Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రాష్ట్రంలో పరిస్థితులు.. కార్మికవర్గం ముందున్న సవాళ్ళు.. | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 13,2019

రాష్ట్రంలో పరిస్థితులు.. కార్మికవర్గం ముందున్న సవాళ్ళు..

సీఐటీయూ రాష్ట్ర మూడవ మహాసభలు 2019 డిశంబర్‌ 14-17 తేదీల్లో మేడ్చల్‌ జిల్లాలో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో కార్మిక ఉద్యమం గురించి సింహావలోకనం చేసుకోవడం అవసరం. సాధారణంగా మహాసభలు అంటే యూనియన్ల కార్యక్రమాలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్‌ కర్తవ్యాల చర్చగా చూస్తారు. సాధారణ ప్రజలు కూడా ఒక సంఘం అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూ వదిలేస్తుంటారు. సాధారణ లక్ష్యంతో పనిచేసే ఏ సంస్థ విషయంలోనైనా అది కరెక్ట్‌. కానీ భారత కార్మికోద్యమ చరిత్రలో సీఐటీయూకు ఒక విశిష్టత ఉంది. ఈ దేశంలోని కార్మికుల, కర్షకుల, సాధారణ ప్రజల మూలుగులు పీల్చి లాభాలు గడించే పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేసి దాని స్థానంలో శ్రామిక రాజ్యం స్థాపించడమే లక్ష్యంగా కలిగి ఉండటం దాని ప్రత్యేకత. 1970 మే 30న సీఐటీయూ ఆవిర్భావం రోజే ఆనాటి అగ్రశ్రేణి కార్మికోద్యమనేతలు జ్యోతిబాసు, బి.టి.రణదివే, పి.రాంమూర్తి లాంటి మహామహులు రానున్న కాలంలో భారత కార్మికవర్గమంతా ఐక్యంగా పోరాడుతుందని జోస్యం చెప్పారు. అందులో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. సీఐటీయూ ఏర్పడి 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నది. దేశంలో మొదటి అఖిల భారత కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920లో బొంబాయిలో ఏర్పడింది. భారత సంఘటిత కార్మికోద్యమం 100ఏండ్ల ఉత్సవాలు జరుపుకుంటున్నది. ఈ కాలంలో కార్మిక సంఘాలన్నీ ఏకమై 15 దేశవ్యాప్త సమ్మెలు చేశాయి. ఈ ఏడాది 2019 జనవరి 8, 9 తేదీల్లో 2 రోజుల పాటు 20కోట్ల మంది సమ్మె చేయడం అపూర్వ ఘట్టం. ఈ సమ్మె పెట్టుబడికి బలమైన ప్రతిఘటన ఇచ్చింది. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో రూ.1.5లక్షల కోట్ల వాటాల విక్రయాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నది. మొట్టమొదటి ప్రయివేటు రైలు 'తేజస్‌'ను లక్నో నుంచి ఢిల్లీకి ప్రారంభించింది. రైళ్ళు, స్టేషన్లు, ఉత్పత్తి కేంద్రాలను ప్రయివేటుకు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వరంగ విమానయాన సంస్థలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల ప్రయివేటీకరణకు ప్రయత్నాలు చేస్తున్నది. బ్యాంకుల విలీనం, కోల్‌మైన్స్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌లతో పాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలను రానున్న కాలంలో ప్రయివేటీకరణకు సిద్ధం చేసింది. కార్మికుల హక్కులను, బేరసారాల శక్తిని నీరుగార్చడానికి పూనుకుంటూ 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా మార్చుతున్నది. కనీస వేతనం రోజుకు రూ.178 ప్రకటించింది. 8గంటల పని దినం బదులు, 9గంటలు పనిదినం చేసింది. 300లోపు కార్మికులున్న పరిశ్రమలను మూసివేయడానికి యజమానులకు ప్రభుత్వం అనుమతి లేకుండా చేసింది. హైర్‌ & ఫైర్‌ పద్ధతిని తీసుకువచ్చింది. నిరుద్యోగం పెరిగింది. ధరలు మండిపోతున్నాయి (ఉల్లిగడ్డ కిలో రూ.200 చేరింది). ఈ నేపథ్యంలో 2020 జనవరి 8న భారత కార్మికవర్గం మరోసారి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో బీజేపీ విధానాలకు వంతపాడే బి.ఎమ్‌.ఎస్‌, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ కార్మిక వ్యతిరేక విధానాలకు వంతపాడే టీఆర్‌ఎస్‌కెవి దూరంగా ఉంటూ పెట్టుబడిదారుల ముద్దు బిడ్డలుగా ఉండదలచుకున్నాయి. ప్రజల సంపదైన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం, కార్మిక హక్కుల పరిరక్షణ గురించి సమాజానికి నొక్కి చెప్పడం ఈ మహాసభల ప్రధాన ఉద్దేశ్యం.
నేడు మన తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలి, కార్యాచరణ చూస్తే రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల సంఘాలు లేకుండా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ధర్నాలు, నిరసనలు, సమ్మెలు చేస్తే ప్రభుత్వం వినదు, అడుక్కుంటే జీహుజూర్‌ అంటేనే కరుణిస్తుందనే భూస్వామ్య, పెత్తందారీ స్వభావంతో పని చేస్తున్నారు. సంఘాల నుంచి నాయకులను, నాయకుల నుంచి కార్మికులను దూరం చేయాలని, సంఘాలను చీల్చాలనే కుట్రలు నిరంతరం చేస్తున్నారు. భారత పార్లమెంటు ద్వారా సంక్రమించిన హక్కులను గుర్తించ నిరాకరిస్తూ ఏక వ్యక్తి నియంతృత్వపాలన సాగిస్తున్నారు. ఎంతటి నిరంకుశ పాలకులైనా అంతిమంగా ప్రజల ప్రతిఘటనకు తలవంచకతప్పదనేది చారిత్రక సత్యం. మన ముఖ్యమంత్రి ఏది చేసినా నేను చేయాలనే అప్రజాస్వామిక తలబిరుసుతనంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో సీఐటీయూ ఆధ్వర్యంలో వేలమంది కార్మికులు చేసిన సమ్మెలకు అంతిమంగా దిగిరాకతప్పలేదు. 106రోజుల ఆశాల సమ్మె తరువాత ప్రగతిభవన్‌కు పిలిపించుకొని భోజనం పెట్టి పారితోషికం పెంచారు. అంగన్‌వాడీల దశల వారీ పోరాటానికి దిగివచ్చి భోజనం పెట్టి రూ.10,500 జీతం నిర్ణయించారు. వీఆర్‌ఏలను ఆహ్వానించి రూ.10,500 జీతం పెంచారు. 10రోజుల పాటు డిపెండెంట్‌ ఉద్యోగాలకై సమ్మె చేసిన సింగరేణి కార్మికులను (తన యూనియన్‌ గెలుపుకోసం) ప్రగతిభవన్‌లో బుజ్జగించి అనేక హామీలు ఇచ్చారు. పీఆర్‌సీ కోసం పోరాడకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. అంతకుముందు 47రోజులు 2వ ఎఎన్‌ఎంలు సమ్మె చేస్తే ఆ తరువాత రూ.21,000కు జీతం పెంచారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ ఉద్యోగులు పోరాడితే జీఓ 14 ద్వారా జీతాలు పెంచారు. 108 ఉద్యోగులు పోరాటం వల్లనే జీతాలు పెంచు కున్నారు. 33రోజులు గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తే చివరికి రూ.8,500కు అంగీకరించారు. ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్‌ ఉద్యోగులు 23 వేలమంది 10రోజులు సమ్మె చేస్తేనే జీతాలు పెంచారు.
ఇక 48వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు 55రోజులు సమ్మె చేశారు. సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేయడానికి విశ్వప్రయత్నం చేశారు. 32మంది బలిదానం, వేలమంది అరెస్టులు, ఆంక్షలు పెట్టి, మూడుసార్లు డెడ్‌లైన్‌ పెట్టాక కూడా బెదరకుండా అత్యంత సమరశీలంగా పోరాడారు. ఆర్టీసీ ఉండదు, ఆర్టీసీ కార్మికుల సంఘాలు ఉండవు, ప్రయివేటీకరణ ఆగదు అని ఘీంకరించినా చివరకు దిగిరాక తప్పలేదు. ప్రగతిభవన్‌కు పిలిపించుకుని భోజనం పెట్టి అడిగినవి, అడగనివి వరాలు ఇచ్చారు. ఈ పోరాటాలన్నింటా సీఐటీయూ ముందు పీఠిన నిలిచింది. రాజీపడకుండా పాలకులకు దాసోహం కాకుండా ఎత్తిన జెండా దించకుండా చివరికంటా పోరాడుతూనే ఉంది.
సామాజిక బాధ్యత - సీఐటీయూ
తెలంగాణ రాష్ట్రంలో సీఐటీయూ ఆర్థిక అంశాలకే పరిమితం కాలేదు. సామాజిక, సాంస్కృతిక అంశాలపై పోరాడుతున్నది. సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచింది. 2016 అక్టోబర్‌ 16 నుంచి 2017 మార్చి 19 వరకు సామాజిక న్యాయం కోసం జరిగిన 4122 కిలో మీటర్ల మహాజన పాదయాత్రలో సీఐటీయూ నాయకులు నడిచారు. బహిరంగ సభకు 50వేల మందిని సమీకరించింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, కార్మిక, కర్షక పేదలతో భుజం భుజం కలిపి పోరాడింది. ఈ కాలంలో జరిగిన 32కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా పోరాడింది. కరువు వ్యతిరేక పోరాటాలు చేసింది. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు అంబలి కేంద్రాలు పెట్టింది. మెదక్‌ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 50మంది రైతులకు ఆర్థిక సహాయం చేసింది. మల్లన్న సాగర్‌ భూనిర్వాసితుల పోరాటానికి సీఐటీయూ అండగా నిలిచింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నది. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలకు ఏ ఆపద వచ్చినా తన సంఘీభావం తెల్పుతూనే ఉన్నది. ఎందుకంటే ప్రాంతీయ దురభిమానాలకు దూరంగా 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అనే నినాదం తన విధానంగా కలిగి ఉన్నది. అంతిమంగా కార్మిక రాజ్యానికై కట్టుబడి ఉన్నది. అందుకు కులం, మతం, ప్రాంతం, భాషాబేధాలు లేకుండా కార్మికు లంతా ఒకే గొడుగు క్రింద ఉండాలని భావిస్తున్నది.
ఈ నేపథ్యంలో సీఐటీయూ రాష్ట్ర మూడవ మహాసభల్లో 50కి పైగా కీలక తీర్మానాలు చేయబో తున్నది. కార్మిక ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత చర్యలను ప్రతిఘటిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జనవరి 8న అఖిల భారత సమ్మె, తెలంగాణ రాష్ట్రంలో 73రంగాల్లో కనీస వేతనాల జీఓలు ఇవ్వాలని, రూ.21,000 కనీస వేతనం ప్రకటించాలని, ప్రభుత్వం ఉద్యోగులకు పే రివిజన్‌ ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలనీ, సింగరేణి, ఆర్టీసీ పరిరక్షణ, సీపీఎస్‌ రద్దు చేయాలనీ డిమాండ్‌ చేస్తున్నది. స్కీమ్‌ వర్కర్లు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ తదితర కార్మికుల సమస్యలపై పోరాటాల ఉధృతానికి సిద్ధమవు తున్నది. అందుకే ఈ మహాసభలను జయప్రదం చేయడం రాష్ట్రంలోని అణగారిన వర్గాల ప్రజల, శ్రామికులందరి బాధ్యత.
- భూపాల్‌
సెల్‌: 9490098034




మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.