Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్థిక పోరాటాలే మతోన్మాదానికి విరుగుడు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 01,2020

ఆర్థిక పోరాటాలే మతోన్మాదానికి విరుగుడు

- ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే బీజేపీకి కళ్లెం
- కడుపు కాలిన ప్రజలు ఉద్యమించక తప్పదు
- జిల్లాలో పార్టీకి పూర్వవైభవాన్ని తేవడమే వనగంటి ఈశ్వర్‌కు నిజమైన నివాళి:సీపీఐ(ఎం) ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి వనగంటి ఈశ్వర్‌
- సంస్మరణ సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, మధు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
ఆర్థిక పోరాటాలే మతోన్మాద విచ్ఛిన్న వాదాలకు విరుగుడనీ, బీజేపీకి కళ్లెం వేయాలంటే ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే సాధ్యమని సీపీఐ(ఎం) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, పి. మధు అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సీపీఐ(ఎం) మాజీ జిల్లా కార్యదర్శి వనగంటి ఈశ్వర్‌ సంస్మరణ సభ వనపర్తి జిల్లా కేంద్రంలోని రాచ లక్ష్మయ్య ఫంక్షన్‌ హాల్లో సోమవారం నిర్వహించారు. ముందుగా ఈశ్వర్‌ చిత్రపటానికి తమ్మినేని, మధు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో సీపీఐ(ఎం) వ్యాప్తి కోసం వనగంటి ఈశ్వర్‌ చేసిన కృషి మరువలేనిదన్నారు. పూటకో పార్టీ మారి సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్న ఈ తరుణంలో ఎలాంటి స్వార్థప్రయోజనాలు ఆశించకుండా 23ఏండ్లు పార్టీ జిల్లా కార్యదర్శిగా అందరినీ ఏకతాటిపైకి తెచ్చి పని చేయించడం మామూలు విషయం కాదని తెలిపారు. ఎక్కడా ప్రజా పునాది లేని బీజేపీ సెంటిమెంట్‌ను ఆసరా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. నేడు జరిగే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ ఒక అడుగు ముందుకేసి తమ పార్టీ హిందువులదేనని చెప్పడం లౌకికతత్వానికి గొడ్డలిపెట్టన్నారు. బీజేపీ, ఎంఐఎం ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించడం తప్ప ప్రధాన రాజకీయ పార్టీలేవీ ప్రజా సమస్యలపై ఆలోచించిందేలేదన్నారు. రైతు వ్యతిరేక బిల్లులు రద్దు చేయాలని కోరుతూ పంజాబ్‌ ప్రజలు ఢిల్లీ నగరాన్ని ముట్టడి చేయడం చూస్తుంటే బిల్లుల పట్ల వ్యతిరేకత ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ఆర్థిక సమస్యలు తీవ్రమైనప్పుడు వర్గ పోరాటాలు తప్పవనీ, రైతుల పోరాటమే దానికి నిదర్శనమని తెలిపారు. దశాబ్దాల తరబడి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసిన ఈశ్వర్‌ బాటలో పార్టీ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే బీజేపీకి కళ్లెం : పి. మధు
ప్రాంతీయ పార్టీల ఐక్యతతోనే కేంద్రంలోని బీజేపీకి కళ్లెం వేయొచ్చని ఆంధ్రప్రదేశ్‌ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుంటే నక్సల్స్‌ మూకుమ్మడి దాడులు చేసినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమాలను ముందుకు నడిపిన ఘనత ఈశ్వర్‌కు దక్కుతుందని తెలిపారు. మళ్లీ జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. తూముకుంటలో పేదల భూములను భూస్వాములు ఆక్రమించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన చరిత్ర ఇంకా కండ్ల ముందు కదలాడుతుందన్నారు. ఎన్ని దాడులు చేసినా ఎత్తిన జెండా దించకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు. దేశంలో ఏ పార్టీ గెలిచిన రైతుల మౌలిక పరిస్థితులు మాత్రం మారడం లేదనీ, అందుకే ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట రైతు ఆగ్రహ జ్వాలలు వెలువడుతూనే ఉన్నాయన్నారు. పాలక పార్టీలు సమస్యల పరిష్కారంలో విఫలమై ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తే కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.
సభలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డాక్టర్‌ మురళి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లే గోపాల్‌, మాజీ కౌన్సిలర్‌ నాగేశ్వర్‌, సీపీఐ(ఎం) వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, గద్వాల జిల్లాల కార్యదర్శులు ఎండీ.జబ్బార్‌, వర్ధం పర్వతాలు, వెంకట్రా మిరెడ్డి, ఎ.రాములు, వెంకటస్వామి, కందికొండ గీత, లక్ష్మి, కురుమయ్య, పుట్ట ఆంజనేయులు, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు అరుణ్‌ కుమార్‌, చంద్రయ్య పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

26న ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు
మా రూటే సపరేటు
పోరాడకపోతే భవిష్యత్తు లేదు
నేడు పోడు ప్రజాగర్జన
వికటించిన టీకా...!
నాడు తెలంగాణ సాయుధ పోరాటం, నేడు రైతు ఉద్యమం
సాగు చట్టాలకు వ్యతిరేకంగా..రైతన్నల్లారా కదిలిరండి
యాదాద్రి.. సీఎం కలల ప్రాజెక్టు...
జిల్లాల్లో వీఆర్వోల ఆత్మగౌరవ సభలు
పాడిగేదెల పెంపకంతో దళితుల జీవితాల్లో వెలుగులు
మాట నిలబెట్టుకుంటారా !?
కార్మిక హక్కుల కోసం పోరాడేదే సీఐటీయూ
రూ.20 వేలు అలవెన్స్‌ చెల్లించాలి...
ఉద్యోగుల సమస్యలపై వెంటనే చర్చించాలి: సీఎం
వద్దు నాన్నా.. అంటున్నా..!
వ్యాక్సిన్‌ తీసుకున్న మరొకరి మృతి
దక్షిణాదిలో సుప్రీంకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి
ఆధునిక టెక్నాలజీతో 'మాక్‌ టెస్ట్‌'ల
ప్రాజెక్టుల చర్చించే దమ్ము లేక లీకులు ఇస్తున్నారు
పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించడానికి భయమేందుకు? : చిన్నారెడ్డి
సచివాలయంలో ప్రార్థనలు చేసేందుకు పోతే అరెస్టులా?
కరోనానే ఓడింది.. మోడీ ఎంత..
ఏడాది చివరినాటికి పాలమూరు-రంగారెడ్డి పూర్తి
బీజేపీ ఓటమే ధ్యేయం
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?
హైదరాబాద్‌లో ఐక్యవేదిక దీక్ష భగం
కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఏవి?
పింఛన్‌ ఎప్పుడిస్తరు?
మేయర్‌ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు నిషేధం
చట్టాలు రద్దు చేసే దాకా ఉద్యమం

తాజా వార్తలు

01:32 PM

ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌

01:32 PM

కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..

01:28 PM

ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

01:17 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల

01:12 PM

సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం

01:09 PM

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12:59 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

12:50 PM

తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి

12:44 PM

ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..

12:36 PM

ఆటో బోల్తా.. ఒకరు మృతి

12:22 PM

మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు

12:14 PM

కొత్త‌కోటలో గుప్త నిధులు.?

12:06 PM

యువకుడి వేధింపులు భరించలేక 7వ తరగతి బాలిక ఆత్మహత్య..

11:50 AM

విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ మృతి

11:49 AM

తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

11:32 AM

ఒకే కుటుంబంలోని నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడి..

11:29 AM

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్

11:20 AM

నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్

11:09 AM

గణతంత్ర దినోత్సవం.. నేపథ్యంలో సరిహద్దులో గట్టి బందోబస్తు

11:00 AM

ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం..

10:56 AM

రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

10:48 AM

భారీగా తగ్గిన బంగారం ధర..

10:43 AM

పటాన్‌చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం

10:40 AM

దేశంలో కొత్తగా 13వేల పాజిటివ్ కేసులు..

10:32 AM

రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ..

10:12 AM

దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!

09:47 AM

చిరుత దాడిలో జింక మృతి

09:46 AM

టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

09:42 AM

రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌

09:36 AM

తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.