Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
మోహదీపట్నంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మైన్ డైమండ్ షో శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి రెజరు మాట్లాడుతూ ఈ ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన ఈ నెల 11 వరకు కొనసాగనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆఫర్గా అన్ని మైన్ వజ్రాభరణాలపై 20 శాతం వరకూ ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపారు. అంతేగాకుండా అన్ని వజ్రాభరణాలకు నాణ్యతహమీతో ఐజీఐ సర్టిఫికేషన్తో జీవితకాల ఉచిత నిర్వహణ 100 శాతం తిరిగి కొనుగోలు హమీ, ఏడాది ఉచిత బీమా వంటి సదుపాయలు కల్పిస్తున్నట్టు వివరించారు. మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ సంస్థ ఒక సామాజిక భాధ్యత గల సంస్థ అని తెలుపుతూ తమ సంస్థ ఆదాయంలో గణనీయమైన వాటాని పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం తదితర విభాగాలలో ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.