Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మేం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు: ఈటల
  • మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం : టీడీపీ ఎంపీ కొనకళ్ల
  • కాంగ్రెస్ 'ప్రజాగ్రహా ర్యాలి' : రఘువీరా
  • బ్యాంకుల్లో నగదు కొరతకు ఇదే కారణం!!..
  • స్టాక్‌ మార్కెట్లకు కొనుగోళ్ల అండ!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
భారీ అగ్ని ప్రమాదం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
Sundarayya
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2018

భారీ అగ్ని ప్రమాదం

- ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి ఎగిసిపడ్డ మంటలు
- 15 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
- అక్రమ పెట్రోల్‌ దందానే కారణం ?
- మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలో
శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి పెద్దఎత్తున శబ్ధాలు వస్తూ ఒక్కసారిగా నాలుగంతస్తుల మేర మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ 100 మీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకుంది.
అగ్నికీలలు ఎగిరిపడి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై పడ్డాయి. దీంతో భయాందోళనకు గురై స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడు ద్విచక్ర వాహనాలు తగులబడిపోయాయి. ఏడుగంటలపాటు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఆయిల్‌ ట్యాంకర్‌ నుంచి అక్రమంగా పెట్రోలు తీస్తుండగా ఈ ఘటన జరిగిందా? ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
నవతెలంగాణ - బోడుప్పల్‌/చిలకలగూడ
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌ నగర శివారులోని మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో ఎస్వీ గార్డెన్‌ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మెకానిక్‌ షెడ్డు ఉంది. ఈ షెడ్డు నుంచి వచ్చిన నిప్పు రవ్వలు పక్కనే ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌కు తాకడం ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. నిప్పురవ్వలు ఇటు ఆయిల్‌ ట్యాంకర్‌కు, పక్కనే ఉన్న గ్యాస్‌ సిలిండర్లకూ మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆయిల్‌ ట్యాంకర్‌ సుమారు 30 అడుగుల ఎత్తుకు ఎగిరిపడింది. నిమిషాల్లోనే మంటలు నాలుగంతస్తుల మేర ఎగిసిపడ్డాయి. 100 మీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ద్విచక్రవాహనదారులకూ మంటలు అంటుకున్నాయి. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రజలు, వాహనదారులు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మూడుగంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ఏడు ద్విచక్ర వాహనాలు తగులబడిపోయాయి. ట్యాంకర్‌ పేలిన సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చెంగిచర్ల డిపో సూపర్‌వైజర్‌ వెంకట్‌ నాయక్‌పై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడ్డవారిలో ఆరుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందులో వెంకట్‌నాయక్‌, స్వామి, వాసు పరిస్థితి విషమంగా ఉంది. గోపాల్‌, ఇబ్రహీం, జలీల్‌, నాగరాజు, నిఖిల్‌రెడ్డికి పదిశాతం మేర కాలిన గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. సీఐ కె.జగన్నాథ్‌రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ గోనె సందీప్‌రావు ప్రమాదస్థలికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. ట్యాంకర్‌ నుంచి ఆయిల్‌ తీస్తుండగా ప్రమాదం జరిగిందా? వెల్డింగ్‌ చేస్తుండగా జరిగిందా? ఆయిల్‌ ట్యాంకర్‌ రోడ్డుపక్కనే ఉన్న ప్రహరీగోడను ఢకొీట్టడంవల్ల జరిగిందా? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు.
ప్రమాదంపై పలు అనుమానాలు...
భారీఎత్తున్న సంభవించిన ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్‌ ట్యాంకర్‌ రిపేర్‌ చేస్తున్న క్రమంలో లేదా, ట్యాంకర్‌ నుంచి పెట్రోల్‌ను అక్రమంగా తీస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఎస్వీ గార్డెన్‌ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఆయిల్‌ ట్యాంకర్ల నుంచి కొందరు బడా వ్యక్తులు పెట్రోల్‌, డీజిల్‌ తీసి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నట్టు స్థానికంగా వినబడుతోంది. అయితే కంపెనీ నుంచి వచ్చిన ట్యాంకర్‌ సీల్‌ తీసేందుకు ఇనుప రాడ్లను, కట్టర్లను వాడతారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఏర్పడతాయి. దీంతోనే ఈ భారీ ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం)
ఘటనపై పూర్తి విచారణ జరపాలని సీపీఐ(ఎం) మేడిపల్లి కార్యదర్శి ఎన్‌.సృజన డిమాండ్‌ చేశారు. జనావాసాల మధ్య ఇలాంటి ప్రమాదకరమైన ఆయిల్‌ ట్యాంకర్లు, పెట్రోలు ట్యాంకర్లు పార్కింగ్‌ చేస్తున్నా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోవటం లేదన్నారు. అధికారులు స్పందించి పూర్తి విచారణ చేసి, బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

భారీ అగ్ని ప్రమాదం
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టిడిపిలో చేరిన వైకాపా నేత చంద్రశేఖర్‌ రాజు
విశాఖలో 13 మందికి ఆంత్రాక్స్...
రైలు ప్రమాదంపై యూపీ సర్కార్ పరిహారం..
రేణుకా చౌదరికి కృతజ్ఞతలు చెప్పిన నటి శ్రీరెడ్డి.!
సుప్రీం న్యాయమూర్తిగా మహిళా న్యాయవాది
నేడు బిసి సంఘాల నేతల భేటీ
లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు
లారీ బీభత్సం.. నలుగురు మృతి
విద్యుదాఘాతంతో 11పాడి గేదెల మృతి
జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోదీ చేసేసిన గూగుల్
మంగళగిరి ఎయిమ్స్ పై ఆరా తీసిన ప్రధాని మోడీ
రైలు ఢీకొని 11 మంది విద్యా‌ర్థు‌లు మృతి
యూనియన్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఓటమి
గ్రామాలకు గండం పల్లె ప్రగతికి ఆటంక చర్యలు
దీర్ఘకాలిక సమస్యలపై మళ్లీ మున్సిపల్‌ సమ్మె
రేపే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ
మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం
ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఎన్నాళ్లీ కాలయాపన..?
కొత్త మున్సిపాల్టీల్లో ఉపాధి పనులు కొనసాగించాలి
ఓయూను వరల్డ్‌క్లాస్‌ వర్సిటీని చేయాలి
మోడీ హయాంలోనే సహకార సంఘాలు బలోపేతం
చదువు.. కొలువుకోసం న్యాయ పోరాటం
'భగీరథ' ట్రయల్‌రన్‌ ఫెయిల్‌
మంత్రి అందగాడే.. బుద్ధే వక్రం
గాడిదలు కాస్తున్నారా..!
హాకీ క్రీడాకారిణి సౌందర్య వివాహం
బీటీ 3 పత్తి విత్తనాలను నిషేధించాలి..
టీచర్‌ నియామకాల అధికారం పాత జిల్లాల డీఈఓలకే
'మహిళా సంఘం నేత సంధ్యపై విమర్శలు సరికాదు'

Top Stories Now

రంగమ్మ
ధోనీ
షమీ
హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964ను గుర్తు చేస్తుంది
లైంగిక బాబాకు యావజ్జీవం
ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో జబర్దస్త్‌ టీం హల్‌చల్‌
నవతెలంగాణ జర్నలిజం కళాశాల‌
మైనర్‌కు మద్యం తాగించి బోయ్‌ఫ్రెండ్‌తో అత్యాచారం చేయించింది!
సిఐ అమినీతిని బయటపెట్టిన కానిస్టే‌బుల్‌.. వీడియో
మంచు విష్ణు బైక్‌ యాక్సిడెంట్ వీడియో
కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు.
కోర్టు హాలులోనే భార్య‌ను పొడిచాడు.

_

తాజా వార్తలు

05:08 PM

మేం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు: ఈటల

05:04 PM

మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం : టీడీపీ ఎంపీ కొనకళ్ల

05:03 PM

కాంగ్రెస్ 'ప్రజాగ్రహా ర్యాలి' : రఘువీరా

05:02 PM

బ్యాంకుల్లో నగదు కొరతకు ఇదే కారణం!!..

05:01 PM

స్టాక్‌ మార్కెట్లకు కొనుగోళ్ల అండ!

04:50 PM

'అర్జున్‌`కు రోహన్‌ బొపన్న, యుకీ బాంబ్రీ

04:38 PM

వడ్డీ రేట్లను భారీగా పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

04:35 PM

క్యాస్టింగ్‌ కౌచ్‌పై శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు

04:31 PM

ఏ పార్టీలోను చేరే ఉద్ధేశ్యం లేదు : జేడీ లక్ష్మీనారాయణ

04:30 PM

శ్రీలంకలో మద్యం, మాంసం అమ్మకాలపై నిషేధం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.