Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంచాల
మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం మండల కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షులు పి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏఐఎస్టీఎఫ్ నాయకులు ఎన్ పరమేష్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నారు. మండల అధ్యక్షులుగా మలగ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ గఫర్, అసోసియేట్ అధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా శోభారాణి, కార్యవర్గ సభ్యులుగా వేమారాజు, విక్రమ్, నీరజ, కేశవరావు, రాజు, జ్యోతి, నీరజ, చంద్రశేఖర్, పాండు, వెంకటేష్, విజయ, పుష్పలత, ఏవీ సుధాకర్, కిష్టయ్య, రాజా మల్లేష్, నారాయమ రెడ్డి లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.