Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బూర్గుల నర్సింగ్‌ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

బూర్గుల నర్సింగ్‌ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి

- సంతాప సభలో వామపక్ష నేతలు
- రైతాంగం తరహాలో కమ్యూనిస్టు ఉద్యమాలుండాలి : నారాయణ
- వామపక్ష పోరాటాలకు ప్రతీక : డీజీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధలు బూర్గుల నర్సింగ్‌రావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వామపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. ఉద్యమ నేతగా, రచయితగా, ప్రజాస్వామ్య, లౌకికవాదిగా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారని ఆయన సేలవను కొనియాడారు. స్వాతంత్య్రోద్యమంతోపాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప నాయకుడని అన్నారు. చివరి వరకూ మార్కిస్టు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఆయన మరణం కమ్యూనిస్టు, వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటని అన్నారు. వామపక్ష పార్టీల ఐక్యతను సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈనెల 18న కరోనాతో మరణించిన బూర్గుల నర్సింగ్‌రావు సంతాపసభ గురువారం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ వామపక్ష ఉద్యమానికి ప్రతిబింబం నర్సింగ్‌రావు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే, అందులో చేసిన వారూ కొట్టుకుపోతారని చెప్పారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీది అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. వామపక్షాలు, ప్రజాస్వామ్యవాదులను అణచివేసిన మమతను ఇప్పుడు మతతత్వ శక్తుల నుంచి కాపాడే వారే లేరన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం ఉండకూడదని కేసీఆర్‌ భావించారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ ఆత్మరక్షణలో పడ్డారని చెప్పారు.కమ్యూనిస్టులు ఉండకూడదని అనుకుంటే ఆయన ఉండరని అన్నారు. రైతాంగ ఉద్యమాల తరహాలో కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు మాట్లాడుతూ బూర్గుల నర్సింగ్‌రావు వామపక్ష ఉద్యమాలకు ప్రతీకగా ఉన్నారని అన్నారు. ఆలం కుంద్‌మిరి, సీఎన్‌ చారి, దామోదరన్‌, సంజరుబారు, బూర్గుల నర్సింగ్‌రావుతో కలిపి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ ఏర్పాటైందని చెప్పారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వామపక్షవాదిఅని అన్నారు. అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిమాట్లాడుతూ ఆశయాలు, ఆకాంక్షలు, భావాలు, లక్ష్యాలను నేటి తరాలకు తెలియజేసేందుకు ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రచురిస్తామని ప్రకటించారు. వామపక్షాల ఐక్యత దిశగా ఆలోచనలు, ప్రయత్నాలు, చర్చలు సాగుతున్నాయని చెప్పారు. సినీనటుడు ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ వామపక్ష పార్టీలన్నీ కలవాలనీ, పీడిత ప్రజల సమస్యలపై పోరాడాలని చెప్పారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ దోపిడీ లేని సోషలిస్టు వ్యవస్థ కోసం కృషి చేయాలని అన్నారు. రక్తసంబంధం కంటే వర్గసంబంధం గొప్పదని బూర్గుల నర్సింగ్‌రావు నిరూపించారని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు జైని మల్లయ్యగుప్తా మాట్లాడుతూ దౌర్జన్యాలు చేసేవారు హిందువులైనా, ముస్లింలైనా ఒక్కటేననీ, వారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, తెలంగాణ అమరవీరుల ట్రస్ట్‌ కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, బూర్గుల నర్సింగ్‌రావు సోదరుడు బూర్గుల ప్రదీప్‌, కష్ణ (ఎంసిపిఐ(యు), గుర్రం విజరుకుమార్‌ (సీపీఐ(ఎంఎల్‌), డి రాజేశ్‌ (సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌), విమలక్క (అరుణోదయ సాంస్కతిక సమాఖ్య), గంగాధర్‌ (ఎస్‌యూసీఐసీ) తదితరులు ప్రసంగించారు. మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ ఎపి రాష్ట్ర నాయకులు పిజె చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంతాప సందేశాన్ని చాడ వెంకట్‌రెడ్డి చదివి వినిపించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దోచిపెట్టడమే..
ఐటీఐఆర్‌ తెచ్చే దమ్ముందా ?
పొలాలు ఎండిపోతున్నాయ్..
పోటెత్తిన మిర్చి..
కీచక హెడ్‌మాస్టర్‌
సాగు చట్టాల రద్దు కోసం 6న మానవహారాలు
హాస్టల్‌ వర్కర్లందరిని పర్మినెంట్‌ చేయాలి
ఐసీడీఎస్‌లను యధావిధిగా కొనసాగించాలి
భూమే లేనప్పుడు మేమేందుకు..
ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బొడ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌
పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు చేసుకోవచ్చు
కుబేరులకు తాకట్టు
పీఏసీఎస్‌ చైర్మెన్‌ను శిక్షించాలి
క్షణికావేశం.. రెండు ప్రాణాలు బలి
168 మందికి కరోనా
వైఎస్‌ కుటుంబంలో ఆస్తి తగాదాలు
మూడో రోజూ 20,251 మందికి వ్యాక్సిన్‌
సీఎం పీఆర్వో రాజీనామా
కాంగ్రెస్‌కు ఇందిరాశోభన్‌ రాజీనామా
పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తాజా వార్తలు

09:49 PM

అమెరికాలో విషాదం..చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

09:30 PM

మరో యువతితో అడ్డంగా దొరికిన భర్త.. చికతబాదిన భార్య

08:53 PM

వామన రావు దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్

08:19 PM

దారుణమైన ఘటన..పబ్లిక్‌గా భార్యను చంపబోయిన భర్త వీడియో

08:02 PM

ప్రోఫెసర్ నాగేశ్వర్ ను గెలిపించాలి : ప్యాకా సభ్యులు

07:10 PM

ఏపీలో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

06:42 PM

అసెంబ్లీ వద్ద గన్​తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య..

06:23 PM

ఆస్తి కోసం దారుణం..

06:14 PM

అది జాతి వ్యతిరేక చర్యే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్

06:08 PM

నితిన్ 'రంగ్ దే' నుంచి మూడో పాట విడుదల..

05:50 PM

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. నలుగురు కీలక నేతల రాజీనామా

05:22 PM

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

05:17 PM

జాతిరత్నాలురా మీరు.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్‌ అదిరింది

04:55 PM

మెదక్ జిల్లాలో విషాదం..తల్లీకూతుళ్ల సజీవదహనం

04:46 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:43 PM

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

04:41 PM

రేపటి ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం

04:36 PM

80 ల‌క్ష‌లు విలువ చేసే గంజాయి స్వాధీనం

04:23 PM

205 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

03:56 PM

బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన హీరోయిన్‌ భర్త

03:50 PM

ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటే : రేవంత్‌

03:38 PM

వైసీపీ ప్రభుత్వంపై మండిప‌డ్డ నంద‌మూరి బాల‌కృష్ణ‌

03:30 PM

న్యాయవాదుల విధుల బహిష్కరణ..నిరసన దీక్ష

03:22 PM

షాకింగ్ వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప

03:01 PM

శంషాబాద్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

02:44 PM

నటుడి అసిస్టెంట్‌ ఆత్మహత్య

02:26 PM

నాగచైతన్య కోసం నదిలో దూకాడు.. వీడియో వైరల్

01:59 PM

కార్ల‌ అద్దాలు ధ్వంసం చేస్తూ వ్యక్తి వీరంగం

01:49 PM

దుండగుల కాల్పుల్లో..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

01:15 PM

ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు విత్‌డ్రా పై ఎస్ఈసీ సీరియస్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.