Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మాట నిలబెట్టుకుంటారా !? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2021

మాట నిలబెట్టుకుంటారా !?

- ప్రాజెక్టుపై సవతిప్రేమ
- బిల్లులందక పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు
- పరిహారం అందక పనులు అడ్డుకున్న నిర్వాసితులు
- కాళేశ్వరానికి యంత్రాల తరలింపు
- ప్రాజెక్టుపై సీఎం మరోసారి హామీ
నవతెలంగాణ - మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
నాలుగు జిల్లాల ప్రజలకు తలమానికంగా మారనున్న పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సవతిప్రేమ చూపిస్తున్నారంది. పలుమార్లు ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిస్తూ విస్మరిస్తూ వచ్చారు. అందులో భాగంగానే మరోమారు ప్రాజెక్టును ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేస్తామని శనివారం మాటిచ్చారు. రెండేండ్లలో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకోవడంతో మూడేండ్లైనా పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. మరి ఈ సారైనా సీఎం మాట నిలబెట్టుకుంటారా లేక విస్మరిస్తారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే బకాయిలు చెల్లించకపోవడం, నిర్వాసిత రైతులకు పరిహారమివ్వాలని పనులు అడ్డుకోవడంతో కాంట్రాక్టర్లు యంత్ర సామాగ్రిని కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు తరలించారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే గానీ పనులు ప్రారంభించే పరిస్థితి లేదు.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాలుగు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. రూ.50వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు అడుగడుగునా ఆటంకాలే ఎదురౌతున్నాయి. అందుకు పాలకుల వైఫల్యమే ప్రధాన కారణం. రెండేండ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు మూడేండ్ల కాలంలో రూ.15 వేల కోట్లకు మించి నిధులు విడుదల చేయలేదు. దాంతో 25శాతం పనులు కూడా పూర్తి కాలేదు. నిధులు ఇలాగే కేటాయిస్తే మరో ఐదేండ్లయినా ప్రాజెక్టు పూర్తి కాదు. ఏదుల, ఒట్టెం, కరివేన రిజర్వాయర్ల పరిధిలో సుమారు రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక ఒట్టెంలోనే రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని, ఇక పనులేలా చేయాలని కాంట్రాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చివరి భాగమైన ఉదండాపూర్‌ నుంచి ఎత్తు ప్రాంతాలకు నీరందించే మార్గానికి ఇప్పటికీ డిజైన్లు ఖరారు కాలేదు. ముందు ఈ పథకం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుని ఆ తర్వాత మిగతా ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశాలున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని పాలకులు చెబుతున్నా లక్షన్నర ఎకరాలకు మించి అందడం లేదు. జూరాల, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు కింద మరో రెండు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి రిజర్వాయరు నార్లాపూర్‌ దగ్గర నిర్మించారు. ఇక్కడ ఇంకా రివిట్‌మెంట్‌ పనులు చేయాల్సి ఉంది. అప్రోచ్‌ కెనాల్‌ టన్నెల్‌, కర్నూలు సొరంగం పనులు నామా మాత్రంగానే సాగుతున్నాయి. నాలుగు కిలోమీటర్ల టన్నెల్‌ నిర్మాణానికి ఇప్పటివరకు కిలోమీటరు మాత్రమే పనులు చేశారు. ఏదుల రిజర్వాయర్‌ పూర్తయినా కెనాల్‌ పనులు చేయాల్సి ఉంది.
ఒట్టెం పనులను కొంతకాలంగా రైతులు అడ్డుకుంటున్నారు. ఎకరాకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇచ్చే దాకా పనులు చేయవద్దంటూ రైతులు కోర్టుకెళ్లారు. రైతుల అంగీకారం మేరకు పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పించినా పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు అక్కడక్కడా పనులను అడ్డుకుంటున్నారు. కరివేన దగ్గర పనులు ఆగిపోయాయి. ఇటు నిధులు రాక, రైతులకు పరిహారం అందక అడ్డుకోవడంతో కాంట్రాక్టర్లు చేసేదిలేక ఇక్కడి నుంచి యంత్ర సామగ్రిని కాళేశ్వరానికి తరలించారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పూర్తి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
భూమి కోల్పోయి ఇబ్బందులు
ఏదుల రిజర్వాయర్‌లో నాకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి పోయింది. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పరిహారం అందక పోగా సాగునీరు లేక ఉపాధి కోల్పోయాం. ఇప్పటికైనా పరిహారం చెల్లించడంతో పాటు సాగు నీరు అందిస్తే వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తాం.
- రాములు, ఏదుల వనపర్తి జిల్లా

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పట్టభద్రుల చక్రబంధంలో 'పార్టీలు'
శనగ పంటను కొనండి
కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి
ప్రజలే బీజేపీకి మొలలు కొడ్తరు
కార్పొరేట్‌ విద్యాసంస్థలతో సీఎం లాలూచీ : బండి
రాష్ట్రంలో తగ్గుతున్న రికవరీలు
సత్యాన్వేషణే సైన్స్‌
నాగేశ్వర్‌ గెలుపు...సమాజ అవసరం
బతుకు కష్టం...
రాజాసింగ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకో
పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు గుర్తుచేయండి
శనగపంట కొనాలి
బీజేపీ దూకుడుకు కళ్లెం!
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
డివైడర్‌ను ఢీ కొట్టిన కారు
వేధింపులు..నోటీసులు
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీ
ప్రయివేటీకరణ విధానాల వెనుక రాజకీయాన్ని ఓడించాలి
మార్చి 18న మహిళా వికలాంగుల స్థితిగతులపై జాతీయ సదస్సు
ప్రజా గొంతుకకు పట్టం కట్టండి
పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు సీఎస్‌ సన్మానం
178 మందికి కరోనా
అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు చేయండి
హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
ఎడ్‌ సెట్‌ లో భారీ మార్పులు
న్యాయవాదుల భద్రతా చట్టం తేవాలి
6 ఏండ్లు..450 తీవ్ర కేసులు పెండింగ్‌
ప్రశ్నించేందుకు గెలిపించండి
తలసాని నోరు అదుపులో పెట్టుకో : దాసోజు
చిరంజీవి వైద్యానికయ్యే ఖర్చు భరిస్తాం

తాజా వార్తలు

09:55 PM

శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్

09:44 PM

ఎర్రగడ్డలో 125 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

09:39 PM

వాట్సాప్‌లో ఈపీఎఫ్‌వో సేవలు ప్రారంభం

09:27 PM

నాయ్యవాదుల హత్యకు వాడిన కొడవళ్ల కోసం గాలింపు

09:20 PM

నల్లగొండలో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

09:02 PM

తెలంగాణ జానపదానికి సాయి ప‌ల్ల‌వి అదిరిపోయే స్టెప్పులు

08:46 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం...

08:38 PM

చావు క‌బురు చ‌ల్ల‌గా..ప్రోమోలో అద‌ర‌గొట్టిన అన‌సూయ‌

08:30 PM

ఒకే వేదికపై 3,229 వివాహాలు

08:20 PM

నిరసనకారులపై కాల్పులు: ఏడుగురు మృతి

07:36 PM

నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి చితకబాదారు...

07:17 PM

పేపర్‌ లీక్‌..రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు

07:07 PM

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సంచలన వ్యాఖ్యలు

06:51 PM

సోలార్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం

06:38 PM

ఏపీలో కొత్తగా 117 కరోనా కేసులు

06:28 PM

వాలంటీర్ల సేవలపై సంచలన ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

06:15 PM

బస్సు డ్రైవర్లుగా మాజీ క్రికెటర్లు..!

05:56 PM

బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్

05:39 PM

హెల్మెట్ ఫైన్‌కు డబ్బుల్లేక మంగళసూత్రం తీసిచ్చి..!

05:24 PM

రేపటి నుంచి మేడారం గుడి మూసివేత

04:55 PM

బావను టెంపోకు కట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన భావమరిది

04:36 PM

ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌

04:15 PM

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

04:09 PM

ఇస్రోకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

03:45 PM

రోడ్డు ప్రమాదంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి

03:43 PM

మార్చి 14వ‌ర‌కు స్కూ‌ళ్లు‌, కాలేజీలు బంద్‌

03:37 PM

మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఇస్రో

03:12 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

02:49 PM

ఆ లింకులను వాట్సాప్ ద్వారా పంపొద్దు: సుప్రీంకోర్టు

02:23 PM

ఐపీఎల్‌ను హైద‌రాబాద్‌లో కూడా నిర్వ‌హించాలి: కేటీఆర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.