Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికల ఎజెండాగా.. కోచ్‌ ఫ్యాక్టరీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 06,2021

ఎన్నికల ఎజెండాగా.. కోచ్‌ ఫ్యాక్టరీ

- అందరి నోట అదే మాట
- సమాధానం చెప్పలేని దుస్థితిలో బీజేపీ
- విశాల ఐక్యఉద్యమం దిశగా ప్రజాసంఘాలు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే యోచనే లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి తాజాగా కుండబద్దలు కొట్టడంతో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ అంశం ఎన్నికల ఎజెండాగా మారింది. ఇప్పటివరకు నోరుమెదపని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, మంత్రి కేటీఆర్‌ సైతం పార్లమెంట్‌లో నిలదీస్తామని ప్రకటించారు. కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ హక్కు అంటూ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ 'ఇంటెగ్రల్‌ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)'ని వరంగల్‌ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కమిటీ కూడా వేసింది.. కాని పురోగతి లేదు. అయితే, 2019లో అప్పటి టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కోచ్‌ ఫ్యాక్టరీపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి పీయూష్‌ గోయెల్‌ సమాధానమిస్తూ... కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశం లేదని స్పష్టతనిచ్చారు. అయినా... రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కొంతకాలంగా పోరాటం జరుగుతూనే ఉంది. ఫ్యాక్టరీ కోసం ఇప్పటికే రూ.380 కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని సైతం అయోధ్యపురంలో ఇటీవల సేకరించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేతుల మీదుగా రైల్వే అధికారులకు అప్పగించారు. అయితే కోచ్‌ ఫ్యాక్టరీకి బదులుగా 'పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపు'ను కేంద్రం మంజూరుచేసింది. గూడ్స్‌ వ్యాగన్ల మెయింటెనెన్స్‌కు సంబంధించిన ఈ వర్క్‌షాపు వల్ల పెద్దగా ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులు మాత్రం కోచ్‌ ఫ్యాక్టరీపై ఏమీ స్పందించడం లేదు. మంత్రి కేటీఆర్‌ నోట ఎన్నడూ వినపడని కోచ్‌ ఫ్యాక్టరీ మాట ఇప్పుడు ఉన్నట్టుండి మాట్లాడటంపై పలు విమర్శలు వస్తున్నాయి.
ఐటీఐఆర్‌ ప్రాజెక్టు మాదిరిగానే కోచ్‌ ఫ్యాక్టరీకి మంగళం పాడే ప్రయత్నం జరుగుతోందనీ, పార్లమెంట్‌లో నిలదీస్తామని కేటీఆర్‌ చెప్పడంతో ఎన్నికల్లో నిరుద్యోగుల ఆదరణ కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బీజేపీ ఉక్కిరిబిక్కిరి
రాజకీయ పార్టీలతోపాటు రైల్వే జేఏసీ, ప్రజాసంఘాలు కోచ్‌ ఫ్యాక్టరీ విషయాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీజేపీ ఎంపీలెవరూ ఏనాడూ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నించలేదు. ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. పైగా వరంగల్‌ వచ్చిన ప్రతి నాయకుడు కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని విమర్శలు చేశారు. భూమిని కేటాయిస్తూ మంత్రి పత్రాలు అందజేసిన తర్వాత మాట్లాడటం లేదు. వామపక్షాలు, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, స్వతంత్ర అభ్యర్థులు కోచ్‌ ఫ్యాక్టరీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా బీజేపీ పట్టించుకోవడం లేదు. కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే తమకే నష్టం జరుగుతుందన్న ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది.
విశాల ఉద్యమానికి ప్రజాసంఘాలు సన్నద్ధం
కోచ్‌ ఫ్యాక్టరీ కోసం అనేక పోరాటాలు జరిగాయి. ప్రధానంగా వామపక్షాలు బలమైన పోరాటాలు చేశాయి. రైల్వే జేఏసీ, డివిజన్‌ సాధన సమితి ఏర్పడ్డాయి. వారంతా మీడియా సమావేశం నిర్వహించి అధికార పార్టీలు మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని విశాల ఉద్యమం చేస్తామని ప్రకటించాయి. దాంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌లో గుబులు పుట్టింది. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న టీఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించేటట్టు లేదు. పట్టభద్రుల్లో అత్యధికులు కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. వారంతా అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశాలు లేకపోలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎడ్‌ సెట్‌ ఇక కామన్‌ పరీక్ష
కుంజా బొజ్జి ఇకలేరు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
ఆదర్శ కమ్యూనిస్టు కుంజా బొజ్జి
చిరకాల స్ఫూర్తి... మన బొజ్జి !!
మళ్లీ టెస్టులను తగ్గించారు
డీఏ, హెచ్‌ఆర్‌ఏ వర్తింపచేయండి
అంబేద్కర్‌ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని
అన్నదాత ఆగ్రహం
చెట్లు కొట్టినందుకు రూ.20 లక్షల ఫైన్‌
మోడల్‌ స్కూళ్లలో బోధనేతర సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తెండి
పోడు సాగుదారుల ఆగ్రహం
నేను రాను బిడ్డో...
గిరిజన సమస్యలపై పోరాడిన నేత
నేడు వెంకన్నగూడెంలో బొజ్జి అంత్యక్రియలు
వానొచ్చే...
మరొకరితో క్లోజ్‌గా ఉంటోందని మరదలి హత్య
రూ. 50లక్షలు చోరీ చేసిన డ్రైవర్‌
సంచారజాతుల ముస్లింలకు రుణాలివ్వాలి : ఆవాజ్‌ డిమాండ్‌
కార్మిక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
టీకా వేయించుకున్న జీపీ, మున్సిపల్‌ సిబ్బందికి 2 రోజులు సెలవివ్వాలి : సీఐటీయూ
కుంజాబొజ్జి మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి తీరని లోటు
ప్రయివేటు టీచర్ల కోసం రూ.32 కోట్లు విడుదల
మోడీ, అమిత్‌షాను వదలం
మూన్నాళ్ల ముచ్చటే..
కేటీఆర్‌ పర్యటనలో మానవ హక్కుల ఉల్లంఘన
కరోనా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వేగంగా ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్‌
సర్కారు బడులు, మోడల్‌ స్కూళ్లకు రూ.61 కోట్లు విడుదల

తాజా వార్తలు

09:41 PM

కోల్‌కతా లక్ష్యం 153

09:26 PM

పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత

09:23 PM

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!

09:06 PM

లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం

08:56 PM

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్

08:49 PM

రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు

08:34 PM

సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం

08:15 PM

నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం

08:09 PM

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

07:59 PM

కరోనా వాక్సిన్ తీసుకున్న‌వారికి బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.!

07:58 PM

నిజామాబాద్‌ జిల్లాలో దంపతుల క్షుద్ర పూజలు

07:13 PM

నల్గొండ ‌లో విద్యావాలంటీర్ శైల‌జ ఆత్మహత్య

07:07 PM

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

07:01 PM

కరోనా వైరస్ కంటే ఈ వైరస్ చాలా డేంజర్‌..!

06:35 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

05:56 PM

గజియాబాద్‌లో భారీ అగ్ని‌ప్ర‌మాదం

05:49 PM

ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

05:43 PM

రేపటి నుంచి 30 వరకు లాక్‌డౌన్‌.!

05:30 PM

రాళ్ల దాడి ఘటనపై సీఈసీకి ఫిర్యాదు చేసిన టీడీసీ ఎంపీలు

05:11 PM

ఐపీఎల్‌ చర్రితలో గేల్‌ అరుదైన రికార్డు

05:08 PM

'విరాటపర్వం' నుంచి సాయిపల్లవి ఫెస్టివల్ లుక్

05:02 PM

ఖైరతాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

04:53 PM

భర్త మెడపై కాళ్లతో తొక్కి దారుణంగా..!

04:32 PM

ఆర్‌బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌...బ్యాంకులకు వరుసగా 4రోజుల పాటు సెలవులు

04:19 PM

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

04:01 PM

యస్‌ బ్యాంక్‌కు మరో భారీ షాక్

03:48 PM

కేసీఆర్‌ సభపై ఈసీకి ఉత్తమ్ ఫిర్యాదు

03:43 PM

సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయండి: కేంద్రాన్ని కోరిన సీఎం

03:35 PM

కోల్‌కతాలో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ!

03:30 PM

కరోనాతో ఇద్దరు అటవీ అధికారులు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.