Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు రాహుల్‌గాంధీ
  • అక్క పాత్రలో రేణుదేశాయ్..?
  • కశ్మీర్‌పై మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
  • భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : జవాను తల్లి
  • పోలవరం పై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
టీచర్ల ఏకీకృతానికి రాజ్యాంగ సవరణే మార్గమా | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Sep 25,2018

టీచర్ల ఏకీకృతానికి రాజ్యాంగ సవరణే మార్గమా

ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ విషయంలో 2017 జూన్‌22న రాష్ట్రపతి ఇచ్చిన 'సవరణ ఉత్తర్వులు' చెల్లవని ఉన్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో 1992 నుంచి కొనసాగుతున్న పీఆర్‌ ఉపాధ్యాయుల పోరాటం మళ్లీ మొదటికొచ్చింది. ఈ తీర్పును ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వాగతిస్తుండగా, పీఆర్‌ ఉపాధ్యాయుల ఆశలు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమేనని చెబుతున్నారు. కోర్టుతీర్పుతో ఇంతకాలం ఉపాధ్యాయ, ఆధ్యాపక పోస్టులకు సంబంధించి ప్రమోషన్ల విషయంలో అడ్డంకిగా ఉన్న కేసులు మళ్లీ మొదటికొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా ఖాళీగా ఉంటూ వస్తున్న ఎంఈఓ, డిప్యూటీ ఎంఈఓ, డైట్‌లెక్చరర్స్‌ తదితర పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముందు రెండు అవకాశాలు మాత్రమే మిగిలాయి. అందులో ఒకటి రెండు రాష్ట్రాలూ మళ్లీ సుప్రీం కోర్టుకెళ్లడం, మరొకటి రాజ్యాంగసవరణ ద్వారా ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌కు సంబంధించి ఏకీకృతానికి ఆమోదం పొండడం. ఇది తప్ప ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మరో అవకాశం లేదన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలనే, రాష్ట్రపతి కూడా 'సవరణ ఉత్తర్వులు' ఇచ్చారు. ఇలాంటి కీలకాంశంపై ప్రభుత్వ ఉపాధ్యాయులు హైకోర్టుకెళ్లిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు న్యాయవాదితో సరైన సమయంలో కోర్టులో వాదనలు వినిపించినట్టయితే తీర్పు వేరేలా ఉండేదన్న వాదన కూడా సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పట్లో రాజ్యాంగసవరణ అంత తేలిక కాదన్న విషయం కూడా చర్చ జరుగుతోంది. దేశంలో ఒకపక్క ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతుండగా ఈ సమయంలో రాజ్యాంగసవరణ ఉండబోదన్నదే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 25,991 పాఠశాలలుండగా అందులో 3వేలలోపు ప్రభుత్వ పాఠశాలలు కాగా, 23వేలకు పైగానే పీఆర్‌ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఉపాధ్యాయుల ఏకీకృతసర్వీస్‌ రూల్స్‌కు సంబంధించే ఉపాధ్యాయుల పదోన్నతులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంటున్నాయి. డీఎస్సీ నిర్వహించినప్పటికీ కీలక పోస్టుల్లో ఇంచార్జీలే కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 584 మండలాలకుగాను కేవలం 36మంది మండల విద్యాశాఖాధికారులే ఉన్నారు. ఇవి భర్తీకాకపోవడానికి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటమే కారణం. నిరంతరం పాఠశాలలను తనిఖీచేయడం, ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల ప్రతిభను పర్యవేక్షించే ఎంఈఓ పోస్టులు 500కు పైగా ఖాళీగా ఉంటే విద్యావ్యవస్థ ఎంతవరకు సజావుగా నడుస్తుందో అర్దం చేసుకోవచ్చు. ప్రమోషన్లతో మాత్రమే భర్తీచేసే వీలున్న డిప్యూటీ డీఈఓ పోస్టులు రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా భర్తీచేయకపోవడం నేటి విద్యావ్యవస్థకు అద్దంపడుతుంది. డైట్‌ లెక్చరర్స్‌ కూడా రాష్ట్రంలో 206పోస్టులకు గాను దాదాపు 180కి పైగా ఖాళీలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా డైట్‌ కాలేజీల్లో పాఠాలు తూతూ మంత్రంగానే నడుస్తున్నాయి.బీఈడీ అధ్యాపకులు సుమారు 100, గ్రేడ్‌ వన్‌ హెచ్‌ఎం పోస్టుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం పరిస్థితిని మరింతగా దిగజారేలా చేస్తోంది. దాదాపు 27 ఏండ్లుగా కోర్టుల్లో సాగుతున్న ఉపాధ్యాయుల పోరాటానికి తాజా హైకోర్టు తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో మాత్రం సంతోషాన్ని నింపి, పీఆర్‌ ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. కోర్టుతీర్పుతో దాదాపు మూడు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశపడ్డ పీఆర్‌ ఉపాధ్యాయులకు చుక్కెదురైంది. ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ను ఏకీకృతం చేయాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆయా మంత్రి వర్గాలు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖాధికారులతోచర్చించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఉపాధ్యాయలు మరోపోరాటానికి శ్రీకారం చుట్టే వీలుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైకోర్టు తీర్పుపై సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించి భవిష్యత్‌ కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. ఇక పీఆర్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఇప్పటికే సీరియస్‌గా ఉన్నారు. తమకు న్యాయం చేయాలనుంటే ప్రభుత్వం సకాలంలో, సుప్రీంకోర్టు న్యాయవాదితో వాదనలు వినిపించేవారని వాదిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శిస్తున్నారు. అసలే ముందస్తు ఎన్నికల బిజీలోఉన్న తెలంగాణ సర్కారుకు 23వేల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఎలాంటి అల్టిమేటం ఇవ్వనున్నారో వేచిచూడాల్సిందే.

- వనం నాగయ్య
సెల్‌: 9490099343

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజా సమస్యలా? స్వప్రయోజనాలా?
అంతర్గత వ్యవహారాలపైనేనా? ప్రేరేపణలపై నిఘా వద్దా?
రైతుబజార్‌లో ఇష్టానుసారంగా రేట్లు
దాడి అమానుషం
ప్రభావం ఉండదు
ఉద్యమ ప్రస్థానంలో ఉజ్వల దీపం టీఎన్‌
అంత నిజమే జెప్తున్న
సుప్రీంకోర్టును తప్పుతోవ పట్టించిన మోడీ సర్కారు
తండా పంచాయతీలకు నిధులు కేటాయించాలి
లౌకిక రాజ్యం - విద్యారంగం
108 సిబ్బందిని కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి..!
సంపదతో పాటే పెరుగుతున్న అసమానతలు
మోడీయే అస్త్రాలు అందిస్తుంటే విభీషణులతో పనేమిటి?
భావనలకు కాదు.. శ్రమైక సౌందర్యానికి విలువిద్దాం..!
అరెస్టులతో.. దాడులతో.. ఓట్లు రాల్తాయా మోడీ!
ఎవరిది బాధ్యత...?
ఎన్నిసార్లు బీసీల గణాంకాలు?
మదురో బహిరంగలేఖ
ప్రాథమిక విద్యా ప్రమాణాల అద్దంలో తెలంగాణ
'వర్థెల్లి' ఆశయమా... వర్థిల్లు
పేదలను పట్టించుకోని 2019-20 సంవత్సర బడ్జెట్‌
స్సాంగ్‌యాంగ్‌ మోటారు వర్కర్ల చారిత్రాత్మక పోరాటం
మోడీ విజయాలు యివేనా..?
మహామహిళాకుడ్యం... అనుభవాలు...
ఎంపి టికిట్‌ కోసం రాహుల్‌ సుట్టూత చక్కర్లు
అమెరికాను వెన్నాడుతున్న సోషలిజం!
నిజాలు దాస్తే నిరుద్యోగం తగ్గుతుందా?
ఉపాధ్యాయుల పదోన్నతులు వెంటనే చేపట్టాలి
డార్విన్‌ సూత్రానికి నోబెల్‌ బహుమతి
ఎన్నికల చుట్టూ రాజకీయాలు ఎంతకాలం?
Sundarayya

Top Stories Now

vd
veeraiah
వందే భారత్ కు బ్రేక్ వేసిన గోవు
నా రెండో బిడ్డను పంపడానికి రెడీ
ప్రేమ జంటకు పెళ్లి చేసిన భజరంగ్ దళ్.. అదృశ్యమైన యువతి..
మరో సినీ, టెలివిజన్ నటి ఆత్మహత్య..
పారిన రక్తపుటేరులు
modi
vard
madutro
mod
cbn

_

తాజా వార్తలు

04:15 PM

ఏపీ భవన్‌ క్యాంటిన్‌కు రాహుల్‌గాంధీ

04:14 PM

అక్క పాత్రలో రేణుదేశాయ్..?

04:11 PM

కశ్మీర్‌పై మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

04:09 PM

భారత్ తలచుకుంటే 24 గంటల్లో పాక్ మటాష్ : జవాను తల్లి

04:07 PM

పోలవరం పై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ

03:58 PM

అంతర్జాతీయ కోర్టులో కొత్త వాదనకు తెరలేపిన పాక్‌

03:57 PM

యమునా ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం... ఏడుగురు మృతి

03:47 PM

సెన్సెక్స్ 146, నిఫ్టీ 36పాయింట్ల నష్టం

03:46 PM

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ రిక్రూట్ మెంట్‌ ...

03:44 PM

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.