందులో వరి సాగు విస్తీర్ణం 52.77లక్షల ఎకరాలు. నియంత్రిత సాగు విధానాన్ని అనుసరించి 80శాతం మంది రైతులు సన్నరకం వరిని వేశారు. దొడ్డురకం వడ్ల కన్నా 20 నుంచి 30 రోజులు ఎక్కువ కాల పరిమితి అవసరం. దానికి తెగుళ్లు, (దోమకాటు, నల్ల కాటుక) ఎరువుల, నీటి వినియోగం కూడా ఎక్కువే. దొడ్డురకాలతో పోల్చినప్పుడు ఈ రకం ధాన్యం దిగుబడులు దాదాపు 10క్వింటాళ్లు తక్కువ. ఈ కారణాల వల్ల రైతులు చాలా కాలంగా ఇంటి అవసరాలకు సరిపడా సన్నరకాల ధాన్యాన్ని సాగు చేసి, మిగతా పొలాన్ని దొడ్డురకం వడ్లను సాగు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయకపోతే రైతుబంధుకు అర్హులు కారనే ప్రచారం కూడా జరిగింది. దీనితో సన్నరకం సాగు చేశామని రైతులు అందరూ అంటున్నారు. దొడ్డురకం ధాన్యానికి మద్దతు ధర ఏ-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.1888. బి-గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.1868 చొప్పున ఖరారు చేసారు. కానీ సన్నరకం పంట దిగుబడి సగానికి సగం తగ్గింది. అయినా ప్రభుత్వం ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు దళారుల చేతిలో తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సన్న వడ్లకు క్వింటాలుకు రూ.2500 చొప్పున గిట్టుబాటు ధర కల్పించి ప్రతి గింజ కొనుగోలు చేయాలి.
తెలంగాణలో వరి సాగు ఉత్పత్తి ఖర్చు కూడా చాలా ఎక్కువ. ప్రభుత్వ వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం క్వింటాలు వరి ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు రూ.2,529. కేంద్రం మద్దతు ధరలను ప్రకటించేటప్పుడు సమగ్ర ఉత్పత్తి ఖర్చును కాకుండా కేవలం పంటసాగు ఖర్చును, కుటుంబ సభ్యుల శ్రమను (ఫ్యామిలి లేబర్‌) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. దాని ప్రకారం చూస్తే తెలంగాణలో మద్దతు ధరలకు ప్రాతిపదికగా తీసుకుంటున్న ఉత్పత్తి ఖర్చు రూ.1245 మాత్రమే. సీఏసీపీ వరి ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధర ఈ సంవత్సరం కేవలం రూ.1,888. ధాన్యం ఎఫ్‌సీఐ రూపొందించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుంది. ఈ సంవత్సరం స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం క్వింటాలు ధాన్యానికి రూ.3,793 మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయినా కేంద్ర ప్రభుత్వం జాతీయ సగటు ప్రకారమే మద్దతు ధరలను ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర అవసరాలకు రైతులతో సన్నరకం ధాన్యాన్ని సాగు చేయించింది. దానికితోడు గత రెండేండ్లుగా పంటల బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. బ్యాంకులు గతంలో పంటరుణం తీసుకున్న ప్రతి రైతుకు నిర్బంధంగా ఇన్సూరెన్స్‌ చేసేవి. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటరుణం తీసుకున్న ప్రతి రైతు తన ఇష్టం ఉంటేనే ఇన్సూరెన్స్‌ చేసుకోవచ్చనే నిబంధనతో ఈ సంవత్సరం బ్యాంకులు కూడా సరిగా ఇన్సూరెన్స్‌ చేయలేదు. ఈ సంవత్సరం పంట రుణం తీసుకున్న ప్రతి రైతు ఇన్సూరెన్స్‌ విషయంలో నష్టపోయినట్టే. రాష్ట్రంలో 90శాతం మంది చిన్న, సన్నకారు రైతులు నిరక్షరాస్యులే. కాబట్టి బ్యాంకులు ఇప్పటినుంచి అయినా రైతులతో మాట్లాడి తప్పకుండా క్రాప్‌ ఇన్సూరెన్స్‌ చేయాలి. వరి ధాన్యం కోత యంత్రాల కిరాయిలు గంటకు రూ.3500 చేరుకున్నాయి. ఒక గంటకు కేవలం ఐదు లీటర్ల డీజిల్‌ మాత్రమే అవసరముంటుంది. రైతుల అవసరాల దృష్ట్యా యంత్రాల రేటు బాగా పెంచారు. దీనిపైన కూడా ప్రభుత్వ నియంత్రణ అవసరం. సాపేక్షికంగా కూలీ రేట్లు రోజుకు రూ.400 పెరిగాయి. ఈ నేపథ్యంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.20 వేలు నష్టపరిహారం అందించాలి.
ఈ సంవత్సరం రాష్ట్రంలో 60.78లక్షల ఎకరాలలో రైతులు పత్తి పంట సాగుచేశారు. మామూలు రోజులలో పత్తి దిగుబడి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ళు వచ్చేది. కాని భారీ వర్షాలకు అది పూర్తిగా దెబ్బతిన్నది. ఎకరానికి 2-3 క్వింటాళ్ళకు మించి దిగుబడిలేదు. పత్తి తీయడానికి కూలీరేట్లు బాగా పెరిగాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా ప్రకారం పత్తి సమగ్ర ఉత్పత్తి ఖర్చు క్వింటాలుకు రూ.9,469. మద్దతు ధరలను ప్రకటించడానికి సీఏసీపీ తీసుకున్న సగటు ఉత్పత్తి ఖర్చు రూ.3676 మాత్రమే. దీని ఆధారంగా ఈ సంవత్సరం పత్తికి లభించే కనీస మద్దతు ధర కేవలం రూ.5,825. ఫలితంగా తెలంగాణలో పత్తి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పైగా ఈ సంవత్సరం బీమా కూడా అమలు కావడం లేదు. దీనికి తోడు నాణ్యతా ప్రమాణాలను మరింత సవరించి ఈ సారి 12శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొంటామని షరతు విధించింది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరను అందించడానికి తేమ శాతాన్ని కనీసం 18వరకూ పెంచకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వమే పత్తి విస్తీర్ణం పెంచేలా చేసింది. కాబట్టి మొత్తం పత్తిని సీసీఐ మద్దతు ధరలకు కొనేలా తానే బాధ్యత తీసుకోవాలి. వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రామాణికాల అనుసరించి ప్రభుత్వమే పత్తిరైతులకు ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలి.

- పులి రాజు
సెల్‌ 9908383567



మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...

తాజా వార్తలు

09:43 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

09:35 PM

అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు

09:10 PM

మెదక్‌లో దారుణం...

09:02 PM

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్

08:47 PM

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

08:24 PM

ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం

08:20 PM

భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత

07:57 PM

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి

07:34 PM

రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం

07:19 PM

మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!

07:12 PM

మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి

07:04 PM

పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి

06:33 PM

ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి

06:24 PM

ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌

06:07 PM

ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700

05:50 PM

ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు

05:32 PM

గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..

05:26 PM

బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి

05:20 PM

వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

05:11 PM

నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

05:08 PM

పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్

04:52 PM

పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి

04:46 PM

జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

04:41 PM

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై

04:38 PM

పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!

04:29 PM

వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..

04:17 PM

మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి

04:12 PM

రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి

04:05 PM

నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

04:02 PM

రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.