Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షాద్నగర్ రూరల్
ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామ పంచాయతీకి చెత్తను సేకరించే ట్రాక్టర్ను శనివారం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సర్పంచ్ అరుణ శివకుమార్కు అందజేశారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్ తప్పనిసరని, గ్రామ సభల్లో అవసరాలను చర్చించి అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, వైస్ ఎంపీపీ మాచారం మౌనిక హరికృష్ణ గౌడ్, బూర్గుల ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు వెంకటయ్య, సంజీవ, రమేష్, లాలూ, మాధవి, ఎంపీడీవో శరత్ చంద్ర బాబు, ఈఓఆర్డీ సుమిత్ర, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరోజ పాల్గొన్నారు.