Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఉద్యమ బాటలో శ్రామిక మహిళ | నేటి వ్యాసం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నేటి వ్యాసం
  • ➲
  • స్టోరి
  • Dec 14,2019

ఉద్యమ బాటలో శ్రామిక మహిళ

శ్రమలో మూడింతలు శ్రామిక మహిళలే.
మానవ సమాజానికి పునాది శ్రమే.
ఏ వ్యవస్థలోనైనా శ్రమదే కీలకపాత్ర.
శ్రమ దోపిడీయే చరిత్రసారం. అందుకే,
ప్రపంచ పురోగతి శ్రమ జీవి నెత్తుటి బొట్టులోనే
ఇమిడి ఉంది అనేది కవి వాక్యం..
మనకు తెలిసిన మన చరిత్రనే పరిశీలిద్దాం. చారిత్రక మలుపులన్నింటిలోనూ భీకరమైన పోరాటాలే జరిగాయి. ఆదికాలాల్లో సంతానానికి తల్లి ద్వారానే గుర్తింపు ఉండేది. ఇదే మాతృస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థ దానంతటదే రూపు మాసిపోలేదు. ఆ తర్వాత పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. సొంతాస్తి క్రమంగా ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు సొంతాస్తి కేంద్రంగా సమాజ గమనం సాగుతోంది. ఈ చారిత్రక నేపథ్యంలో శ్రామిక మహిళలను అర్థం చేసుకోవడం సముచితం.
ప్రస్తుతం కార్మికవర్గం పుట్టెడు కష్టాలతో సతమతమవుతోంది. శ్రామిక మహిళలూ ఈ సమస్యలకు మినహాయింపు కాజాలరు. పైగా అదనపు బాధలు అనుభవిస్తున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అంతులేని క్షోభను అనుభవిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో బతుకు బండిని లాగు తున్నారు. గౌరవం, మర్యాద, ఆర్థిక ఆలంబన కోసం నిత్యం పోరాటం చేస్తున్నారు. శ్రామిక మహిళల వేదనల్ని, బాధల్ని పట్టించుకోని పాలకుల వర్గనీతిని క్రమంగా ప్రశ్నించడం పెరుగుతోంది.
'కొత్త సీసాలో పాత సారా' లాగా పాత సర్కార్లు పోయి కొత్త సర్కార్లు కొలువుదీరు తున్నాయి. అంటే ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. సారం చెడకుండా రూపం మారుతోందంతే. అందుకే.. శ్రామిక మహిళల సమస్యలు ఏండ్లు గడుస్తున్నా 'ఎక్కడ వేసిన గొంగలి అక్కడే' అన్నట్టుగా ఉన్నాయి.
తాత్కాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలని రెండుంటాయి. ఇందులో తాత్కాలిక ప్రయోజనాలకే పాలకులు మెగ్గుచూ పుతారు. అందులో భాగంగానే ప్రభుత్వాలు పథకాలను ప్రవేశ పెడ్తున్నాయి. ఈ స్కీమ్‌ల స్వభావం రీత్యా మహిళలే ఎక్కువగా పనిచేస్తున్నారు. వీరి శ్రమ ఫలితం.. పాలకుల ప్రతిష్టను ఇనుమడింపజేస్తుంది. ఈ స్కీమ్‌ల ప్రచారానికి పెట్టిన ఖర్చుకూడా, ఇందులో పని చేస్తున్న శ్రామిక మహిళలకు వేతనాల రూపంలో ఇవ్వకపోవడం విడ్డూరం.
మేడే ఉత్సవాల సందర్భంగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు. మన దేశ వనరుల అభివృద్ధికి కార్మికవర్గం అపూర్వమైన సేవలు అందిస్తున్నదని రొటీన్‌గా చెప్తారు. కానీ కార్మికులుగా గుర్తించరు. కనీస వేతనాలు చెల్లించరు. ఉద్యోగ భద్రత కల్పించరు. ఉద్యోగు లుగా ప్రకటించరు. గౌరవప్రదమైన పని పరి స్థితులు కల్పించరు. జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేయరు. అందుకు తగిన నిర్ణయాలు తీసుకోరు. ఇది పాలకుల నీతి, రీతి. ఇందుకు కారణం లేకపోలేదు. పాలకులు ప్రవేశపెట్టిన నయా ఉదారవాద విధానాలు పేదల పొట్టల్ని కొట్టాయి. వారిని సకల కష్టాల్లోకి నెట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ విధానాలు చేసిన గాయాలు అనేకం. పడుతున్న బాధలు వర్ణనాతీతం. వీటినుంచి ఉపశమింప జేసేందుకే రకరకాల ప్రయత్నాలు. అందులో భాగంగానే ఈ స్కీమ్‌లు. అయితే వేతనాలకు, ఇతర ప్రయోజనాలకు సబంధించిన చట్టబద్ధ హక్కులుంటాయి. చట్టబద్ధమైన సౌకర్యాల నుంచి తప్పించేందుకే ప్రయివేటీకరణ, స్వచ్ఛంద సంస్థలు అనే దొడ్డిదారి మార్గాలను పాలకులు అన్వేషిస్తున్నారు.
ముచ్చటైన పేర్లతో...
స్కీమ్‌ వర్కర్లను 'సంఘ సేవకులు' వాలంటీర్లు, కార్యకర్తలు, యశోదాలు, మమతలు, అతిథులు, తదితర ముచ్చటైన పేర్లతో ముద్దుగా పిలుస్తున్నారు. కనుక ఈ తరహా పేర్లతో పనిచేసే వారికి చట్టబద్ధ సౌకర్యాలు వర్తించవు. కనీస వేతనాలు అసలు ఉండవు. వీరిలో కొంత మందికి నామమాత్రమైన 'గౌరవ వృత్తి' లేదా ప్రోత్సహక భృతి, ఏకీకృత చెల్లింపు అన్న పేరుతో చెల్లింపులు చేస్తున్నారు. కొంత మందికి ఈ మాత్రం కూడా ఉండటం లేదు. అలాంటి వారు తమను కాపాడుకోవటానికై, వినియోగ చార్జీలను వసూలు చేసుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం ఇలాంటి శ్రామికులు రాష్ట్రంలో 3లక్షల మంది ఉంటారు. దేశంలో సుమారు కోటి మందికి పైగానే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది శ్రామిక మహిళలు. వీరు ఐసీడీఎస్‌, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఎస్‌ఎస్‌ఎ, మధ్యాహ్న భోజన పథకం వంటి వాటిల్లో పని చేస్తున్నారు. వీరి శ్రమ మానవ అభివృధ్ధి సూచికలను మెరుగుపర్చటానికి ఉపయోగ పడాలి. అంటే వారికి శ్రమకు తగ్గ ఫలితం అందాలి. అయితే ఈ పథకం శ్రామికుల్లో అత్యధికులు మారుమూల పల్లెల్లోనూ, అడవుల్లో నివసించే వివిధ పేద ప్రజలుండే ప్రాంతాల్లోనూ పని చేస్తుంటారు. పని స్వభావం కారణంగా, ఈ శ్రామికులు కష్టజీవుల్లో ప్రత్యేకించి పేదలతోనూ, సామాజిక బడుగు, బలహీన వర్గాలవారితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు. ఇది గమనించిన పాలకులు వీరిని ఓట్లు వేయించే వాలంటీర్లుగా మాత్రమే ఉపయోగించు కుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో సుమారు 3లక్షల 10వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. వీరిలో 60శాతం మంది మహిళలు. మున్సిపల్‌ ఉద్యోగుల్లో 60శాతం మంది మహిళలు. అందులో 80శాతం దళితులు. హెల్త్‌లో 4,221మంది 2వ ఏఎన్‌ఎంలు మహిళా ఉద్యోగులే. ఆర్టీసీలో 5,671 రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరికి కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగు దొడ్లు లేవు. పనిచేసే చోట రక్షణ లేదు. ఉద్యోగ భద్రతలేదు. కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. రాష్ట్రంలో బీడీరంగం 16 జిల్లాల్లో విస్తరించి ఉంది. సుమారు 7లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వీరిలో 98శాతం మహిళలే. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బీడీలు చుడతారు. వీరికి కనీస వేతనాల జీఓ కాలపరిమితి పూర్తయినా పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకావడం లేదు. పని, ఉపాధి, శ్రమ.. పదాలు వేరైనా, ఇవి మనిషి నుంచి విదదీయలేనివి. ఇవి సమాజ సంపద ఇనుమడింపజేస్తాయి.
పని..పని..పని.. శ్రమకు తగ్గ వేతనాలు కావాలి.. ఏ మహిళ నోట విన్నా ఇదే మాట. మాకు పని కల్పించండి. పని చేసుకునే అవకాశం ఇవ్వండి. మా కష్టాన్ని గుర్తించండి, మా శ్రమను గౌరవించండి. అవరోధాలు కల్పించకండి, దేశ పునర్‌ నిర్మాణంలో మా సత్తా చూపుతాం అంటోంది శ్రామిక మహిళ.
- ఎస్వీ రమ

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మన మెడకు బిగుసుకుంటున్న ఉచ్చు
పంట విలాపం!
నేతాజీ పేరిట తృణమూల్‌, బీజేపీ లొల్లి
ట్రంప్‌ నాయకత్వంలో కొత్తపార్టీ..?
మనిషే మహనీయుడన్న మహా మానవవాది
గ్రాంసీ ఆలోచనలు - ఆవశ్యకత
విప్లవాల మిత్రుడికి విప్లవాంజలి
సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరి సొంతం?
డిటిహెచ్‌ లో విదేశీ పెట్టుబడులు దేశభద్రతకు ప్రమాదం
చట్టాల కోరల్లో కార్మికులు
ద్వేషమే చట్టంగా మారితే !
బడా బాబులకు భారీగా బకాయిల రద్దు
ద్వంద్వ ప్రమాణాల వాట్సాప్‌..?
ప్రజాపంపిణీ వ్యవస్థను కాపాడుకుందాం!
రైతులను, ప్రజలను చైతన్య పరుస్తున్న రైతుజాతా
కరోనాపై పోరులో క్యూబా ఆదర్శం
ఇది రైతుకు జీవన్మరణ సమస్య
రోహిత్‌ వేములది వ్యవస్థీకృత హత్యే!
అర్హతలేని.. మహానుభావులున్నారు జాగ్రత్త!
సాగు చట్టాల అమలునుకాదు... చట్టాలనే రద్దుచేయాలి
అధ్యక్షుడే నేరస్తుడు
మీడియాలో సారం, సారాంశం ఎక్కడ?
ప్రజాస్వామ్యానికి ప్రమాదం!
ఇది తిరోగమనమా? పురోగమనమా?
యూనివర్సిటీలను చంపడమే బంగారు తెలంగాణ!
కౌలుదారుల కడుపుకొట్టే కాంట్రాక్టు సేద్యం చట్టం
సమస్యల సమాహారం సం'క్రాంతి'
మార్క్సిజమే మానవజాతి విముక్తికి మార్గం!
విద్వేష రాజకీయాలతో విధ్వంసమే...
అక్షర భాస్కరుడు...

తాజా వార్తలు

09:55 PM

మోడీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారు : రాహుల్ గాంధీ

09:30 PM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

09:15 PM

మహిళను వదలని కరోనా..

08:49 PM

స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్ట‌ర్.. అంతా ఒక్కసారిగా షాక్

08:26 PM

లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎయిమ్స్ కు తరలింపు

08:18 PM

రైతుల ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు

08:09 PM

త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకువస్తాం : కేటీఆర్

08:01 PM

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలి

07:58 PM

మొబైల్ ఫోన్ ల ద్వారా ఓటరు గుర్తింపు కార్డుల డౌన్ లోడ్

07:55 PM

ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్ట‌ర్లు ఇచ్చాం : మంత్రి ఎర్రబెల్లి

07:48 PM

మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు శ్వేతామహంతి నియమకం

07:31 PM

జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ

07:22 PM

తెలంగాణలో ప్రియురాలు.. దుబాయ్ లో ప్రియుడి ఆత్మహత్య

07:07 PM

చిరుతను చంపి వండుకుని తిన్నారు..

06:20 PM

5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పలేదు.. అర్వింద్.. ఎంపీపై రైతుల ఆగ్రహం

05:48 PM

సంపూర్ణేష్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

05:43 PM

దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ : కొప్పుల ఈశ్వర్

05:40 PM

పాఠశాలల పునః ప్రారంభం మంత్రి హరీశ్ రావు సమీక్ష..

05:35 PM

ఆర్జీవీ`డీ కంపెనీ` టీజర్‌..

05:34 PM

ఎంసీహెచ్ ఆస్పత్రిలో సిబ్బందికి నియామక పత్రాలు అందజేసిన స్పీకర్

05:30 PM

జీహెచ్ఎంసీ పరోక్ష ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన నియమావళి

05:25 PM

సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో సహాయం

05:21 PM

దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుపై రేపు వెబినార్..

05:07 PM

ఇసుకను వేడి చేస్తే బంగారంగా...

05:04 PM

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన..

04:51 PM

అన్ని గ్రామాలకు నాబార్డ్​ సేవలు: సీఎస్​

04:41 PM

మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య

04:30 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గిఫ్టుగా మహీంద్రా వాహనాలు..

04:20 PM

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

04:08 PM

లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఢిల్లీకి తరలింపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.