Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హత్యలు.. న్యాయం.. రాజ్యం.. | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Feb 23,2021

హత్యలు.. న్యాయం.. రాజ్యం..

'పలకరించు దిక్కులేక
న్యాయం విలపిస్తున్నది
నడవండిక నడవండి
చరచరచర చక్రంలా
ప్రగమిస్తూ నడవండోయ్!' - శ్రీశ్రీ

న్యాయ సుంగంధనిలాలు
నింపుము ఈలోకంలో
ఈలోకం నీకోసం
ఎంతపరితపించెనో
పదపదవే గీతమా - మగ్ధూమ్‌

మహాదార్శనికులైన ఈ మహాకవులు ఇద్దరూ తమ తమ దృక్కోణాల్లో న్యాయపథాన్ని విశదీకరిస్తూ.. గీతాల ద్వారా ప్రజల హృదయాలకు హత్తుకునేటట్లు చెప్పారు. ఈ పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో తమ రాజ్యాన్ని, తమ సంపన్న పాలకవర్గాన్ని రక్షించేందుకు స్థూలంగా ఏర్పాటు చేసుకున్న ఉపాంగాలే పోలీసు, న్యాయ యంత్రాలనేది కమ్యూనిస్టుల భావన.
అయినా, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారత రాజ్యాంగానికి లోబడి న్యాయాన్ని రక్షించుకోవడం ప్రజలందరి బాధ్యత, ముఖ్యంగా పాలకుల కర్తవ్యమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇటీవల అత్యంత అమానుషంగా, పట్టపగలు నడిరోడ్డుపై బహిరంగంగా జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు - నాగమణిల దారుణ హత్య దిగ్భ్రమకు గురిచేయడమే కాదు, ప్రకంపనలు సృష్టిస్తున్నది కూడా.
ఏ నేర ప్రమాదం సంభవించినా, తమకు కోర్టులు, న్యాయం కల్పిస్తాయనే భరోసాతో ప్రజానీకం ఉంటుంది. అలాంటి కోర్టులకే జీవగర్ర అయిన న్యాయవాదులకే రక్షణ కొరవడితే సమాజ మనుగడ మాటేమిటి? ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవక మానవు. అందుకే ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తూనే తమ రక్షణ కోసమే ప్రత్యేకంగా చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదుల సంఘాలు నేడు డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థకు, దానిని రక్షించే భారత రాజ్యాంగానికి పాలకవర్గాలు ఉద్దేశపూర్వకంగా తూట్లుపొడుస్తున్న దుర్దశలో మనం ఉన్నాం. కనుకనే శాంతిభద్రతలకు భంగం కలిగించే అరాచక శక్తులు, హింసోన్మాదాలు నానాటికి పేట్రేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని, తత్సంబంధిత సాధనాలను రక్షించుకోవడం ప్రజాతంత్ర వాదులైన ప్రతి ఒక్కరికి పరమావధిగా మారింది.
అధికారపార్టీకి సంబంధించిన స్థానిక నేతలు చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా ఈ న్యాయవాద దంపతులు పోరాడుతున్నట్టు సమాచారం. భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, అక్రమ భూసేకరణ వంటి నేరాల్లో హత్యలు, ఆత్మహత్యలు కొనసాగడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ నేరాలకు వ్యతిరేకంగా వీరు న్యాయపరంగా పోరాడుతున్నారు. అలాగే గతంలో మంథని పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన దళితుడు శీలం రంగం లాకప్‌మరణానికి సంబంధించి కూడా వామనరావు న్యాయపోరాటం చేశాడు. వృత్తి నిబద్దతతో ముందుకు పోవడం ఈ 'అక్రమ' నేతలకు మింగుడుపడలేదు. అందుకే మాటువేసి అంతం చేయడానికే సిద్దమయ్యారు.
'గుర్తుతెలియని వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారని, పోలీసులు కూడా తమపై కక్ష కట్టారని, అందుకే తమపై వివిధ పోలీసు స్టేషన్‌లలో అక్రమ కేసులు బనాయించారని, తమకు ప్రాణహాని ఉన్నదని' కూడా వామనరావు దంపతులు హైకోర్టుకు విన్నవించుకున్నారు. హైకోర్టు కూడా భద్రత కల్పించమని ఆదేశించింది. అయినా ఘోరం జరిగిపోయింది. చట్టాన్ని చేతిలోకి తీసుకునే సంఘ వ్యతిరేక శక్తులకు, చట్టాన్ని కాపాడి అమలు పరిచే పోలీసులు తోడైతే నేరాలు-ఘోరాలు జరగకుండా ఎలా ఉంటాయనేది సాధారణమైన ప్రశ్న.
విశేషమేమంటే ఈ హత్యలను ఖండించాల్సిన పాలకులు నిర్ద్వందంగా ఖండించకపోవడం. ఇదేదో యాదృశ్ఛికమైన సాధారణ ఘటనగా తేల్చేసి, 'చట్టం తన పని తాను చేసుకుపోతుందిలే' అని ఉదాశీనంగా సరిపుచ్చుకోవడం. తత్‌ కారణంగా పాలకవర్గాలకు ఈ హత్యలకు దగ్గర సంబంధం ఉన్నదని ప్రజలు భావించడం సత్యదూరం కాదు. అందుకే హైకోర్టు ఈ జంట హత్యల ఘటనను సుమోటోగా స్వీకరించి దంపతుల హత్య ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రశ్నించేలా ఉన్నదని వ్యక్తపరిచింది. హంతకులను పట్టుకోవడం, సరైన సాక్ష్యాలు సేకరించడం ద్వారానే ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించింది. సాక్ష్యాలను తారుమారు చేయడం న్యాయం కాదు, వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకోవడం, ఆ వాస్తవాల నుంచి అసలు నిజాలు (సత్యాలు) గ్రహించడం, లోకానికి తేటతెల్లం చేయడం న్యాయవాదుల పని అని అందరికీ తెలుసు. కానీ రాజ్యాధికారం యొక్క ప్రత్యక్ష, పరోక్ష వత్తిడితో న్యాయ వ్యవస్థకు తూట్లు పడుతున్నాయి. న్యాయ స్వతంత్రతకు భంగం వాటిల్లుతున్నది. అసలు న్యాయం మనుగడే ప్రమాదంలో పడుతున్నది.
న్యాయం అనేది ఎక్కడో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. సహేతుకమైన ప్రజల ఆలోచనల్లోనూ, ఆచరణల్లోనూ ఉంటుంది. మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవింపచేయడమే న్యాయసూక్ష్మం. అవకతవకలను చేసేవారిని గనుక రక్షించుకుంటూ పోతే ప్రపంచమంతా దుర్మార్గులతోనూ, బుద్దిహీనులతోనూ నిండిపోతుందని హెర్బర్ట్‌ స్పెన్సర్‌ అంటాడు. నిజమేకదూ...!

- కె.శాంతారావు
సెల్‌: 9959745723


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మా'నవ'వాదం - ఇక తప్పనిసరి!
ప్రగతికి మార్గం ప్రశ్నే...
నిజం చెపితే దేశద్రోహమా?
నయా ఉదారవాదానికి సవాలుగా నిలుస్తున్న రైతు ఉద్యమం
నమ్మండి.. ఇది నల్లదొరల పాలనే
లెటజ్‌ సెలబ్రేట్‌ గురూ..!
నగరాన్ని చుట్టుకోనున్న మరో కొండచిలువ
ఆదివాసీలకు బతికే హక్కులేదా?
ఉద్యోగుల పై దుష్ప్రచారం తగదు
దేశ సేవలో ఇండియన్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖ
భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి
ప్రజా చరిత్రకారుడు ప్రొఫెసర్‌ డిఎన్‌ ఝా
భవిష్యత్‌ రాజకీయాలపై రైతాంగ పోరాట ప్రభావం
ఎల్‌ఐసీ అమ్మకం చారిత్రక తప్పిదం
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి...
వాళ్లవల్లే.. మేమే గ్రేట్‌
అయ్యో దేవుడికెంత కష్టం!
ఎవరు కన్న బిడ్డరా.. ఎక్కి ఎక్కి ఏడ్చింది..
'న్యూస్‌క్లిక్‌'ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?
త్యాగాల పాట..
ఒక వైజ్ఞానికుడూ, ఒక హేతువాది : పుష్పా భార్గవ
ఉద్యమ 'దిశ'
రాజే ద్రోహి
నూతన విద్యావిధానం - కార్పొరేట్లకు దాసోహం
ఎన్నికల అస్త్రంగా నేతాజీ!
కార్పొరేట్లకే రక్షణ బడ్జెట్‌
ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఆధునిక వర్గపోరాటం
వామపక్ష అణచివేతకు ఈక్వెడోర్‌ లో సరికొత్త కుట్ర?
భావప్రకటనా స్వేచ్ఛ - రాజకీయ హక్కు
ప్రశ్నించే వాడే స్పార్టకస్‌

తాజా వార్తలు

06:58 AM

'ఉప్పెన' మేకింగ్ వీడియో

06:40 AM

మార్చి 5నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

06:31 AM

నేడు భారత్‌ బంద్‌

09:47 PM

మార్చి 1న పీఈసెట్​ నోటిఫికేషన్ విడుదల

09:40 PM

నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన వేముల

09:33 PM

ముకేశ్​ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

09:26 PM

పుదుచ్చేరిలో అమల్లోకి రాష్ట్రపతి పాలన

09:19 PM

మహబూబ్​నగర్​ జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి

09:07 PM

శివకాశి బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి

08:57 PM

వామనరావు హత్య కేసు.. రిమాండ్ లో బిట్టు శ్రీను సంచలన వ్యాఖ్యలు

08:46 PM

తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం మిషన్ ఇంద్రధనుష్ టికా

08:44 PM

మార్చి1 నుంచి వండర్‌లా ఓపెన్

08:28 PM

ఏపీలో కొత్తగా మరో 82 పాజిటివ్ కేసులు

08:16 PM

నీరవ్ మోడీకి భారీ షాక్.. ఇక ఇండియా రావాల్సిందే..

08:11 PM

ఎమ్మెల్సీ కవితకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

08:08 PM

పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం..

08:02 PM

ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం : కేటీఆర్

07:56 PM

ప్రొ. నాగేశ్వర్ కు వైద్య, ఆరోగ్య ఉద్యోగ సంఘాల మద్దతు..

07:50 PM

ప్రొ. నాగేశ్వర్ కు మద్దతు తెలిపిన ఐద్వా..

07:44 PM

మార్చి 18న మహిళ వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు

07:41 PM

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష‌

07:30 PM

జానియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ..

07:27 PM

తిరుమలలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం పంపిణీకి చర్యలు..

07:22 PM

ఫలక్ నామలో గన్ పౌడర్ స్వాధీనం..

07:08 PM

ప్రొ. నాగేశ్వర్, జయసారధిరెడ్డిలకు టీఎస్ యూటీఎఫ్ మద్దతు

07:01 PM

వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్ గా స్పిన్నర్ అశ్విన్ రికార్డు..

06:45 PM

బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లి రొమ్ముపై కాటేసిన పాము..

06:34 PM

గుంటూరు మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ

06:27 PM

ఘోర ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి

06:18 PM

క్షుద్రపూజల కలకలం... స్థానికుల్లో భయాందోళనలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.