Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆయా ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వరంగ సంస్థలలో ఇస్తున్నట్టుగానే మున్సిపల్, గ్రామపంచాయతీ మహిళా కార్మికులు, ఉద్యోగులకు కూడా మార్చి 8న సెలవు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్ అలీ, పాలడుగు భాస్కర్, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.గణపతిరెడ్డి, చాగంటి వెంకటయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సీఎస్ సోమేశ్కుమార్కు వినతిపత్రాన్ని మెయిల్ ద్వారా శుక్రవారం పంపారు.