Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రెంజల్
ఈ నెల 15న సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ఈవెం ట్స్లో రెంజల్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు బంగారు పతకాలు సాధించారు. పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి అవినాష్ (100 మీటర్లు) ప్రథమ, అర్చన ద్వితీయ, పూజిత (200ల మీటర్లు) ద్వితీయ, మైపేందర్(హైజంప్) తృతీయ, భరత్ (200 మీటర్లు) ద్వితీయ, సుష్మ ఇంటర్ మొదటి సంవత్సరం (100 మీటర్లు) ప్రథమ, పల్లవి షార్ట్ఫుట్ తృతీయ, మేఘన (400 మీటర్లు) తృతీయ, బిందు ఇంటర్ ద్వితీయ సంవత్సరం (హైజంప్) ద్వితీయ, నరేష్ ఇంటర్ మొదటి సంవత్సరం (400 మీటర్లు) ప్రథమ స్థానాల్లో నిలిచి బంగారు పతకాలు పొందారని ప్రిన్సిపాల్ బలరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు ఆయేషాసుల్తానా, సుష్మ, అరుణ, సంతోష్ పాల్గొన్నారు.