Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నూతన విద్యావిధానం - కార్పొరేట్లకు దాసోహం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 19,2021

నూతన విద్యావిధానం - కార్పొరేట్లకు దాసోహం

కస్తూరి రంగ రాజన్‌ కమిటీ 2019 మార్చిలో జాతీయ విద్యావిధానం ముసా యిదాను ప్రవేశ పెట్టడం, అందులోని అప్రజాస్వామిక, అభివృద్ధి నిరోధక ధోరణులను విమర్శకు పెడుతూ పెద్దఎత్తున చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అవేవీ పరిగణనలోకి తీసుకో కుండానే, పార్లమెంటులో పెట్టకుండానే చర్చలేకుండానే మంత్రిమండలి ఆమోదంతో 'జాతీయ విద్యావిధానం 2020'ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం 'తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి' అంటున్నది. ఈ నూతన విద్యావిధానం-2020 ప్రాచీనమూ, శాశ్వతమూ అయిన భారతీయ జ్ఞానానికి సంబంధించిన సంపద్వంతమైన వారసత్వం వెలుగులో రూపొందించబడినట్టుగా చెప్పడమే దాని పునాదిని సూచిస్తున్నది. సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిని ప్రత్యక్ష అనుభవం నుంచి తెలుసుకోవడానికి విద్యార్థులను భిన్న ప్రాంతాల పర్యటనకు తీసుకువెళ్లాలని, అందుకు ఒక వంద పర్యాటక క్షేత్రాలను గుర్తించాలని చెప్పిన సందర్భంలో 'ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌' భావన ప్రస్తావనకు వచ్చింది. అలాగే ఇందులో భాషల బోధన, అధ్యయనాల గురించి చెప్పే సందర్భంలోనూ ప్రస్తావనకు వచ్చిన 'ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌' భావన భిన్నత్వాలను, బహుళత్వాలను రద్దు చేసే ఆధిపత్య సంస్కృతీ ప్రతిధ్వని తప్ప మరొకటి కాదు. ప్రతి పాఠశాల విద్యార్థి 'ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌' భావన దృష్ట్యా భారతీయ భాషలలో సరదాగా ఒక ప్రాజెక్ట్‌ చేయాలని అందువల్ల ప్రధాన భారతీయ భాషల ఉచ్చారణ, వర్ణమాల, లిపి, సాధారణ వ్యాకరణ నిర్మాణం, పదజాల సంస్కృత మూలాలు, వాటి పరస్పర సంబంధాలు, భేదాలు తెలుసుకోవడం సాధ్యం అవుతుందని, తద్వారా భాషకు ఉన్న శక్తి అర్థం అవుతుందని చెప్తూనే సంస్కృతం గురించి 'అదొక జ్ఞాన వ్యవస్థ' అని ప్రత్యేక పూనికతో చెప్పడం, సంస్కృతాన్ని పాఠశాల విద్యలో ఒక ఐచ్ఛిక విషయంగా ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాన స్రవంతిలోకి తేవాలి అని చెప్పడం, సంస్కృత విద్యాలయాల ప్రస్తావన మొదలయినవన్నీ విద్య కాషాయీకరణ ప్రమాదాన్ని సూచించేవే. కోర్సుల రూపకల్పన ఎలా ఉంటుంది? పాఠ్య విషయాలు ఏముంటాయి? నిర్ణయాధికారం ఎవరిది? ఉద్యోగ పరికల్పనలో వీటికి ఉన్న ప్రమేయం ఏమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానం లేదు. భారతీయ భాషా జ్ఞానం వ్యక్తి ఉద్యోగార్హతలలో ఒకటిగా చేయాలన్నారు. అందువల్ల అదనంగా ఒరిగేది ఎమన్నా ఉన్నదా? భారతీయ భాషా జ్ఞానం అవసరం ఉన్న ఉద్యోగాలు పెరగకుండా అందువల్ల సమకూరే ప్రయోజనం ఉంటుందా? - అన్నీ ప్రశ్నలే. ఈనాడు విద్యారంగంలో కార్పొరేట్‌ ప్రయోజనాలకు అనుగుణమైన అంతర్జాతీయ వైఖరులను అమలు చేయడానికే 'బహుళ కళా జ్ణానం' అన్న భావన ముందుకు తెచ్చింది. గుణాత్మక విద్య ద్వారా ప్రపంచంలోనే అత్యున్నత జ్ణానశక్తి (గ్లోబల్‌ నాలెడ్జ్‌ సూపర్‌ పవర్‌)గా దేశాన్ని అవతరింపచేయడం ఈ నూతన విద్యా విధానానికి అంతిమ గమ్యమట. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాల ప్రాతిపదికగా ప్రపంచ దేశాల మానవాభివృద్ధి సూచికలో అన్నిటా దిగువ స్థానాలతో సంతృప్తి పడిన దేశాన్ని అత్యున్నత జ్ఞానశక్తిగా అవతరింప చేయడం ఎలా సాధ్యమో వీరికి ఎవరు చెప్పాలి? ఈ జ్ఞాన ఆధిక్యత దృష్టి దేశంలో జ్ఞాన వైవిధ్యాన్ని అణగదొక్కి ఒకే రకమైన జ్ఞానాన్ని సర్వోతష్టమైనదిగా, శ్రేష్టమైనదిగా స్థాపించే ఫాసిస్ట్‌ సంస్కృతిని పరివ్యాప్తి చేసే ప్రమాదమే ముందు ఉన్నది. సామాజిక న్యాయం, సమానత్వం సాధించడానికి ఉన్న ఏకైక గొప్ప సాధనం విద్య అని ఈ నూతన విద్యావిధానం-2020 పేర్కొంటున్నది. 2040 నాటికి సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరికీ అత్యున్నత గుణాత్మక విద్యకు సమాన అవకాశాలు సాధించడం గురించి వాగ్దానం కూడా చేసింది. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇవి శూన్య హస్తాలు చూపే శుష్క ప్రియాలు మాత్రమే అని సులభంగా అర్థమవుతుంది. అందరికీ ప్రత్యేకించి సామాజిక, ఆర్థిక అననుకూలతలలో ఉన్న సమూహాలకు చదువుకునే అవకాశాలు కల్పించడానికి పాఠశాల విద్య బహుముఖ మార్గాలలో విశాలం కావలసి ఉంటుందని అంటూ అందుకు ఫార్మల్‌, నాన్‌ ఫార్మల్‌ విద్యా విధానాలను సిఫారసు చేసింది ఈ నూతన విద్యావిధానం-2020. ఆ రకంగా అసమ సంస్కృతికి ఈ విద్యా విధానం రాస్తాను మరింత విశాలం చేసేదిగా ఉంది.
ఎక్కువ మందికి గుణాత్మక ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే సహజ మార్గం 'ఆన్‌లైన్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌' అని పేర్కొనడం గమనిస్తే రాబోయే బహుళ జ్ఞాన కేంద్రాలుగా ఉండే విశాల విద్యా సంస్థలు ఎవరి కోసమో సులభంగానే అర్థమవుతుంది. అయితే ఈ లెర్నింగ్‌ అనేది ఇప్పటికే మార్కెట్‌ సరుకుగా స్థిరపడింది. నూతన విద్యావిధానం దానిని వ్యవస్థీకృతం చేయడానికి సంకల్పించిందే తప్ప మరొకటి కాదు. విద్యారంగాన్ని ఆశ్రయించి ఆర్థిక సంపదను రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంపదగా మార్చడానికి జరుగు తున్న అంతర్జాతీయ కుట్రలో భాగంగా వచ్చిన ఈ నూతన విద్యావిధానం భారతీయమైనది అనుకుంటే పొరపాటే. ఆ పేరు మీద ప్రపంచ పెట్టుబడికి భారతీయ విద్యారంగాన్ని తాంబూలంలో పెట్టి అప్పజెప్పడమే జరగబోయేది. తస్మాత్‌ జాగ్రత్త!

- ఎన్‌. శ్రీనివాస్‌
సెల్‌ : 9676407140




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమాయకులను బలిగొన్న 'ఉపా' చట్టం
ఘజియాబాద్‌ సమీపాన.. దాస్నా గ్రామంలో...
భగభగలు...
ఇతరులకు చెప్పేందుకే...
కుసంస్కారమే.!
బీజేపీ, మోడీల పరిధిని మించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండా
మోటారు వాహనాల స్క్రాప్‌ పాలసీ ఆంతర్యం ఏమిటీ?
ఉద్యోగుల్లో విభజనరేఖలు సమంజసమా?
విశ్వాసం ఉన్నచోట విశ్లేషణ ఉండదు
నిరంకుశ పాలనకు మచ్చుతునక బీహార్‌ పోలీస్‌ చట్టం
ప్రణాళికా రహిత ఇండ్ల లేఅవుట్లు
మోడీ ప్రధాని అయిన వేళా విశేషం
అమెరికా నౌక - అక్రమ చొరబాటు
కోవిడ్‌ విజృంభిస్తోంది.. ప్రభుత్వం ఏంచేస్తోంది..?
వి'ప్లవ' నామ సంవత్సరం
రాజ్యాంగ రక్షణే అంబేద్కర్‌కు నివాళి
ఆయన అమరత్వం చిరకాలం...
ప్రధాని పాఠాల ప్రయోజనమేమిటి?
పాలక వర్గాలు - పేదలపట్ల శ్రద్ధ
లాల్‌ సలామ్‌!
ఐదు మూసుడు పది అమ్ముడు
చిరకాల స్పూర్తి....... మన బొజ్జి !!
పంచతంత్రంలో పారని మోడీమంత్రం!
క్రాంత దర్శి
తారా లోకం!
పాఠశాల విద్యలో వినూత్న పథకం ఎలా ఉండాలి..?
న్యాయవ్యవస్థే చట్టాన్ని ధిక్కరిస్తే...?
భాయీ భాయీ..
మన పురాణ పాత్రల మూలాలు ఈజిప్టులో ఉన్నాయా?
ఆన్‌లైన్‌ విద్యతో విద్యార్థులకు ఒరిగేదెంత?

తాజా వార్తలు

10:04 PM

తొలి వికెట్ కోల్పో‌యిన ఢిల్లీ‌

09:49 PM

కరోనా రెండో వేవ్‌..ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి..!

09:02 PM

20 నుంచి నైట్ క‌ర్ఫ్యూ

08:42 PM

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. మరో 15మంది..

08:25 PM

రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

08:10 PM

భయాందోళనలో నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్

08:01 PM

కరోనా టెస్టులు చేయాలా..రికమండేషన్ తప్పనిసరి

07:25 PM

సరికొత్త రికార్డు సృష్టించిన బెంగుళూరు యువకుడు

06:57 PM

ఉపఎన్నికకు టీఆర్ఎస్ దూరం

06:29 PM

వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు మృతి

06:18 PM

మసీదు​లో కాల్పులు.. ఒకే కుటుంబంలో 8మంది మృతి

06:02 PM

ఒలంపిక్స్ లో క్రికెట్ కు అంగీకరించిన బీసీసీఐ

05:55 PM

తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్

05:48 PM

నాలుగు రోజుల్లో నగర వ్యాప్తంగా శానిటేషన్ : జీహెచ్ఎంసీ

05:38 PM

దంచికొట్టిన ఆర్సీబీ.. కోల్ కతా లక్ష్యం 205

05:26 PM

క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

05:18 PM

గుట్కా ప్యాకెట్ల పట్టివేత

05:00 PM

రేపటి నుంచి జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు..

04:57 PM

టాలీవుడ్ ను విడచిపెట్టనంటున్న హీరోయిన్

04:44 PM

అందరి ముందు అవమానించిన ప్రిన్సిపల్.. బాలిక ఆత్మహత్య

04:29 PM

రోజు వారీ కూలీకి లాటరీలో కోటి రూపాయలు..

04:13 PM

దేశ వ్యాప్తంగా 12కోట్ల డోసుల వ్యాక్సినేపషన్

04:00 PM

భారీగా తగ్గిన రెమిడెసివిర్ ధరలు

03:46 PM

అతి త్వరలోనే మూడో వేవ్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

03:34 PM

రాష్ట్రంలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ..

03:26 PM

ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరి మృతి

03:15 PM

కరోనా సోకకుండా వ్యాక్సిన్ ఆపలేదు..

03:08 PM

భద్రాచల రామయ్య ఆలయంలో పూజలు రద్దు..

02:54 PM

కార్గిల్ మరణాల కంటే కరోనా మరణాలే ఎక్కువ..

02:42 PM

వారం వ్యవధిలో తండ్రీ, కొడుకులను బలి తీసుకున్న కరోనా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.