Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అవకాశవాదం | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

అవకాశవాదం

రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి శుక్రవారంతో ఏడాది పూర్తికానుంది. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతల్లోకి వచ్చారు. కేసీఆర్‌ పరిపాలనపై చర్చ తీవ్రంగానే జరుగుతున్నది. ఈ కాలంలో ప్రజాస్వామ్య, రాజకీయ విలువలకు విఘాతం కలిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను తన గుంపులో కలుపుకోవడం ద్వారా రాజ్యాంగ వ్యతిరేక పాలనకు శ్రీకారం చుట్టారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను నియోజకవర్గ అభివృద్ధి పేర ఏమార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే దెబ్బ. ఎన్నికల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించిన గులాబీ నేత, అమలుకు వచ్చేసరికి ఆర్థికమాంద్యం పేర కండ్లు తేలేస్తున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎజెండా చేసి, తన బాధ్యతల నుంచి తప్పుకోజూస్తున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి భారీగా నిధులొస్తాయని నీతిసూత్రాలు చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు అసలు నిధులే ఇవ్వలేదంటున్నది. ఒకసారి విమర్శిస్తూ, మరోసారి మెచ్చుకుంటు అవకాశవాద ధోరణులను ప్రదర్శించి, తాజాగా నిష్టూరానికి దిగింది. పౌరసత్వ సవరణ బిల్లును సరిగానే వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌, ప్రజల ఆయుధమైన సమాచార హక్కు చట్టం కోరలు పీకే బిల్లుకు అనుకూలంగా ఓటేయడం దారుణం. ఇది అప్రజాస్వామికం. విధానపరంగా ప్రజాస్వామ్యానికి, విలువలకు కట్టుబడి ఉండి ఉంటే, సమాచార చట్టం విషయంలోనూ వ్యతిరేకించి ఉండేది. ఎన్నికల పేరుతో దాదాపు ఏడాది కాలంగా పాలనే సాగలేదు. ఉన్న పథకాలకు నిధుల కొరత. రైతుబంధు దగ్గర నుంచి ఆసరా ఫించన్ల వరకు అన్నింటికీ కాసుల కటకటే. రైతుబంధు ఇంకా లక్షలాది మందికి చేరకపోగా, పింఛన్ల చెల్లింపును నెలల తరబడి ఆలస్యం చేస్తున్నది. మాంద్యంపై సీఎం తరచుగా మాట్లాడటం వెనుక రాజకీయ వ్యూహాం దాగుంది. ఇది కొత్తగా ఉత్పన్నమైన విషయమేమి కాదు. ఎన్నికలకు ముందు నుంచే తెలిసిన విషయమైనా ఓట్ల కోసం ధనికరాష్ట్రమని నమ్మబలికారు. పార్టీ మ్యానిఫెస్టో అమలుకు నిధులు అడ్డంకి కావడంతో ఆర్థిక మాంద్యమంటూ సీఎం గొంతుచించుకుంటున్నారు. గగ్గోలు పెడుతున్నారు. ఐదున్నరేండ్లుగా బీజేపీతో నెరపిన సత్సంబంధాలు, సఖ్యత రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చలేకపోయింది. అదనపు నిధుల సంగతి పక్కనపెడితే, చట్టబద్దంగా రావాల్సిన సోమ్ముకే ఎసరుపెట్టిన బీజేపీతో అంటకాగారు. సర్కారు అప్పులు ప్రస్తుతం రూ.2.03 లక్షల కోట్లు. ఇందులో తలసరి అప్పు రూ. 58,202 కావడం గమనార్హం. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కేంద్రం కోతపెడితే, ఆ చర్యను కేరళ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశాలు పెట్టి దేశవ్యాప్త ఆందోళనకు పూనుకుంది. అప్పుడు మన ప్రభుత్వాధినేత ఆ రాష్ట్రంతో గొంతు కలపలేదు. జాతీయ ఉపాధి హామీ చట్టం పనులకు మోడీ సర్కార్‌ నిధులను తగ్గిస్తే, అప్పటి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌ దేశ రాజధానిలో చేసిన నిరసన దీక్షకూ సంఘీభావం చెప్పలేదు. రాష్ట్రాలన్నీ ఏకమైతేనే కేంద్రం మెడలు వంచడం సాధ్యమవుతుందనే సంగతిని కేసీఆర్‌ విస్మరించారు. 2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నులవాటా రూ.19,719 కోట్లు. కానీ వచ్చింది రూ. 10,304 కోట్లే. బీజేపీ సర్కార్‌ రూ.9,415 కోట్లు తక్కువగా ఇచ్చింది. ఏండ్ల తరబడి కేంద్ర ప్రభుత్వ హామీలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయని టీఆర్‌ఎస్‌ ఎంపీల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. ఇంతకాలం బీజేపీతో స్నేహాం చేసి ఏం సాధించినట్టు ? కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా సామాజిక రుగ్మతలు రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. దిశ, సమత, మానసతోపాటు మరో నలుగురు యాదాద్రి యువతులపై జరిగిన లైంగికదాడులు, హత్యలు సమాజంపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. దిశ కేసులో దేశమంతా స్పందించినా, కేసీఆర్‌ నుంచి ఉలుకూ, పలుకూ లేదు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించలేదు. నిర్భయ చట్టంపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజలకు కల్పించిన అవగాహన అంతంతే. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినా, కేవలం 30 శాతం ఉద్యోగాలనే సర్కార్‌ భర్తీచేసింది. మిగతా 70 శాతం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం వైఫల్యానికి నిదర్శనం. చట్టాల పట్టింపులేదు. చిత్తశుద్ధి అంతకన్నా లేదు. దీంతో నిరుద్యోగ సమస్య ఎప్పటిలాగే రాష్ట్రాన్నీ వేధిస్తున్నది. ఇవి గులాబీ నేతకు, ఆయన సర్కారుకు చెరగని మరకలు. పరిపాలనాంశాల్లో హైకోర్టు ఎన్నోసార్లు తప్పుబట్టిన చరిత్రా అందరికీ ఎరుకే. సమ్మె హక్కును నిరాకరిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా అత్యంత నిరంకుశంగా, బాధ్యతారహితంగా వ్యవహరించింది. రానున్న కాలం ప్రజలకు పరీక్షా సమయం. ఆర్థిక, సామాజిక సమస్యల పరిష్కారానికైనా, ప్రజాస్వామ్య హక్కుల కోసమైనా ప్రజాఉద్యమాలే శరణ్యం. సమస్య ఏదైనా పోరాటమే మార్గం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...
విశ్వాసమే ఊపిరిగా!
కరోనా డైరీ - 2020
సహనం అంచున రైతాంగ ఉద్యమం
ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?

తాజా వార్తలు

06:16 PM

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంచలన నిర్ణయం

05:43 PM

యువ జంట ఆత్మహత్య

05:33 PM

యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ముఖ్య గ‌మ‌నిక

05:19 PM

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా

05:16 PM

ఆస్ప‌త్రి నుంచి క‌మ‌ల్‌హాస‌న్ డిశ్చార్జ్‌

05:12 PM

వాట్సాప్‌కు ఝలక్‌...

05:05 PM

జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్‌

04:58 PM

బాలికపై మూడేళ్లుగా 44మంది లైంగికదాడి

04:39 PM

లోయ‌లో ప‌డి ఆరుగురు వ‌ల‌స‌కూలీలు మృతి

04:29 PM

పుణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

03:59 PM

లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

03:51 PM

షిషింగ్ హర్బ‌ర్‌లో అగ్ని‌ప్ర‌మాదం

03:41 PM

నల్గొండ రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

03:37 PM

అల్మాస్ పూర్ దళితులపై దాడి చేసిన గుండాలను శిక్షించాలి: కేవిపిఎస్

03:28 PM

ఉద్యోగులకు వారంలో మూడు రోజులు సెలవులు..!

03:14 PM

నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హరీష్‌రావు

03:10 PM

రేపు ధర్నా చౌక్‌లో ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నిరాహారదీక్ష

02:56 PM

ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీంకోర్టు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.