Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమన్గల్
ఆమనగల్ పట్టణంలోని గ్రంథాలయం సమీపంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని కోరుతూ మంగళవారం స్థానిక చిరువ్యాపారులు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ వెంకక్రటాములకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ సమీపంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో స్థానిక కూరగా యల వ్యాపారులు, కిరాణకొట్టు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నట్టు తెలిపారు. సంబంధిత ఆధికారులతో చర్చించి త్వరలో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషిచేస్తానని కమిషనర్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. వ్యాపారులు కండె సాయి, కర్ణాటి సురేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.