Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం

మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు వ్యవసాయంలో కీలక పాత్రధారులైన వివిధ వర్గాలు, ఆర్థిక తరగతులపై ఏ తరహా ప్రభావాన్ని ఏ మేరకు చూపించ నున్నాయన్న విషయాలను వివరించేందుకు ఉద్దేశించిన వ్యాసాల్లో మొదటిది ఈ వ్యాసం. ఈ వ్యాసంలో కాంట్రాక్టు వ్యవసాయ చట్టం దేశంలోని కౌలు రైతుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించనుందో పరిశీలిద్దాం. దేశంలో వ్యవసాయక కమతాలు, సేద్యం తీరు తెన్నుల గురించి జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) వివరాలు సేకరించి విశ్లేషణాత్మక నివేదికలు ప్రభుత్వానికి అందచేస్తుంది. ఈ నివేదికలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసే వారికి ప్రత్యేకించి వ్యవసాయం తీరుతెన్నులు అధ్యయనం చేయదల్చు కున్న వారికి ప్రధానమైన ముడిసరుకు. అంతేకాదు, వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాలు రూపొందించే విధానాలకు కూడా ఇవే నివేదికలు కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. అందువల్ల నా ఈ పరిశీలనకు కూడా ఇవే నివేదికలను ఆధారం చేసుకుంటున్నాను. దురదృష్టవ శత్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఇటువంటి సర్వేలు నిలిచిపోయాయి. దేశంలో వ్యవసాయ కమతాలు, రైతాంగం ఆదాయాల గురించిన వివరాలు 2013 తర్వాత అందుబాటులో లేవు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2013లో విడుదల చేసిన 70వ దఫా సర్వే నివేదిక అంచనాలు ఇలా ఉన్నాయి.
దేశంలో 2013 నాటికి 141 మిలియన్‌ హెక్టార్ల నికర సాగు భూమిని 156.1మిలియన్‌ కుటుంబాలు సాగు చేస్తున్నాయి. 1970 నాటికి మొత్తం సాగుదారుల్లో 15శాతంగా ఉన్న కౌలుదారులు మొత్తం సాగవుతున్న భూమిలో 10.6శాతం భూమి సాగు చేస్తున్నారు. 1970-90 దశకాల్లో కౌలుకివ్వటం గణనీయంగా తగ్గింది. దీనికి ఓ కారణం 1970 దశకం నాటికి కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన భూ సంస్కరణల చట్టాలు. రెండో కారణం సాగుదారులను లక్ష్యంగా పెట్టుకుని అమలు చేసిన కనీస మద్దతు ధరలు, వ్యవసాయక సబ్సిడీలు, లెవీ ధాన్యం సేకరణ, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పత్తి సేకరణ వంటి అనేక విధానాలు. ఈ పద్ధతుల ద్వారా ప్రభుత్వం వ్యవసాయంలో తీసుకున్న చర్యల కారణంగా 1980-1985 వరకూ సేద్యం గిట్టుబాటుగానే ఉంది. దాంతో 1970 నాటికి 25శాతంగా ఉన్న కౌల్దారులు 1990 నాటికి తొమ్మిదిశాతానికి పడిపోయారు. అంటే దాదాపు 17శాతం కౌలుదారులు తగ్గిపోయారు. వీరంతా పొట్టపోసుకోవటం కోసం వ్యవసాయ కూలీలుగా మారారు. 1990-2013 మధ్య కాలంలో ప్రభుత్వాలు స్థూలంగా అనుసరించిన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వ్యవసాయ రంగానికి ఇస్తున్న మద్దతు, రాయితీలు కూడా కోతకోసింది. ప్రభుత్వ సహకారం లేకుండా ఏ దేశంలోనూ వ్యవసాయం గిట్టుబాటు కాదు. దాంతో ఫలసాయం మీద వచ్చే ఆదాయం కంటే కౌలు రూపంలో వచ్చే ఆదాయం నికరంగా ఉండే పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా కౌలుసేద్యం ఒకింత పుంజుకోవటం మొదలైంది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ, తెలంగాణల్లో కౌలుదారుల సంఖ్య మూడురెట్లు అధికంగా ఉండటం గమనించాల్సిన విషయం. ఏపీలో 1991 నాటికి మొత్తం సాగుదారుల్లో 21శాతంగా ఉన్న కౌలు దారులు 2012 నాటికి 42శాతానికి పెరిగితే తెలంగాణలో 1991 నాటికి కేవలం ఐదుశాతంగా ఉన్న కౌలుదారులు 2012 నాటికి 20శాతానికి పెరిగారు.
ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు కౌలుదార్ల రక్షణ చట్టం ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టు సేద్యం చట్టం ఆమోదించింది. ఈ చట్టం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న కౌలుదారుల కుటుంబాలు వ్యవసాయానికి దూరం కానున్నాయి. తిరిగి వ్యవసాయ కూలీల జాబితాలోనో లేక గ్రామీణ శ్రామికుల జాబితాలోనో చేరనున్నాయి. తాజా చట్టం స్వాతంత్య్రానంతరం 1955 నుంచి 1970 దశకం మధ్య కాలంలో ఉనికిలోకి వచ్చిన వ్యవసాయక సంస్కరణల చట్టాల స్ఫూర్తికి పూర్తి భిన్నంగానూ, వ్యతిరేంకగానూ ఉంది. నాటి చట్టాలు రైతు ప్రయోజనాలు నేపథ్యంగా పెట్టు కుని వస్తే నేటి చట్టాలు వ్యవసాయో త్పత్తుల వాణిజ్యం నేపథ్యంగా పెట్టుకుని వచ్చాయి.
కాంట్రాక్టు సేద్యం చట్టం నేరుగా కౌలుదారుల కడుపు కొట్టే చట్టం అని చెప్పటానికి మరో కారణం కూడా ఉంది. కౌలుకు ఇచ్చే రైతులు సాధారణంగా చిన్న కమతాల రైతులే. ఇప్పుడున్న గ్రామీణ ఆర్థిక జీవితంలో స్థూలంగా కౌలు పంటదిగుబడి మోతాదుపై ఆధారపడి ఉంది. మరింత లోతుగా పరిశీలిస్తే ఆహారపంటల్లో కౌలుసాగు చేసే కుటుంబాలు వాణిజ్య పంటల్లో కౌలుసాగు చేసే కుటుంబాలకంటే ఎక్కువగా ఉన్న విషయం స్పష్టమవుతుంది. కొత్త చట్టం పంట దిగుబడితో నిమిత్తం లేకుండా కౌలు చెల్లింపుల నిర్ధారణ, చెల్లింపు ఉండాలని ఆదేశిస్తోంది. ఇది ఓ రకంగా భూమి స్వంతదారుకు కాస్తంత ఊరట కలిగించే అంశమే. సాగు సాధకబాధకాలతో నిమిత్తం లేకుండా తన కౌలు సొమ్ము దక్కుతుందన్న భరోసా భూ యజమానికి ఉంటుంది. అదే సమయంలో ఈ కౌలు ఒప్పందాలు ఏ పంటకాలానికి ఆ పంటకు వేర్వేరుగా కుదుర్చుకోవాలని చట్టం చెబుతున్నా ఈ చట్టం అసలు ఉద్దేశ్యం అది కాదు. దీర్ఘకాలిక సేద్యపు కాంట్రాక్టులు ఉంటే తప్ప కాంట్రాక్టు సేద్యంలో ప్రయివేటు కంపెనీలు, వ్యవసాయోత్పత్తుల ఆధారిత ప్రాసెసింగ్‌ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టవన్నది 2001 నుంచీ 2014 వరకూ కేంద్రం నియమించిన వివిధ కమిటీల అంచనా. నిర్ధారణ. ఈ రకంగా చూసుకున్నప్పుడు చిన్న కమతం స్వంతదారు లేదా పెద్ద కమతం స్వంతదారు అన్న తేడా లేకుండా దీర్ఘకాల ఒప్పందాలకు సిద్ధపడ్డవాళ్లతోనే ప్రయివేటు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చు కుంటాయి. తదగనుగుణంగానే అధిక లాభాలు ఆర్జించే వాణిజ్య పంటలు సాగు చేస్తాయి. అంతో ఇంతో నికర ఆదాయం గ్యారంటీ కోరుకుంటున్న భూ యజమాని కౌలురైతుకు భూమి ఇవ్వటానికి బదులు కాంట్రాక్టు సాగుకు ఇవ్వటానికి సిద్ధపడతాడు. ఇది రైతులను దెబ్బతీసేదే అయినా ఈ పరిస్థితుల్లో తక్షణం నష్టపోయేది కౌలుదారీ రైతు కుటుంబాలే.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కౌలుదారీ సేద్యం చుట్టూ నిర్మితమైన ఆర్థిక వ్యవస్థ ఓ కీలక భాగాన్ని ఆక్రమించి ఉంది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే జాతీయ స్థాయిలో 10శాతానికి పైగా కుటుంబాలు కౌలుసేద్యంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. కొత్త కాంట్రాక్టు సేద్యం చట్టంతో ఈ పదిశాతం కుటుంబాలు అంటే సుమారు 13కోట్ల మంది జీవనోపాధి ప్రమాదంలో పడనుంది. అంతేకాదు. దీర్ఘకాలిక ఒప్పందాలకు సిద్ధం కాని భూ యజమానులు, సిద్ధమైన భూ యజమానుల మధ్య పోటీ పెట్టి కార్పొరేట్‌ సంస్థలు లబ్దిపొందటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇష్టం ఉన్నా లేకున్నా తమ పొలాలు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాల్సిన దుస్థితికి రైతు నెట్టబడతాడు. అంటే ప్రభుత్వం భూసేకరణ సమయంలో అనుసరిస్తున్న వ్యూహం లాంటివన్నమాట.
అన్నిటిని మించి గ్రామీణ వేతన వ్యవస్థ మీద ఈ కాంట్రాక్టు సేద్యం చూపించే ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఇప్పటికే సాగులో దొరికే పనిదినాలు తగ్గిపోతున్నాయి. భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య ఈ రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. తాజా సంస్కరణలు మరో జీవనోపాధి లేని గ్రామీణ శ్రామికుల సంఖ్యను గణనీయంగా పెంచనున్నాయి. ఇప్పటికే అరకొర కూలి కోసం ఆరాటపడే పరిస్థితి ఈ చట్టాలతో మరింత దిగజారనుంది. కాంట్రాక్టు సేద్యం చట్టంతో కోట్లాదిమంది కౌలురైతులు జీవనోపాధి కోల్పోనున్నారు. గ్రామీణ వేతనాలు మరింత నేలచూపులు చూసే పరిస్థితి దాపురించనున్నది. ఈ చట్టాల పర్యవసానంగా నష్టపోనున్న గ్రామీణ ఆర్థిక సామాజిక తరగతులను ఆదుకునేందుకు ఈ చట్టంలో ఎటువంటి ఏర్పాట్లూ లేవు. ఏతావాతా ఈ చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనుందనటంలో సందేహం లేదు.

- కొండూరి వీరయ్య
సెల్‌: 9871794037





మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అసలు వార్తలకు విషమపరీక్ష
డిస్కాంల నిర్వహణ లోపం-అప్రకటిత కోతలు
గుర్తింపు కోసం ఆశా కార్మికుల పోరాటం
లాఠీలతోనే ప్రజాభిప్రాయ సేకరణ!
''కార్మిక-కర్షక పోరుయాత్ర''
నా రైతు - నవ చరిత
మాయమవుతున్న రాజ్యాంగ మౌలిక స్వభావం
దేశభక్తి, మతం, ఆరెస్సెస్‌ భావజాలం
సమరం జయిస్తుంది...
మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు

తాజా వార్తలు

07:08 AM

లాక్ డౌన్ ఆంక్షలు మరోసారి పొడగించిన కేంద్రం..

06:59 AM

నేడు తెలంగాణలో 37వేల మందికి టీకాలు

06:52 AM

నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. యూపీలో పోటీకి రెడీ..!

06:44 AM

ఆకాశంలో గుర్తు తెలియని వస్తువును గుర్తించిన పాకిస్థాన్ పైలట్

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.