Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కరోనానే ఓడింది.. మోడీ ఎంత.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

కరోనానే ఓడింది.. మోడీ ఎంత..

- రైతు ఉద్యమం చారిత్రాత్మకమైంది
- 26న లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ : కార్మిక, కర్షక ధర్నాలో ఏఐకేఎస్‌ నేత విజ్జుకృష్ణన్‌
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్‌
ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత దేశంలో జరుగుతున్న రైతాంగం ఉద్యమం చారిత్రాత్మకమైందని ఏఐకేఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం చరిత్ర సృష్టిస్తున్నదని తెలిపారు. దేశాన్ని వణికించిన కరోనానే ఈ ఉద్యమం ఓడించిందనీ, నరేంద్రమోడీ కూడా ఓటమి తప్పదని హెచ్చరించారు. జాతీయోద్యమం తర్వాత కార్మిక, కర్షకుల మధ్య ఐక్యతను పెంచింద న్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ, విద్యుత్‌ సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ శనివారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకే పార్కులో కార్మిక,కర్షక ధర్నా జరిగింది. దీనికి ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు టిసాగర్‌, పశ్యపద్మ, కె రంగయ్య, అచ్యుతా రామారావు, కన్నెకంటి రవి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఉద్యమంలో మరణించిన రైతులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విజ్జుకృష్ణన్‌ మాట్లాడుతూ సాగు చట్టాలను రద్దుకోసమే కాకుండా ప్రత్యామ్నాయ విధా నాల కోసం పోరాటం జరుగుతున్నదన్నారు. కేరళ రాష్ట్రంలో రూ 3600 కోట్లతో సంక్షేమ కేరళ అమలు చేస్తున్నట్టు తెలిపారు. 90 లక్షల మందికి ఫూడ్‌కిట్స్‌, 60వేల మందికి పెన్షన్‌ ఇస్తున్నట్టు తెలిపారు. విద్య, వైద్య, రేషన్‌, సామాజిక భద్రతను కల్పిస్తున్న కేరళ తరహాలోనే దేశ వ్యాపితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ ఉద్యమం నుంచి మహిళలు వెనక్కి పోవాలని సుప్రీం కోర్టు సూచించడం సరైందికాదన్నారు. వ్యవసాయంలో అత్యధికంగా మహిళల శ్రమ ఉన్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ఉద్యమం ఉధృతమవుతున్నదన్నారు. 26నఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో రైతులు పరేడ్‌ నిర్వహించబోతున్నారని తెలి పారు. జాతీయ రహదారులను ఐదులక్షల మంది దిగ్భంద నం చేశారన్నారు. ఈ పోరాటం రైతులు గెలిచేదాకా జరుగు తుందన్నారు. కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి రావడానికి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిందనీ, అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనేక రాయితీలు ప్రకటించిందన్నారు. వ్యవ సాయ సంక్షే మం, ఆర్థికమాంద్యం, కరోనా పరిస్థితులను ఎదుర్కొవడం లో కేంద్రం విఫలమైందన్నారు. సంవత్సరానికి దేశంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవే దన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రొఫెసర్‌ కె నాగేశ్వర్‌ మాట్లాడుతూ కార్మిక, రైతు చట్టాల్లో వ్యాపారులు వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఉంటే అభ్యంత రం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రయివేటు కంపెనీలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శిం చారు. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రూ 18 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నదన్నారు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్మే స్వేచ్ఛ లేకుండా చేసిందన్నారు. 31 పంటలకు మద్దతు ధర ఉండగా, 29 పంటలను ప్రయివేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ల ద్వారా కేవలం 6శాతం మాత్రమే కొనుగోలు చేస్తు న్నారనీ, ఈచట్టాలతో అది కూడా ఉండదన్నారు. రైతుకు అన్యాయం జరిగితే కోర్టుకు పోయే అవకాశం లేకుండా చేసిందనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమ న్నారు. కాంట్రాక్టు వ్యవ సాయం ఒప్పందం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగు తుందని చెప్పారు. ఏఐకేఎస్‌సీసీ జాతీయ నాయకులు విస్సా కిరణ్‌ మాట్లాడుతూ ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసం ఉద్యమన్నారు. రైతులు విజయం సాధిస్తే దేశం విజయం సాధిస్తున్నదని చెప్పారు. స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎవరో ఇస్తే వచ్చేవి కావనీ, అందుకు రక్త చిందించాల్సిందేనని నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, మాదినేని లక్ష్మి, విఎస్‌ బోస్‌ (ఏఐటీయూసీ), జె వెంకటేష్‌ (సీఐటీయూ), జి రాంబాబు (టీఆర్‌ఎస్‌కేవీ), సూర్యం (ఐఎఫ్‌టీయూ), ఎం శ్రీనివాస్‌ (ఐఎఫ్‌టీయూ), ఎంకే బోస్‌ (టీఎన్‌టీయూసీ), జిటి గోపాలా రావు (డిఫెన్స్‌), జి తిరుపతయ్య (బ్యాంకింగ్‌), క్లెమెట్‌ (ఎల్‌ ఐసీ), రాజు భట్టు (మెడికల్‌ రిప్స్‌), కె భాస్కర్‌ (కేవీపీఎస్‌), శ్రీరాంనాయక్‌ (టీజీఎస్‌), బి ప్రసాద్‌, బొప్పని పద్మ (వ్యకాస), అబ్బాస్‌ (ఆవాజ్‌), ఎంవి రమణ (వృత్తిదారులు) పార్ధసారధి (ఐలు), ఎస్‌ఎల్‌ పద్మ, అరుణ (ఐఎఫ్‌టీయూ), వి నాగేశ్వరరావు, అజీజ్‌ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు)తో పాటు సివిల్‌ సప్లయిస్‌ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తొలుత నిరాకరించిన పోలీసులు
ఏఐకేఎస్‌సీసీ ధర్నాకు అనుమతి విషయంలో ఇటు సర్కారు, అటు పోలీసులు దాగుమూతలు ఆడారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించాలనుకున్న మహపడావ్‌కు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత బాగ్‌లింగంపల్లి మార్చుకుని, పార్కులో చేసుకోవాలని సూచించారు. కొద్దిసేపు తర్వాత అక్కడ కూడా వద్దంటూ అభ్యంతరాలు చెప్పారు.
దీంతో ఆగ్రహం చెందిన ఏఐకేఎస్‌సీసీ కన్వీనర్‌ టి సాగర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పార్కులో వంటావార్పు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించడంతో పక్కనే ఉన్న మరో ప్రాంతంలో ధర్నాకు వచ్చిన ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలకు వంట చేసి భోజనం పెట్టారు. అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచే ధర్నాకు రైతులు, మహిళలు,యువత రావడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాదిగా తరలి వచ్చిన రైతులతో సుందరయ్యపార్కు ప్రాంగణంలో కిటకిటలా డింది. మోడీ డౌన్‌డౌన్‌, పోలీసు జులుం నశించాలని, మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం
బతుకు కష్టం...
రాజాసింగ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో
పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు గుర్తుచేయండి
శనగపంట కొనాలి
బీజేపీ దూకుడుకు కళ్లెం!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
వేధింపులు..నోటీసులు
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ
ప్రయివేటీకరణ విధానాల వెనుక రాజకీయాన్ని ఓడించాలి
మార్చి 18న మహిళా వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు
ప్రజా గొంతుకకు పట్టం కట్టండి
పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సీఎస్‌ సన్మానం
178 మందికి కరోనా
అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు చేయండి
హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
ఎడ్‌ సెట్‌ లో భారీ మార్పులు
న్యాయవాదుల భద్రతా చట్టం తేవాలి
6 ఏండ్లు..450 తీవ్ర కేసులు పెండింగ్‌
ప్రశ్నించేందుకు గెలిపించండి
తలసాని నోరు అదుపులో పెట్టుకో : దాసోజు
చిరంజీవి వైద్యానికయ్యే ఖర్చు భరిస్తాం
గెలవాల్సిందే..
బీజేపీ పాలనలో మహిళలపై పెరిగిన హింస
ఢిల్లీలో ధర లేదు.. పంట కొనం
పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించాలి..
రాష్ట్ర పరిస్థితులకనుగుణంగా ఉద్యానవన విధానం
పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ముఖ్యం : ఎండీ మేకా విజయ సాయి
న్యాయవాది దంపతుల హత్యపై సమగ్ర న్యాయ విచారణ జరిపించండి

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.