Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
క్రికెటర్ల వేతనాల్లో కోత? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 16,2020

క్రికెటర్ల వేతనాల్లో కోత?

- గంగూలీ, అరుణ్‌ పరోక్ష సంకేతాలు
- ఐపీఎల్‌13 రద్దుతో ఆ పరిస్థితి తప్పదు
అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు. ఒక్క సీజన్‌ ఐపీఎల్‌తోనే ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం సొంతమవుతుంది. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌తో రూ. 65 కోట్లు ఖాతాలో వేసుకుంటుంది. ఐసీసీ ఆదాయంలో మెజార్టీ వాటా భారత క్రికెట్‌ బోర్డు ఖాతాల్లోకే వెళ్తోంది. అటువంటి ధనిక క్రికెట్‌ బోర్డు వేతకాల కోత నిర్ణయం తీసుకుంటుందని ఎవరైనా ఊహిస్తారా? కచ్చితంగా లేదు!.
క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) షేర్‌ మార్కెట్‌ నష్టాలతో ఉద్యోగులకు కేవలం 20 శాతం వేతనాలే అందిస్తోంది. బిగ్‌3 క్రికెట్‌ బోర్డు సీఏ ఆర్థిక పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు బీసీసీఐ అదే పని చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దుగా ముగిస్తే, భారత క్రికెట్‌ బోర్డులో వేతన కోత నిర్ణయం తప్పదు!.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఊహించని నిర్ణయం తీసుకోనుంది!. ఒక్క సీజన్‌ క్రికెట్‌ ఆగిపోవటం, ఒక్క సీజన్‌ ఐపీఎల్‌ నిలిచిపోవటంతోనే క్రికెటర్లకు, ఉద్యోగులకు వేతన కోత విధించేందుకు సిద్ధమవుతోంది. రూ. 10 వేల కోట్ల నగదు నిల్వ, ఇతర ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు బీసీసీఐ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఉందని చెబుతోంది. అయినా, ఈ సీజన్‌ నష్టాలను కారణంగా చూపి వేతనాల్లో కోత విధించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఆటగాళ్ల వేతకాల్లో కోత మా ప్రణాళికల్లో చిట్టచివరి అంశమని చెబుతూనే.. వేతనాల కోతను పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఐపీఎల్‌ రద్దు అయితే బీసీసీఐ భారీగా నష్టపోనుందని కోశాధికారి అరుణ్‌ కుమార్‌ ధుమాల్‌ వ్యాఖ్యానించగా.. ఆర్థిక పరిస్థితిపై అంచనా వేసిన తర్వాతే వేతనాల్లో కోతపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. వరుసగా కోశాధికారి, అధ్యక్షుడు వేతనాల కోత ప్రస్తావన తీసుకురావటం.. మున్ముందు వెలువడే నిర్ణయంపై పరోక్ష సంకేతాలని చెప్పవచ్చు.
బోర్డు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? : ఐపీఎల్‌2020 జరుగకపోతే, బీసీసీఐ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడనుందని కోశాధికారి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించగానే, అధ్యక్షుడు గంగూలీ అదే రాగం అందుకున్నాడు. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఐపీఎల్‌2020 నిరవధికంగా వాయిదా పడింది. ' ఆర్థిక పరిస్థితిని పరిశీలించాల్సి ఉంది. బోర్డు వద్ద ఎంత డబ్బు ఉంది, ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచిస్తాం. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)2020 నిర్వహణ సాధ్యం కాకుంటే బోర్డు రూ. 4 వేల కోట్లు నష్టపోనుంది. ఐపీఎల్‌ ఈ ఏడాది సాధ్యపడితే వేతనాల కోత గురించి ఆలోచించాల్సిన అవసరం బీసీసీఐకి ఉండదు' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ' క్రికెట్‌ సీజన్‌ త్వరగా పున ప్రారంభం కాకుంటే బీసీసీఐ ఆర్థికంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొవాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ వీలైనంత త్వరగా జరగాలని కోరుకుంటున్నాం. బీసీసీఐకి అతి పెద్ద ఆదాయ వనరు ఐపీఎల్‌ మరింత కీలకం' అని గంగూలీ అన్నాడు.
ఐపీఎల్‌ రద్దుగా ముగిస్తే ఈ ఏడాది బీసీసీఐ సుమారు రూ. 4 వేల కోట్లను కోల్పోనుంది. భారత క్రికెట్‌తో ముడిపడిన వ్యవస్థలు సైతం ఆర్థికంగా దారుణంగా దెబ్బతిననున్నాయి. ఈ ఒక్క సీజన్‌ ఐపీఎల్‌ ఆగిపోయినంత మాత్రాన బీసీసీఐ వేతకాల కోతపై ఆలోచన చేయాల్సిన అవసరం నిజందా? ఉందా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే రెండేండ్ల క్రితమే బీసీసీఐ వద్ద రూ. 10 వేల కోట్ల నిల్వ ఉంది. 2017-18 వార్షిక ఆర్థిక నివేదికలో బీసీసీఐ బ్యాంకు ఖాతాల్లో (మార్చి 31, 2018) రూ. 5526.18 కోట్లు ఉన్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో మరో రూ. 2011.83 కోట్లు ఉన్నాయి. ఇతర ఖాతాల్లో రూ. 900 కోట్లు నిల్వ ఉన్నాయి. కేవలం ఐపీఎల్‌ మీడియా హక్కుల రూపంలో స్టార్‌ ఇండియా రూ.3065 కోట్లు చెల్లిస్తోంది. 2018, 2019 సీజన్లలో స్టార్‌ ఇండియా రూ. 6135 కోట్లు చెల్లించింది. రెగ్యులర్‌గా ద్వైపాక్షిక సిరీస్‌ మ్యాచుల ద్వారా బీసీసీఐ దండిగా ఆర్జిస్తోంది. భారత్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌కు రూ. 65 కోట్ల వరకు సంపాదిస్తోంది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో బీసీసీఐ కనీసం మరో రూ. 5-6 వేల కోట్లు వెనకేసుకుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి బీసీసీఐ వద్ద కేవలం నగదు నిల్వ రూ. 10 వేల కోట్లుగా ఉందని అంచనా. ఆర్థిక మూలాలు ఇంత పటిష్టంగా ఉన్నప్పటికీ బీసీసీఐ ఉన్నతాధికారులు పదేపదే వేతకాల కోతను ఎందుకు ప్రస్తావిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్‌ వన్నె తగ్గుతుంది! : 2020 ఐపీఎల్‌ రద్దుతో బీసీసీఐ మీడియా హక్కుల రూపంలో రూ. 3065 కోట్లు, కేంద్ర స్పాన్సర్‌షిప్‌ల రూపంలో రూ. 618 కోట్లు ప్రాంఛైజీల లాభంలో 20 శాతం వాటాతో రూ. 520 కోట్లు కోల్పోనుంది. ఐపీఎల్‌తో ప్రతి ఏటా సుమారు రూ. 70 వేల కోట్ల లావాదేవీలు ముడిపడి ఉన్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చనుంది. బీసీసీఐ ఆదాయం నిలుపుకునేందుకు అభిమానులు లేకుండా ఐపీఎల్‌ను నిర్వహించేందుకు ఆలోచిస్తోంది. ఆర్థికంగా ఇది గట్టెక్కించే మార్గమే అయినా, అందుకు బీసీసీఐ బాస్‌ గంగూలీ సిద్ధంగా ఉన్నట్లు లేడు!. ' అభిమానులు లేకుండా క్రికెట్‌ ఆకర్షణ చాలా తక్కువ. అటువంటి మ్యాచ్‌ అనుభవం నాకు గుర్తుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో 1999 ఆసియా టెస్టు చాంపియన్‌షిప్‌, పాకిస్థాన్‌తో మ్యాచ్‌. అభిమానుల అల్లరితో ఆఖరు రోజు స్టేడియంలోని ఎవరినీ అనుమతించలేదు. ఆ రోజు అభిమానుల లేకుండా, ఉత్సాహం లేని వెలితి స్పష్టంగా తెలిసింది. భౌతిక దూరం మార్గదర్శకాలు కఠినంగా అమలు చేస్తూ అభిమానులు అనుమతిస్తే, అప్పుడు అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అది కఠినమైన నిర్ణయం' గంగూలీ అన్నాడు.

క్రికెట్‌ సీజన్‌ త్వరగా ఆరంభం కాకుంటే బీసీసీఐ సైతం ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొం టుంది. ప్రత్యేకించి ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యపడకుంటే రూ. 4 వేల కోట్లు నష్టపోతాం. బీసీసీఐ ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగితే వేతకాల కోతపై ఆలోచించాల్సిన అవసరం ఉండదు'
- సౌరవ్‌ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) బీసీసీఐకి ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణపై మాకు ఆలోచన లేదు. కానీ ఐపీఎల్‌ రద్దుగా ముగిస్తే బీసీసీఐ భారీగా ఆర్థిక నష్టం చవిచూడనుంది. క్రికెటర్లకు బకాయిల చెల్లింపులు జరుపుతున్నాం. ఆర్థిక పరిస్థితిపై అంచ నాకు రావాల్సి ఉంది. వేతనాల్లో కోత మా ప్రణాళికల్లో చిట్టచివరి అంశం'
- అరుణ్‌ ధుమాల్‌, బీసీసీఐ కోశాధికారి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
హద్దుమీరిన జాత్యహంకారం
కంగారూ గుప్పిట్లో సిడ్నీ
గబ్బాపై నీలినీడలు
ఐఎంజితో బీసీసీఐ కటీఫ్‌
రెండోరోజు మనదే
ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ బెటర్‌: గేల్‌
3న బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలు
ఆసీస్‌ దే తొలి రోజు
ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం
పాక్‌ కు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు
నట్టూను తీసుకోలేదేం!?
ఆధిపత్య సవాల్‌!
ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించాలి
సన్నీ ముంబయి బ్రాడ్‌ మన్‌

తాజా వార్తలు

11:13 AM

సీపీఐ(ఎం) కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి..

10:57 AM

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: యువకుడి మృతి

10:56 AM

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో WHO చీఫ్ ఆగ్రహం..

10:52 AM

కరోనా​తో కేరళ ఎమ్మెల్యే మృతి

10:52 AM

మొబైల్ షాప్ లో అగ్నిప్రమాదం

10:39 AM

దేశంలో కొత్తగా మరో 10వేల పాజిటివ్ కేసులు

10:25 AM

టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు

10:17 AM

కరోనా టీకా తీసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలకు అస్వస్థత

10:11 AM

నగరంలో 50 కేజీల గంజాయి స్వాధీనం

10:01 AM

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య

09:56 AM

నేడు జరగాల్సిన రైతు చర్చలు వాయిదా!

09:53 AM

సూరత్‌ ప్రమాదంపై ప్రధాని, రాజస్థాన్‌ సీఎం సంతాపం

09:17 AM

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

09:10 AM

కేంద్రం కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్న వారిలో..!

09:00 AM

ఆటా నూతన అధ్యక్షుడిగా భువనేశ్‌ బుజాల

08:45 AM

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

08:25 AM

కొత్త కారు కొనాలనుకునే వారికి భారీ షాక్..!

08:11 AM

ఓల్డ్ అల్వాల్‌లో విద్యార్థిని అదృశ్యం

08:09 AM

రాజన్న సిరిసిల్లలో చిరుత కలకలం

08:07 AM

కన్న కూతురిపై ఏడేళ్లుగా లైంగికదాడి

08:56 AM

కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 15 మంది మృతి

07:37 AM

గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

07:32 AM

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కేసీఆర్

07:04 AM

టీవీ నటిపై పైలట్ లైంగికదాడి

06:46 AM

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

06:41 AM

భీమ‌డోలులో వింత‌వ్యా‌ధి క‌ల‌క‌లం...

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.