Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పది శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు చేసేందుకు నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీనిపై రెండు మూడ్రోజుల్లోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. 'ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు వాటిని యధావిధిగా కొన సాగిస్తూనే ఈడబ్ల్యూఎస్లకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి...' అని సీఎం తెలిపారు.