Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక విడత
- 25 వరకు వెబ్ఆప్షన్ల నమోదు
- షెడ్యూల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహణకు సంబంధించి ఐసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం షెడ్యూల్ను విడుదల చేశారు. ఈనెల 23న ఆన్లైన్లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందనీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకునేందుకు అవకాశముంటుందని తెలిపారు. ఈనెల 24న స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. ఈనెల 23 నుంచి 25 వరకు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 27న సీట్లు కేటాయిస్తామని వివరించారు. ఈనెల 27 నుంచి 29 వరకు సీట్లు కేటాయించిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. ఈనెల 27 నుంచి 30 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ప్రయివేటు కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 27న స్పాట్ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఇతర వివరాలకు https://tsicet.nic.in వెబ్సైట్ను చూడాలని కోరారు.