Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఎయిర్‌సెల్‌ వినియోగదారులకు ట్రాయ్‌ ఊరట!
  • హువేయి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు
  • టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ నిరసన ర్యాలీ
  • ఈ రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • వివాహితపై అత్యాచారం..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
ఉపేక్షించొద్దు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
Sundarayya
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jul 17,2017

ఉపేక్షించొద్దు..

- విచారణ అధికారులకు పూర్తి స్వేచ్ఛ
- డ్రగ్స్‌ కేసులో మంత్రుల హస్తం
ఉన్నా అరెస్టు చేయండి
- మరింత దూకుడు పెంచండి
- జీవితకాలం శిక్ష పడేలా కొత్తచట్టాలు
- వ్యవస్థీకృత నేరాలకు ప్రత్యేక విభాగం
- హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలి
- డ్రగ్స్‌, కల్తీలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
డ్రగ్స్‌ కేసులో ఎంతటి వారైనా సరే పట్టుకోండి.. ప్రముఖు లైనా వదలొద్దు.. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి.. టీఆర్‌ఎస్‌ వారి పాత్ర, క్యాబినెట్‌ మంత్రులు ఉన్నా సరే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించాలని, ఈ విషయంలో ఎవరిని కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ కేసు విషయంలో మరింత దూకుడు పెంచాలన్నారు. అన్ని కోణాల నుంచి మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి ఎంతటి వారున్నా కేసులు నమోదు చేయాలని తెలిపారు.
డ్రగ్స్‌ కేసులో నిందు తులకు జీవితకాలం శిక్ష పడేందుకు కొత్త చట్టాలు తేవాలని సీఎం చెప్పారు. డ్రగ్స్‌ అరికట్టడంలో ఇప్పటికే చేపట్టిన చర్యలతో సంతృప్తి చెందకుండా మరింత దూకుడు పెంచాలన్నారు. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్నవారెందరో దొరుకుతున్నారు. ఎవరి పాత్ర ఎంతుందో వెలికి తీయాలని ఇందులో అధికారులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు తలొంచొద్దన్నారు. డ్రగ్స్‌, కల్తీలు, ఇతర సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, పద్మారావు, ప్రభుత్వ
ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, పోలీస్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా ఎప్పటి నుంచో ఉందన్నారు. ప్రారంభంలోనే దీనిపై దృష్టి సారించి ఉంటే రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా జరిగి ఉండేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. గత పాలకులు డ్రగ్స్‌ మాఫియాపై దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఈ దుర్మార్గం మనకు వారసత్వంగా వచ్చేది కాదన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడటం అత్యంత అవసరమని చెప్పారు. హైదరాబాదే తెలంగాణకు 'లైఫ్‌లైన్‌' కాబట్టి రాజధానిలో ఇలాంటి అరాచకాలు అంతం కావాలన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేయలేము.. వినియోగించలేమన్న భయ భ్రాంతులకు గురయ్యేలా చర్యలు ఉండాలని చెప్పారు. గుడుంబా నియంత్రణ విషయంలో విజయం సాధించినట్టే డ్రగ్స్‌, కల్తీల విషయంలో కూడా తుది వరకు విజయం సాధించే వరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆహార పదార్థాల కల్తీ, విత్తనాల కల్తీల విషయంలో అధికారులు బాగా పని చేస్తున్నారని సీఎం కితాబిచ్చారు. డ్రగ్స్‌ను అరికట్టడంలో కూడా అలాగే పని చేయాలన్నారు.
నా మనస్సు చలించింది.
కల్తీ రక్తం విషయంలో నా మనస్సు చలించిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బతికిస్తాడని నమ్మి వచ్చిన వారిని చంపుతారా? ఇది దుర్మార్గం, ఇలాంటి వారిని ఏం చేసిన చేసిన తప్పులేదన్నారు. వీరికి యావజ్జీవ శిక్షపడేందుకు కొత్త చట్టాలకు రూపకల్పన చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కల్తీ రక్తం విషయంలో అసలు సూత్రధారులు ఎవరో గుర్తించాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల విషయంలో పురోగతి
రాష్ట్రంలో శాంతిభద్రతలు, సామాజిక రుగ్మతలు, సంఘ వ్యతిరేక కార్యాకలాపాల నియంత్రణ విషయంలో పురోగతి సాధించామని సీఎం అన్నారు. ఈ మూడేండ్లలో ఉన్నంత ప్రశాంతత చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. అక్రమాల విషయంలో ఉక్కుపాదం మోపే విషయంలో ఎలాంటి రాజీపడొద్దని, ఈ వేడి, ఈ ఒత్తిడి కొనసాగించాలన్నారు. ఇందుకు సంబంధించి మీకు కావల్సిన బలం, బలగాలను ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ యాక్టు అమలులో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 95 శాతం గుడుంబాను అరికట్టామన్నారు.
అక్రమాలపై నిరంతరం నిఘా
ఆహార పదార్థాలు, కల్తీ పదార్థాలు, నకిలీ విత్తనాలు, డ్రగ్స్‌ సరఫరా తదితర వ్యవస్థీకృత నేరాలని, వాటిని అరికట్టడానికి నిరంతరం నిఘా పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిరంతర నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఒకసారి కేసు పెడితే పని అయిపోయిందని అనుకోవద్దని సూచించారు. కల్తీలు, డ్రగ్స్‌ విషయంలో బాగా పని చేసిన పోలీస్‌ అధికారులకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా కిందిస్థాయిలో పని చేసే పోలీస్‌ సిబ్బందికి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించి బాగా పని చేసేలా ప్రోత్సహించడంతో పాటు ఇంక్రిమెంట్లు అందజేయడంతో పాటు, ఆగస్టు 15న వారికి అవార్డులు అందజేస్తామన్నారు.

ఉపేక్షించొద్దు..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అడవిపుత్రులకు అన్యాయం ..?
కరిగిన కాసులు.. కట్టేదెట్లా...!
జన సమరం.. రణ నినాదం...
'టెలిగ్రామ్‌'కు గ్రహణం
ఇబ్బందుల్లేకుండా ప్లీనరీ
వికలాంగుల చట్టం కోసం దేశవ్యాప్త ఉద్యమం
పాతబస్తీకి ప్రణాళికలు సిద్ధంచేయండి
రేపటినుంచి కేరళలో సీపీఐ జాతీయ మహాసభలు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
గుడ్డు గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి
కోమటిరెడ్డి,సంపత్‌ల కేసు.. అప్పీల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఎంపీటీసీ భర్తపై కులదురహంకార దాడి
మరికొన్ని బెయిల్స్‌ మంజూరీలోనూ.. జడ్జీకి ముడుపులు
25 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె
వడదెబ్బతో నలుగురు మృతి
ఏఈవోకు 790 మంది ఎంపిక
55 కార్పొరేట్‌ కాలేజీలకు తాళాలు
ఆరోగ్యశ్రీ సీఈఓగా ఐఏఎస్‌ అధికారి
రైతుల పరిస్థితి దయనీయం : పొన్నాల
ఒక టీఎంసీ నీటితో 11,500 ఎకరాల సాగు
డెంగ్యూతో ఇంటర్‌ విద్యార్థిని మృతి
నాలుగేండ్లలో ఒక్క మతఘర్షణ జరగలేదు
అది ఆత్మస్తుతి : టీఆర్‌ఎస్‌
భారత్‌లో విద్యుత్‌ పరికరాల యూనిట్‌
ఆసిఫా దోషులను శిక్షించాలి
రూ. కోటి బంగారంతో పరార్‌
వైద్య రుసుముల్లో 'కార్పొరేట్‌' మోత
పంట నష్టపరిహారం ఇప్పించండి
కొన్ని కేజీబీవీల్లోనే ఇంటర్‌
మహాసభ స్ఫూర్తితో ముందుకు..

Top Stories Now

కారులో రేప్
ట్విట్టర్
సిద్దిపేట
కోర్టు
స్కర్ట్ ధరించిన మోడల్‌కు నడిరోడ్డుపై లైంగిక వేధింపులు
క‌థ అడ్డం తిరిగింది (వీడియో)
వావి వరుసలు మరిచి.. చిన్నమ్మపై..
జైల్లో నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి
రెండేళ్లుగా చాలా ఒత్తిడికి గురయ్యాను
సీపీఐ(ఎం) బహిరంగ సభ వీడియో
సీపీఐ(ఎం) బహిరంగ సభ లైవ్‌
స్టెడియం

_

తాజా వార్తలు

06:03 PM

ఎయిర్‌సెల్‌ వినియోగదారులకు ట్రాయ్‌ ఊరట!

05:52 PM

హువేయి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లు

05:49 PM

టీఎంసీకి వ్యతిరేకంగా బీజేపీ నిరసన ర్యాలీ

05:49 PM

ఈ రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

05:44 PM

వివాహితపై అత్యాచారం..

05:39 PM

హై లెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన కేటీఆర్, కవిత

05:34 PM

రామ్‌చరణ్‌ 'రంగస్థలం' రంగమ్మ మంగమ్మ మేకింగ్‌ వీడియో

05:28 PM

ప్రియదర్శి 'మిఠాయ్' మూవీలో కొత్త లుక్…

05:25 PM

విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురి మృతి

05:17 PM

రాజకీయాలకు ప్రముఖ నటుడు గుడ్‌బై

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.