Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల గడువు పెంపు
- అక్టోబర్ 4న నియామక పరీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది. మంగళవారంతో ఫీజు చెల్లింపు గడువు ముగుస్తుండగా, ఈ గడువు తేదీని ఈ నెల 14 వరకు పొడిగించారు. అలాగే దరఖాస్తును అప్లోడ్ చేయాల్సిన గడువు 12వ తేదీతో ముగియనుండగా, దీనిరి ఈ నెల 15 వరకు పొడిగిస్తూ నియామక కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు చేయడంలో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని గడువును పొడిగించాలని ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. దీంతో తక్షణమే అధికారులు స్పందించి దరఖాస్తు గడువును పొడిగించారు. అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష తేదీని కూడా అక్టోబర్ 4కు వాయిదా వేశారు.