Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

బోర్డు తెస్తావా? రాజీనామా చేస్తావా?

- ఎంపీ అరవింద్‌ను నిలదీసిన పసుపు రైతులు
- రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముఖాముఖి
- బోర్డు నా స్థాయి కాదు.. ధర తన పరిధిలో లేదు.. ఏం చేస్తరో చేస్కోండి : ఎంపీ
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిది/కమ్మర్‌పల్లి
లోక్‌సభ ఎన్నికల్లో హామీనిచ్చినట్టుగా నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తావా లేక ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా అని పసుపు రైతులు ఎంపీ ధర్మపురి అరవింద్‌ను నిలదీశారు. పది రోజుల గడువు ఇస్తున్నామని, పదవికి రాజీనామా చేసి రైతుల ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఎంపీని గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరిం చారు. అయితే, పసుపు పంటకు మద్దతు ధర
అంశం తన పరిధిలో లేదు.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు తన స్థాయి కాదు.. రైతులు ఏం చేస్తారో చేస్కోండి అంటూ ఎంపీ అరవింద్‌ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వైఖరిని నిరసిస్తూ రైతులు 'ఎంపీ డౌన్‌డౌన్‌' 'ఎంపీ రాజీనామా' చేయాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పసుపు బోర్డు, మద్దతు ధరపై పసుపు రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలో ఎంపీ అరవింద్‌తో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాజాకీయ పార్టీలకు అతీతంగా గత లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు డిమాండ్‌తో పోటీ చేసిన అభ్యర్థులు, రైతు నాయకులు పాల్గొన్నారు. ఎంపీ అరవింద్‌ను, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డిని రైతులు ఆహ్వానించారు. సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ముందుగా ఎంపీ మాట్లాడుతూ.. పసుపు పంట అంశంపై వివిధ కేంద్ర మంత్రులతో సమావేశమయ్యానని, జిల్లాలో స్పైస్‌ రీజినల్‌ బోర్డు కార్యాలయం తానే ఏర్పాటు చేయించానని చెప్పారు. మధ్యవర్తుల వల్లే రైతుల పంటకు ధర రావడం లేదన్నారు. మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వంతో లేఖ రాయిస్తే రూ.10 వేల వరకు వచ్చేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎంపీ వ్యాఖ్యలపై రైతులు ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ వైపు ఈ-నామ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులను రైతులకు అనుసంధానం చేయిస్తామని చెప్పి.. మళ్లీ ఇప్పుడు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ నుంచి పంటను తొలగిస్తాననడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. జిల్లాలో పసుపు పంటను పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తామని, కానీ ఇటీవల కాలంలో ఎరువుల ధరలు భారీగా పెరిగాయి.. కానీ పంటకు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏం సంబంధముందని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు హామీ నెరవేర్చలేదనే ఎన్నికల్లో ఓడించి, బోర్డు హామీనిచ్చిన మిమ్మల్ని గెలిపించామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టడమేంటని ప్రశ్నించారు. వాదనలు, వాగ్వాదం నేపథ్యంలో.. అసలు పసుపు రైతులకు తాను రాసిచ్చిన బాండ్‌ పేపర్‌లో బోర్డుకు నిర్ధిష్ట సమయం, పంటకు మద్దతు ధర కల్పిస్తానని చెప్పలేదని ఎంపీ అరవింద్‌ మాట మార్చారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల్లో బోర్డు తీసుకొస్తానని చెప్పిన పలు వీడియోలను ప్రదర్శించారు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ నుంచి లేఖ కావాలంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి తమతో పోరాటంలో భాగస్వామ్యం కావాలని రైతులు డిమాండ్‌ చేశారు. 'మా ఉద్యమానికి నేతృత్వం వహించండి. మీరు అగ్రభాగాన నడవండి. ఫామ్‌హౌస్‌, ప్రగతిభవన్‌, సెక్రటేరియేట్‌ ఇలా ఎక్కడి రమ్మంటే అక్కడికి వస్తాం' అని అన్నారు. రైతుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని ఎంపీ.. 'సబ్సిడీలు ఏమైనా కావాలంటే ఇప్పిస్తా. మద్దతు ధర నా పరిధిలో లేదు. బోర్డు నా స్థాయి కాదు. అది విధానపరమైన నిర్ణయం. మీరు ఏం చేసుకుంటారో చేస్కోండి' అంటూ లేచి వెళ్లిపోయారు. దీంతో రైతులు ఎంపీని వెంబడిస్తూ అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'ఎంపీ డౌన్‌డౌన్‌' 'ఎంపీ రాజీనామా చేయాలి' అని నినదించారు. ఈ సమావేశంలో రైతు ఐక్యవేదిక నాయకులు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పన్నాల తిరుపతిరెడ్డి, కోల వెంకటేష్‌, పడిగెల ప్రవీణ్‌, సుంకెట రవి, మల్లారెడ్డి, సుమన్‌, ముక్కెర విజరు, ఏలిటి మల్లారెడ్డి, గడ్డం రాజేశ్వర్‌, ముస్కు మహేందర్‌, కొమ్ముల సంతోష్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు సుమారు 250 మంది వరకు రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పట్టభద్రుల చక్రబంధంలో 'పార్టీలు'
శనగ పంటను కొనండి
కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి
ప్రజలే బీజేపీకి మొలలు కొడ్తరు
కార్పొరేట్‌ విద్యాసంస్థలతో సీఎం లాలూచీ : బండి
రాష్ట్రంలో తగ్గుతున్న రికవరీలు
సత్యాన్వేషణే సైన్స్‌
నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం
బతుకు కష్టం...
రాజాసింగ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో
పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు గుర్తుచేయండి
శనగపంట కొనాలి
బీజేపీ దూకుడుకు కళ్లెం!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
వేధింపులు..నోటీసులు
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ
ప్రయివేటీకరణ విధానాల వెనుక రాజకీయాన్ని ఓడించాలి
మార్చి 18న మహిళా వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు
ప్రజా గొంతుకకు పట్టం కట్టండి
పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సీఎస్‌ సన్మానం
178 మందికి కరోనా
అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు చేయండి
హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
ఎడ్‌ సెట్‌ లో భారీ మార్పులు
న్యాయవాదుల భద్రతా చట్టం తేవాలి
6 ఏండ్లు..450 తీవ్ర కేసులు పెండింగ్‌
ప్రశ్నించేందుకు గెలిపించండి
తలసాని నోరు అదుపులో పెట్టుకో : దాసోజు
చిరంజీవి వైద్యానికయ్యే ఖర్చు భరిస్తాం

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.