Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీఆర్‌ఎస్‌ లో సాగరం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 06,2021

టీఆర్‌ఎస్‌ లో సాగరం

- మొదలైన టికెట్‌ లొల్లి
- అరడజను మంది పోటీ
- కేసీఆర్‌ సర్వేలో బీసీలకే ఇవ్వాలని వచ్చిందని ప్రచారం ?
- స్థానికులకే ఇవ్వాలంటున్న క్యాడర్‌
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో టికెట్‌ కేటాయింపు విషయం టీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అరడజను మంది పోటీ పడుతున్నారు. ఎవరికి వారే తమ అనుయాయులతో అధిష్టానం దృష్టిలో పడేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత సామాజిక తరగతుల వారీగా నియోజకవర్గంలో సర్వే చేయించారని, బీసీ సామాజిక తరగతికి కేటాయిస్తేనే ఫలితం ఉంటుందని సర్వే తేల్చినట్టు ప్రచారంలో ఉంది. అయితే, బీసీల కంటే స్థానికులకే టికెట్‌ ఇవ్వాలని ఆ పార్టీ క్యాడర్‌ అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది.
ఆశావాహులు ఎక్కువే..
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం తరువాత ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఉప ఎన్నిక టికెట్‌ కోసం టీఆర్‌ఎస్‌లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇందులో ప్రధానంగా శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మెన్‌ ఇస్లావత్‌ రాంచందర్‌నాయక్‌, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కుమార్‌, గురువయ్య యాదవ్‌, దూదిమెట్ల బాలరాజ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్‌ఎస్‌.. ఇక్కడ టికెట్‌ కేటాయింపు విషయంలో సీఎం కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక కోసం ఈ మధ్యే నియోజకవర్గంలో సర్వే చేయించారు. అందులో బీసీ నేతను బరిలో దించితేనే విజయం సాధించడం సులభమని తేలిందని ఆ పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు.
తెరమీదికి స్థానికత అంశం
నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కుమార్‌ బీసీ సామాజిక తరగతే అయినప్పటికీ స్థానికుడు కాదనే వాదన పార్టీ నాయకత్వంలో ఉంది. దీంతో నిడమనూర్‌ మండలం వెనిగండ్లకు చెందిన గురువయ్య యాదవ్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆయన నేటి నాగార్జునసాగర్‌ నాటి చలకుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రాంమూర్తి యాదవ్‌కు అల్లుడు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌కు తోడల్లుడు. ఆ సామాజిక తరగతి ఓట్లతో పాటు ఆర్థికంగా పరిపుష్టి కలిగిన వ్యక్తి అనే పేరుంది. బీసీ వ్యక్తికే టికెట్‌ ఇవ్వాలనుకుంటే మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా గురువయ్యను సూచించినా ఆశ్చర్యపోవాల్సింది లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న క్యాడర్‌ కూడా స్థానికుడికే టికెట్‌ ఇవ్వాలని పట్టుపడుతున్నారని తెలుస్తోంది. దీంతో పార్టీ అధిష్టానం స్థానికుడు, యాదవ సామాజిక తరగతి, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
తనకంటే తనకేనంటూ ప్రచారం
హాలియాలో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు సీఎం హెలికాప్టర్‌లో వచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి కూడా వచ్చారు. ఆ సందర్భంలోనే తనకు టికెట్‌ వస్తుందని కేసీఆర్‌ పరోక్షంగా చెప్పినట్టుగా క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులకు నేరుగా ఎమ్మెల్సీ ఫోన్‌ ద్వారా చెప్పారని స్థానిక నేతలు అంటున్నారు. కలిసి పనిచేద్దామని, సహకరించాలని కోరుతూ వారి కుటుంబ యోగక్షేమాలు కూడా తేరా అడిగి తెలుసుకుంటూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది. ఇక మంత్రి జగదీశ్‌రెడ్డికి అనుచరుడిగా ఉన్న ఎంసీ కోటిరెడ్డి గతంలో కూడా టికెట్‌ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. ఈసారి వదులుకునే ప్రసక్తే లేదని పట్టుపడుతున్నట్టు సమాచారం. మంత్రి కూడా భరోసా ఇచ్చారని తెలుస్తుంది. ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోతే ఏదైనా జాతీయ పార్టీలోకి వెళ్లి పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో పోటీలో నిలిచేందుకు అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడం, స్థానికత, బీసీ సామాజిక తరగతికి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుండటంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది. ఇక మిగతా నేతలంతా ఎవరి ప్రయత్నాలూ వారు చేసుకుంటున్నారు. ఏదేమైనా టీఆర్‌ఎస్‌లో టికెట్‌ పంచాయితీ పెద్ద దుమారమే లేపుతుందన్న ప్రచారమూ సాగుతోంది. మరి టికెట్‌ ఎవరికి వస్తుంది..జంప్‌ జిలానీలు ఎవరు అవుతారు..అనేది వేచి చూడాల్సింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆలోచించి ఓటేయండి..
రాజ్యాంగంపై బీజేపీ దాడి
త్వరలోనే అంబేద్కర్‌ విగ్రహం
వర్షం.. ఆగం
రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు

తాజా వార్తలు

04:12 PM

కరోనా మృతులపై మంత్రి షాకింగ్ కామెంట్స్..!

04:04 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

03:49 PM

సీఎం కీలక నిర్ణయం..రేపు ఎల్లుండి అన్ని బంద్

03:18 PM

నిన్ను చేరి ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : డైరెక్టర్ సాయికృష్ణ

03:16 PM

దీక్ష విరమించిన కాంగ్రెస్ నేత హ‌నుమంత‌రావు

03:13 PM

కూన రవికుమార్‌కు బెయిల్ మంజూరు

03:11 PM

సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖారారు

03:02 PM

మే15 వ‌ర‌కు స్కూల్స్ బంద్

02:50 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

02:46 PM

ప్రత్యేక గదిలో బండ్ల గణేష్‌కు చికిత్స..

02:31 PM

తెలంగాణలో మినీ మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ విడుదల

02:22 PM

ఆస్పత్రిలో బెడ్‌ అయినా ఇవ్వండి లేదా ఇంజక్షన్‌ ఇచ్చి చంపేయండి‌

02:01 PM

కొవిడ్ టీకా తీసుకున్న సీఎం

01:52 PM

కొవిడ్ పేషెంట్ల కోసం బెడ్ల సంఖ్య పెంచండి

01:42 PM

కరోనా ఎఫెక్ట్.. వీకెండ్ కర్ఫ్యూ విధింపు

01:28 PM

రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీ ఎన్నిలకు నోటిఫికేషన్

01:11 PM

వ్యాక్సిన్ తీసుకున్న హోంమంత్రి

01:04 PM

ఆత్మహత్య చేసుకుందామని డ్రామా.. యువతి మృతి

12:52 PM

రూ.150కోట్ల డ్రగ్స్ పట్టివేత..

12:30 PM

ఉమ్మడి వరంగల్ లో కరోనా తీవ్రత..

12:20 PM

ఖమ్మం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

12:13 PM

సెల‌వుల కోసం..ఒకే మహిళను నాలుగు సార్లు

12:12 PM

కరోనాతో కాంగ్రెస్ అభ్యర్థి మృతి

11:59 AM

వరంగల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు..

11:55 AM

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. సొంత తమ్ముడినే..

11:40 AM

మొదటిసారి కొవాగ్జిన్ వేశారు.. రెండో సారి కొవీషీల్డ్.. మహా నిర్లక్ష్యం

11:27 AM

విశాఖ‌లో అసలేం జరుగుతోంది..? ఒకే రోజు 10 మంది

11:22 AM

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ పై నేడు సమీక్ష..

11:11 AM

యాపిల్ పండ్ల కోసం ఆర్డర్ ఇస్తే.. ఐ ఫోన్ డెలివరీ వచ్చింది

10:56 AM

దేశ వ్యాప్తంగా 11.43కోట్ల డోసుల వ్యాక్సినేషన్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.