Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పీఆర్సీ ఇంత జాప్యమా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

పీఆర్సీ ఇంత జాప్యమా?

- 30 నెలలైనా అమలు కాని వైనం.. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే కాలయాపన
- సీల్డ్‌ కవర్‌ను తెరవని త్రిసభ్య కమిటీ
- ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలపై అస్పష్టత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ప్రకటిస్తుందా?అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకారం 2018, జులై 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందుకోవాలి. కానీ 30 నెలలైనా పీఆర్సీని అమలు చేయకుండా కావాలనే సర్కార్‌ కాలయాపన చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈస్థాయిలో అలసత్వం ఎప్పుడూ జరగలేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గతంలో పాలకులతో కొట్లాడి పీఆర్సీని సాధించుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు అది నెరవేర్చుకోలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై యూఎస్‌పీసీ, జాక్టోలోని ఉపాధ్యాయ సంఘాలతోపాటు ఐక్యవేదికలోని ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే టీఎన్జీవో, టీజీవో నేతృత్వంలో జేఏసీ మాత్రం పోరాటాన్ని పక్కనపెట్టిందని ఉద్యోగులు మండిపడ్డారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా పీఆర్సీ అమలులో అది కనిపించడం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘంగా పరిశీలించిన సిఆర్‌ బిశ్వాల్‌ నేతృత్వంలోని పీఆర్సీ కమిటీ గతనెల 31న నివేదికను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు అందజేసింది. కాగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చల కోసం రాష్ట్ర ప్రభుత్వం సీఎస్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించింది. 22 రోజులైనా సీల్డ్‌కవర్‌లో ఉన్న ఆ నివేదికను తెరవలేదు. సంక్రాంతి కానుకగా పీఆర్సీ ప్రకటన వస్తుందని అందరూ అనుకున్నారు. అదీ నెరవేరలేదు. అసలు త్రిసభ్య కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుపుతుందా?అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మూడు పీఆర్సీలు నష్టం...
సకాలంలో పీఆర్సీని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 14వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పొందేవారు. కానీ పాలకుల వైఖరి కారణంగా 11వ పీఆర్సీలోనే ఉండి పోవాల్సి వచ్చింది. అంటే మూడు పీఆర్సీలు నష్టపోయారన్న మాట. గతంలో కాంగ్రెస్‌, టీడీపీ, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ఏ పార్టీ అధికారంలో ఉన్నా పీఆర్సీ సకాలంలో అమలు కాలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. 8వ పీఆర్సీని 2003, జులై ఒకటి నుంచి అమలు చేయాలి. కానీ 2005, ఏప్రిల్‌ ఒకటి నుంచి 16 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్థిక ప్రయోజనాన్ని వర్తింపచేశారు. దీంతో ఉద్యోగులు 21 నెలలు పెరగాల్సిన వేతనాలు రాక నష్టపోయారు. 9వ పీఆర్సీని 2008, జులై ఒకటి నుంచి అమలు చేయాలి. కానీ 2010, ఫిబ్రవరి ఒకటి నుంచి 39 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్థిక ప్రయోజనాన్ని వర్తింపచేసింది. ఏప్రిల్‌ ఒకటి నుంచి నగదు రూపంలో ఉద్యోగులకు ఇచ్చింది. 9వ పీఆర్సీలో 19 నెలలు ఉద్యోగులు తమ ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయారు. 2013, జులై ఒకటి నుంచి పదో పీఆర్సీ అమలు కావాలి. కానీ 2014, జూన్‌ 2 నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌తో అమలైంది. అయితే 2015, ఏప్రిల్‌ ఒకటి నుంచి నగదు రూపంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చింది. పదో పీఆర్సీలో 12 నెలలపాటు ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాన్ని వదులుకోవాల్సి వస్తున్నది. ఇలా ప్రతి పీఆర్సీలోనూ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాన్ని నష్టపోతూనే ఉన్నారు. తెలంగాణలోనైనా సకాలంలో పీఆర్సీ అమలవుతుందని అందరూ ఆశించారు. 'తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 2018, జూన్‌ 2న మధ్యంతర భృతి (ఐఆర్‌), ఆగస్టు 15 నాటికి పీఆర్సీ నివేదిక ఇవ్వడంతోపాటు అమలు కావాలి.'అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 2018, మే 16న ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలకు ఇచ్చిన హామీ నీటి మీద రాతే అయ్యిందన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.
తాత్సారం చేయడం సరికాదు : చావ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి
పీఆర్సీని సకాలంలో అమలు చేయకుండా తాత్సారం చేయడం సరైంది కాదు. ఉమ్మడి ఏపీలో పీఆర్సీ ఆలస్యమైతే ఉద్యమించి సాధించుకున్న సందర్భాలున్నాయి. ఉద్యోగులు అడగకుండానే పీఆర్సీ కమిటీని వేసి కాలయాపన చేయడం తగదు. పీఆర్సీ నివేదిక ఇచ్చినా త్రిసభ్య కమిటీ పేరుతో అధ్యయనం చేయడం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకపోవడం, ఇంకా బహిర్గతం చేయకపోవడం దుర్మార్గం. ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను విశ్వాసంలోకి తీసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులుంటే వివరించాలి. అంతే తప్ప కాలయాపన చేయడం సరైంది కాదు.
టీఎన్జీవో, టీజీవో ప్రకటనలతో గందరగోళం : చిలగాని సంపత్‌కుమారస్వామి, టీఈఏ అధ్యక్షులు
టీఎన్జీవో, టీజీవో నేతల ప్రకటనలతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి పీఆర్సీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. పోరాడాల్సిన ఆ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం తరఫున ప్రకటన చేయడం సరికాదు. ఈ వైఖరిని విడనాడి ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పింఛనర్ల కోసం పోరాడాలి. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమానికి ఆ సంఘాలు సంఘీభావం ప్రకటిస్తేనే ఉద్యోగుల్లో నమ్మకం కలుగుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అణా పైసా ఇవ్వలే...
చట్టబద్ధ లూటీ
ప్రశ్నించే గొంతుకేదో ప్రజావేదికలో తేల్చుకుందాం
విద్యుత్‌ ఉద్యోగుల రివర్షన్‌
ప్రశ్నించే గొంతుకలను బలపరుద్దాం
ఎస్‌హెచ్‌జీ ల వృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
తులసి మరణం మత్స్యకారులకు తీరని లోటు
కరెంట్‌ కోతలతో కష్టం..
సర్పంచ్‌ పై ఏసీబీ దాడులు
ఎమ్మెల్సీగా జయసారధిరెడ్డిని గెలిపించాలి
టీఆర్‌ఎస్‌ లో సాగరం
కేసు కొట్టేయండి
ఉద్యోగం వస్తుందో.. రాదో..
వివరాలు సరిచూసుకోండి:ఇంటర్‌ బోర్డు
తెలంగాణ సివిల్‌ సప్లయిస్‌, జీసీసీ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌
పాస్‌ పుస్తకాల విషయంలో అన్నను చంపిన తమ్ముళ్లు
పడ్నా లిఖ్నా అభియాన్‌ పథకం అమలు
టెన్త్‌ ఫీజు గడువు 12 వరకు పొడిగింపు
మార్చి 8న సెలవు ఇవ్వాలి : సీఐటీయూ
జీతాలిచ్చాం
దేశంలోనూ, రాష్ట్రంలోనూ అరాచకపాలన
టీఆర్‌ఎస్‌ పాలనలో అద్భుత ప్రగతి : మంత్రి కేటీఆర్‌
నౌ షేరాకు మరో ఆరు వారాలు బెయిల్‌ పొడిగింపు
ఎన్నికల ఎజెండాగా.. కోచ్‌ ఫ్యాక్టరీ
గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపు
కేసు కొట్టేయండి
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
యాదాద్రి.. దేశంలోని ఆలయాలకు ఆదర్శం
మంత్రాలతో బంగారమంటూ మోసం
54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు

తాజా వార్తలు

09:56 PM

కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి

09:45 PM

జోగులాంబ గద్వాలలో భారీగా మద్యం పట్టివేత

09:36 PM

తమిళిసైకి అంతర్జాతీయ పురస్కారం

09:07 PM

బిగ్‌బాస్ విన్నర్‌ ఇంట తీవ్ర విషాదం

08:56 PM

ఏసీబీ వలలో సర్పంచ్..!

08:32 PM

పరిటాల శ్రీరామ్‌పై కేసు

08:23 PM

రాత్రి పెండ్లి..తెల్లారే సరికి వధువు మృతి..!

08:16 PM

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ షాక్

08:09 PM

విశాఖ టీడీపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

07:37 PM

మేయర్‌పై ఆర్జీవీ వివాదాస్పద వ్యాఖ్యలు

07:26 PM

విమానం టేకాఫ్‌కు కొన్ని క్ష‌ణాల ముందు త‌న‌కు క‌రోనా సోకింద‌ని..!

07:13 PM

అభిజిత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్

07:12 PM

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్

06:35 PM

ఏపీలో మరోసారి 100కి పైగా కరోనా కేసులు

06:32 PM

భారీగా తగ్గిన బంగారం ధరలు

06:26 PM

టీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్

06:08 PM

బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లు: జగన్‌

06:03 PM

ఆరుగురితో తొలి జాబితా విడుదల చేసిన అన్నాడీఎంకే

05:57 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రాజస్తాన్‌ సీఎం

05:42 PM

ఉత్తరాఖండ్ వరద ప్రాంతంలో కొత్త బ్రిడ్జీ ప్రారంభం

05:22 PM

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్

05:02 PM

బొండపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

04:53 PM

వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీ

04:44 PM

ఇంగ్లాండ్‌పై రిషబ్ పంత్ మెరుపు సెంచరీ

04:34 PM

భర్తకు షాకిచ్చిన భార్య!

04:23 PM

భారీ నష్టలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:21 PM

కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

04:12 PM

ఐసీఐసీఐ ఖాతాదారుల‌కు గుడ్‌న్యూ‌స్‌

03:47 PM

షణ్ముక్ జస్వంత్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

03:39 PM

జనరేటర్ ఏర్పాటు చేయండి: మేయర్ విజయలక్ష్మి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.