Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బీసీసీఐలో పదవీకాలం పెంచండి! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • May 20,2020

బీసీసీఐలో పదవీకాలం పెంచండి!

- సుప్రీంకోర్టులో జైషా పిటిషన్‌
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల్లో కార్యదర్శిది అత్యంత కీలక భూమిక. అన్ని పనులు కార్యదర్శి చేతులమీదుగా జరుగుతాయి. బీసీసీఐ తరఫున అధికారిక ప్రకటనలు, ఇతర అంశాలపై వైఖరి కార్యదర్శి మాత్రమే వెల్లడిస్తాడు. కానీ కొన్ని రోజులుగా కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ బీసీసీఐ కార్యకలాపాలను చురుగ్గా చూస్తున్నాడు. వివిధ అంశాలపై బోర్డు వైఖరిపై పత్రికలకు అభిప్రాయాలను వెల్లడిస్తున్నాడు. దీంతో కార్యదర్శి జై షా ఏం చేస్తున్నాడనే సందేహం చాలా మందికి కలిగింది. జస్టిస్‌ లోధా కమిటీ సిఫారసుల ప్రకారం బీసీసీఐ నూతన రాజ్యాంగంలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి గరిష్టంగా వరుసగా ఆరు సంవత్సరాలు మాత్రమే పదవీలో కొనసాగేందుకు వీలుంది. గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) సంయుక్త  కార్యదర్శిగా జై షా 2013 నుంచి కొనసాగారు. బీసీసీఐ కార్యదర్శి పదవీ చేపట్టి తర్వాత జీసీఏ నుంచి వైదొలిగారు. గుజరాత్‌ క్రికెట్‌ సంఘం, బీసీసీఐలో పదవీ కాలం కలుపుకుని మే తొలి వారంతో ఆరేండ్లు పూర్తయ్యాయి. దీంతో జై షా అధికారికంగా కార్యదర్శి పదవికి అనర్హుడు అయ్యాడు. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ప్రస్తుతం అధికారికంగా విధులు నిర్వర్తించటం లేదని సమాచారం!. భారత క్రికెట్‌ బోర్డులో ఆరేండ్ల పూర్తి కాలం కొనసాగేందుకు 2019 డిసెంబర్‌లో జరిగిన బీసీసీఐ 88వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో రాజ్యాంగ సంస్కరణలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కరోనా వైరస్‌ సంక్షోభ సమయంలో ఐసీసీలో భారత్‌ ప్రయోజనాలు నిలుపుకోవటం, భారత క్రికెట్‌ వ్యవహరాలను చక్కదిద్దటం అత్యంత కీలకమని.. ఈ సమయంలో పదవీ నుంచి తప్పుకోవటం బోర్డుకు అపార నష్టమని పేర్కొంటూ.. జై షా ఆదివారం సుప్రీంకోర్టుకు ఈమెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్టు సమాచారం. పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్యదర్శిగా పూర్తి కాలం కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని జై షా పిటిషన్‌లో కోరినట్టు తెలుస్తోంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పదవీ కాలం సైతం ఈ జులైతో ముగియనుంది. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌)లో సౌరవ్‌ గంగూలీ సంయుక్త కార్యదర్శి, అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించాడు. సుప్రీంకోర్టులో జై షాకు లైన్‌ క్లియర్‌ అయితే, అది గంగూలీకి సైతం ఉపయోగపడనుంది. దీనిపై జై షా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్‌ విచారణపై ఇప్పుడు బీసీసీఐ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
స్టీవ్‌ స్మిత్‌ పై రాయల్స్‌ వేటు
క్రికెటర్ల స్వీయ సర్వీస్‌!
ఆ నలుగురు అద్వితీయం
309 కొట్టగలరా?!
హద్దుమీరిన జాత్యహంకారం
కంగారూ గుప్పిట్లో సిడ్నీ
గబ్బాపై నీలినీడలు
ఐఎంజితో బీసీసీఐ కటీఫ్‌
రెండోరోజు మనదే
ఒలింపిక్స్‌కు టీ10 ఫార్మాట్‌ బెటర్‌: గేల్‌
3న బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికలు
ఆసీస్‌ దే తొలి రోజు
ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం
పాక్‌ కు ఇంగ్లాండ్‌ అమ్మాయిలు
నట్టూను తీసుకోలేదేం!?
ఆధిపత్య సవాల్‌!
ఒలింపిక్స్‌ లో స్వర్ణం సాధించాలి
సన్నీ ముంబయి బ్రాడ్‌ మన్‌
కనీస ధర రూ.1500 కోట్లు?
హిట్‌మ్యాన్‌ సరిపోతాడు!
ఎందుకీ అంపైర్‌ కాల్‌?
అందరికీ నెగెటివ్‌
షకిబ్‌ వస్తున్నాడు!
టోక్యో అత్యుత్తమం కానుంది!

తాజా వార్తలు

10:16 AM

హార్దిక్ పాండ్యా కుటుంబంలో విషాదం

09:47 AM

సికింద్రాబాద్ లో 1.20 కిలోల బంగారం చోరీ

09:01 AM

జిల్లాల వారిగా టీకా కేంద్రాలు

08:40 AM

టీకా వేసుకున్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..

08:24 AM

ఈ ఏడాది నాగోబా జాతర రద్దు

07:56 AM

అక్షరయాన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

07:37 AM

తెలంగాణకు కొత్తగా 9 ఐఏఎస్‌లు .. ఇద్దరు తెలంగాణ వారే

07:14 AM

నేడు ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని

07:02 AM

నేడు రెండో విడత గొర్రెల పంపిణీ

06:51 AM

తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: ఈటల

11:53 PM

జవాన్ మోతీలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి వేముల

10:09 PM

దారుణం:చిరుతపులి మృతి

09:52 PM

మరో రాష్ట్రానికి పాకిన‌ బర్డ్ ఫ్లూ

09:22 PM

లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణం బ‌లి

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.