Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆధునిక వర్గపోరాటం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 18,2021

ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆధునిక వర్గపోరాటం

రైతుల దీక్షలకు మద్దతు తెలపడానికి ఖమ్మం నుంచి 2వ తేదీ ఉదయం 5గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్ళాం. ముందు అఖిల భారత కిసాన్‌సభ ఆఫీస్‌కు చేరుకొని అక్కడి నుంచి సింఘూ బోర్డర్‌కు బయలుదేరాం. సరిగ్గా 5కిలోమీటర్ల దూరం ఉందనగా పోలీసులు ఔట్‌పోస్ట్‌ పెట్టి రైతులను చేరేందుకు అనుమతివ్వకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ ఎన్నో అవరోధాలను అధిగమించి ఎలాగోలా రైతుల దీక్షలకు చేరుకొని, మూడు రోజుల పాటు వారితో కలిసి పోరాడాం. పంజాబ్‌ గదర్‌ వీరుల వారసులతో, భగత్‌ సింగ్‌, ఉద్ధామ్‌ సింగ్‌, కర్తార్‌ సింగ్‌ శరభల వారసులతో కలవడం గొప్ప అనుభూతినిచ్చింది. అక్కడ ఐఐటీ విద్యార్థులు మేం చేరుకోగానే మా పాదరక్షలు తుడిచి శుభ్రంచేసి దేశానికి వెన్నెముక అయిన రైతుల దీక్షలకు మద్దతు తెలుపుతున్న మీరు నిజమైన దేశభక్తులని చెప్పడం భావోద్వేగానికి గురిచేసింది. వారిచ్చిన ఉద్యమ స్ఫూర్తి వర్ణణాతీతం. మరుసటి రోజు పానిపట్‌ యుద్ధానికి నాయకత్వం వహించిన యుద్ధ వీరుల మనవలు, మనవరాళ్ల నాయకత్వంలో ఢిల్లీకి 120కిలోమీటర్ల దూరంలో లక్షలాది మంది రైతులతో పోరాటం నిర్వహిస్తున్న టిక్రీ బోర్డర్‌కు వెళ్ళి పాల్గొన్నాం. ఇప్పుడు ఢిల్లీని నలువైపులా ముట్టడించి, మోడీ-షాల దుర్మార్గ పాలన మెడలు వంచడానికి ప్రయత్నిస్తున్నది ఈ రైతు ఉద్యమం.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల వశంచేసే చట్టాలు తెచ్చారు. పౌరహక్కులను కాలరాశారు. ఎదురులేదన్నట్టుగా విర్రవీగుతూ ముందుకు సాగుతున్న మోడీషా రథం ఇప్పుడు రైతుల ప్రతిఘటనతో ఇరకాటంలో పడింది. ఆ ఉద్యమం మరింత విశాలమై, బలం పుంజుకుని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ ఉద్యమం విస్తరించి ఈ దేశ ప్రజల స్వప్నం సాకారం కావాలని కోరుకుందాం. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, హిందూత్వం కోరలు చాచి విస్తరిస్తున్న ఈ చీకటి సమయంలో కాంతిరేఖలా పొడుచుకొచ్చింది రైతు ఉద్యమం. చార్లెస్‌ డికెన్స్‌ రెండు మహానగరాలు ప్రారంభంలో రాసినట్టు.. ''ఇది ఎంత విచారకరమైన, విషాదగ్రస్తమైన, నిరాశాజనకమైన వల్లకాటి అధ్వాన్న శకంగా కనబడుతున్నప్పటికీ, అదే సమయంలో ఇది ఒక ఉత్సాహభరితమైన, ఉత్తేజకరమైన, ఆశా సూచనలు వెల్లివిరుస్తున్న వైభవోజ్వల శకం కూడా.'' ప్రజావ్యతిరేక దుర్మార్గశక్తుల దుందుడుకు వేగం ఎంత నిజమో, ప్రజా చైతన్య సమీకరణ, ప్రతిఘటన, సమరోత్సాహం కూడ అంతే నిజం. నిజంగానే గడిచిన ఐదు సంవత్సరాలు, మరీ ముఖ్యంగా గడిచిన సంవత్సరం ప్రపంచం మొత్తంగానూ, దేశంలోనూ, రాష్ట్రంలోనూ నిరాశాజనకమైన ప్రజావ్యతిరేక పరిణామాలెన్నో సంభవించాయి. అనేక దేశాలలో అభివృద్ధి నిరోధక శక్తులు అధికారానికి వచ్చాయి. అంతర్జాతీయంగా సామ్రాజ్యవాద శక్తులదే పైచేయి అయింది. దేశంలో నరేంద్రమోడీ-అమిత్‌షా ద్వయం అత్యంత ఆధిక్యతతో గద్దెనెక్కింది. అంతర్జాతీయం గానూ దేశీయంగానూ ఆర్థిక సంక్షోభం వడివడిగా పరుగెత్తుకొస్తున్నది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కనీస పౌర, ప్రజాస్వామిక హక్కుల మీద ఉక్కుపాదం అమలవుతున్నది. ఎటు చూస్తే అటు నిరాశ, అటు దుఃఖం. నిజమే. కాని, అదే సమయంలో అన్ని ఖండాలలోనూ అనేక దేశాలలో రాజధాని నగరాలలో, కీలక స్థలాలలో ఉవ్వెత్తున లేచి నిలిచి అధికారాన్ని ప్రశ్నిస్తున్న లక్షలాది ప్రజా సమూహాలు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ధిక్కారం చుట్టూ రాతిగోడలు కట్టి బంధించిన కొద్దీ ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు బండల మధ్య నుంచి తొంగిచూస్తున్న చిగుళ్ల స్వేచ్ఛాగీతాలు ఈ సమూహాలు. అణచివేసిన కొద్దీ ఉక్కుపాదాలను పడదోస్తున్న చైతన్య సంకేతాలు ఈ ఉద్యమాలు. ఈ రైతు ఉద్యమంపైకి చూడటానికి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ రంగ చట్టాల ఉపసంహరణ అనే పరిమిత లక్ష్యంతో సాగుతున్నట్టు కనబడుతున్నది గానీ... నిశితంగా పరిశీలిస్తే అందులో మరెన్నో కోణాలున్నాయి. ఇది ఈ దేశపు రైతాంగ చైతన్యం ఎంత క్రియాశీలమైనదో ఎలుగెత్తుతున్నది. రైతాంగం తలచుకుంటే ప్రభుత్వాన్నీ, కార్పొరేట్లనూ ప్రతిఘటించగలదని చూపుతున్నది. చలికాలపు ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నా ప్రజల పోరాట దీక్ష చెక్కు చెదరడం లేదంటే ఈచట్టాల ప్రమాదం ఎంత తీవ్రమైనదో, రైతుల సంకల్పం ఎంత ధృడమైనదో అర్థమవుతున్నది. చర్చలంటూ పిలుస్తూ, అసలు విషయాలు చర్చించ కుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ కార్పొరేట్‌ దాస్య స్వభావాన్ని ఈ ఉద్యమం బట్టబయలు చేస్తున్నది. ఒక నిజమైన ప్రజా సమస్య మీద, విస్తృతమైన భాగస్వామ్యంతో సాగుతున్న ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకుండా, అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పుడు విశ్లేషణలు చేస్తూ కాలం గడుపుతున్న ప్రధాన స్రవంతి ప్రచార సాధనాలు పాలకవర్గాల పెంపుడు పక్షులనే వాస్తవాన్ని ఈ ఉద్యమం ఎత్తి చూపుతున్నది. నిజమైన ప్రజా ఉద్యమం విశాలమైన ప్రజా సంఘీభావాన్ని కూడగట్టుకోగలదని చాటిచెపు తున్నది. అది ఇప్పటికే ప్రజా చైతన్యాన్ని విస్తరించడంలో విజయం సాధించింది. ఆ ప్రజా చైతన్యాన్ని అందిపుచ్చుకుని, మరింత విశాలం చేసి, మరిన్ని ప్రజారాశులలోకి ప్రవహింపజేసే ప్రజాశక్తుల కోసం ఈ దేశం ఎదురుచూస్తున్నది.

- యం.ఎ. జబ్బార్‌
సెల్‌ : 9177264832




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమాయకులను బలిగొన్న 'ఉపా' చట్టం
ఘజియాబాద్‌ సమీపాన.. దాస్నా గ్రామంలో...
భగభగలు...
ఇతరులకు చెప్పేందుకే...
కుసంస్కారమే.!
బీజేపీ, మోడీల పరిధిని మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా
మోటారు వాహనాల స్క్రాప్‌ పాలసీ ఆంతర్యం ఏమిటీ?
ఉద్యోగుల్లో విభజనరేఖలు సమంజసమా?
విశ్వాసం ఉన్నచోట విశ్లేషణ ఉండదు
నిరంకుశ పాలనకు మచ్చుతునక బీహార్‌ పోలీస్‌ చట్టం
ప్రణాళికా రహిత ఇండ్ల లేఅవుట్లు
మోడీ ప్రధాని అయిన వేళా విశేషం
అమెరికా నౌక - అక్రమ చొరబాటు
కోవిడ్‌ విజృంభిస్తోంది.. ప్రభుత్వం ఏంచేస్తోంది..?
వి'ప్లవ' నామ సంవత్సరం
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నివాళి
ఆయన అమరత్వం చిరకాలం...
ప్రధాని పాఠాల ప్రయోజనమేమిటి?
పాలక వర్గాలు - పేదలపట్ల శ్రద్ధ
లాల్‌ సలామ్‌!
ఐదు మూసుడు పది అమ్ముడు
చిరకాల స్పూర్తి....... మన బొజ్జి !!
పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.