Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసే గడువును ఈనెల 15 వరకు పొడిగించామని టీజీయూజీసెట్-2021 కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకనటలో తెలిపారు. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అబ్బాయిలు, అమ్మాయిలు దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మాధ్యమంలో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సులను అందిస్తున్నామని వివరించారు. విద్యార్థులు ఈనెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. వారికి ఏప్రిల్ 25న రాతపరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు www.tswreis.in లేదా www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు.