Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
19న బంద్‌కు మద్దతిస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

19న బంద్‌కు మద్దతిస్తాం

- సమ్మె న్యాయబద్ధం..
- ఆర్టీసీ కార్మికుల పోరాటం ప్రజారవాణా మెరుగు కోసమే
- 50 ప్రయివేటీకరిస్తే..నియంత్రణ కష్టమే..
- బంద్‌లో ప్రజలందరూ పాలుపంచుకోవాలి
- సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి
- లేకుంటే పోరాటం ఉధృతం చేస్తాం
- రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'సమ్మె న్యాయబద్ధం. ప్రజాస్వామ్యయుతం. సీఎం చేసిన సెల్ఫ్‌డిస్మిస్‌ వ్యాఖ్యలు చట్టవిరుద్ధం. నోటీసు ఇచ్చి కండ్లల్లో కాయలు కాసేలా ఎదురుచూసినా...సర్కారు నుంచి పిలుపు రాక విధిలేని పరిస్థితుల్లోనే కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రయివేటు ట్రావెల్స్‌పై నియంత్రణ లేకపోతే అడ్డూఅదుపూ ఉండదు. 50 శాతం ప్రయివేటీకరణ అంటే...ప్రజారవాణాపై ఆధిపత్యాన్ని కార్పొరేట్‌, ప్రయివేటు శక్తులకు కట్టబెట్టడమే. అదే జరిగితే సామాన్యుడు ప్రయాణం చేయాలంటే చార్జీలకు జంకాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయివేటు బస్సు ఎక్కాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీని బతికిచ్చుకునేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి ముక్తకంఠంగా మద్దతు తెలపాలి. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజానీకానికి ప్రజారవాణాను దూరం చేసే కుట్రను తిప్పికొట్టాలంటే 19న జరిగే సమ్మెలో, బంద్‌లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలి. ఆర్టీసీ కార్మికులసమస్యల పరిష్కారం కోసం సర్కారు దిగిరాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం' అంటూ కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాల అభిప్రాయాలు నేతల మాటల్లోనే..
సమ్మె ప్రజాస్వామ్యబద్ధమైనది:ఎం.శ్రీనివాస్‌, ఐఎఫ్‌టీయూ, ప్రధాన కార్యదర్శి
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయ, ప్రజాస్వామ్యబద్ధమైనది. ఆర్టీసీ నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే కారణం. కార్మికులది ఎట్టిపరిస్థితుల్లోనూ కాదు. ఇది జీతాల కోసం చేస్తున్న సమ్మె కాదిది. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ప్రయోజనాల కోసం జరుగుతున్నది. 2014, 2019 ఎన్నికల సమయంలోనూ ఆర్టీసీ కార్మికులకు అనేక హామీలనిచ్చి సీఎం కేసీఆర్‌ మాటతప్పారు. ఇప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఎత్తుగడల్ని తిప్పికొడతాం.
సీఎం భేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించాలి:బీ.వెంకటేశం, ఏఐటీయూసీ కార్యదర్శి
ఆర్టీసీ కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే తన పండ్లతోని పీకుతానని చెప్పిన సీఎం కేసీఆర్‌...ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలనే పీకేసే కుట్రకు తెరలేపారు. ఆర్టీసీని బతికిచ్చుకునేందుకే కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారు. కోర్టు కూడా కార్మికుల పక్షానే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. సీఎం కేసీఆర్‌ భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వెంటనే సమ్మెను విరమించేలా చూడాలి. 19న జరిగే సమ్మెలో, బంద్‌లో పాల్గొంటాం.
చట్టపరిజ్ఞానం లేనోడు కేసీఆర్‌..సమ్మెకు మద్దతు:కె.సూర్యం, ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి
చట్టపరిజ్ఞానం బొత్తిగా లేనోడు సీఎం కేసీఆర్‌. సెల్ఫ్‌ డిస్మిస్‌ అంట చట్టంలో ఎక్కడుంది? ప్రభుత్వమే మళ్లీ కార్మికులను డిస్మిస్‌ చేయలేదని హైకోర్టులో చెప్పింది. అంటే కేసీఆర్‌ బెదిరింపులకు దిగుతున్నడు. ఇక్కడ వాటికి భయపడే కార్మికులెవ్వరూ లేరు. 48 వేల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారంటేనే ఐక్యత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. చేసిన పనికి వేతనమివ్వకుంటే పదిరెట్లు ఎక్కువ పరిహారం ఇవ్వాలనే విషయం కేసీఆర్‌కు తెల్వనట్టున్నది? కార్మిక చట్టాల గురించి ఆయన తెలుసుకుంటే మంచిగుంటది. 19న జరిగే బంద్‌కు, సమ్మెకు కార్మిక లోకమంతా మద్దతు తెలపాలని కోరుతున్నాం.
హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం... 19న బంద్‌కు మద్దతిస్తాం..
:ఆర్‌డీ చంద్రశేఖర్‌, ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి
కార్మిక యూనియన్లతోని సమస్యల పరిష్కారం జరపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించడాన్ని స్వాగతిస్తున్నాం. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ విధానాలతో ఆర్టీసీ కార్మికులే కాదు...మున్సిపల్‌, విద్యుత్‌, గ్రామపంచాయతీ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డిఫెన్స్‌...ఇలా అన్ని రంగాల కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రానున్నదంతా పోరాటాల కాలమే. కార్మిక లోకం ఐక్యంగా ముందుకు సాగాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుంది. 19న ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌లో పాల్గొంటాం. ప్రజలంతా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
సమ్మెకు సర్కారు తీరే కారణం :ఎమ్‌కే బోస్‌, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి
సమ్మెకు సర్కారు నాన్చుడు ధోరణినే కారణం. సమ్మె నోటీసు ఇచ్చి 34 రోజుల పాటు పట్టిం చుకోకపోవడమంటేనే ఆర్టీసీ పట్ల సర్కారుకు ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతుంది. వేతన ఒప్పందంపైనా దాటివేత ధోరణిని అనుసరించింది. సమ్మె నోటీసు ఇస్తే...ఆర్టీసీ ఎండీగానీ, ఈడీగానీ, చైర్మెన్‌గానీ, రవాణాశాఖ మంత్రిగానీ చర్చలకు పిలువకపోవడం, త్రిసభ్య కమిటీ చర్చల్లో పాల్గొనకపోవడం దారుణం. ఆర్టీసీ కార్మికుల 26 డిమాండ్లు న్యాయ సమ్మతమైనవే. వాటిని పరిష్కరించాల్సిందే. 19న జరిగే ధర్నాలో టీఎన్‌టీయూసీ అనుబంధ సంఘాలన్నీ పాల్గొంటాయి. సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నాం.
ప్రజారవాణా బతికించే పోరులో కార్మికుల వెన్నంటే
ప్రజారవాణాను బతికించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి వెన్నంటే ఉంటాం. ప్రతిపిలుపులోనూ భాగస్వామ్యమవుతాం. కార్మికులు పెట్టిన డిమాండ్లలో నూటికి 90 శాతం ప్రజారవాణా మెరుగుదల కోసమే. పెద్దపెద్ద యుద్ధాలే చర్చల ద్వారా పరిష్కారం అవుతున్నాయి...ఆర్టీసీ కార్మికులతో సమస్యలపై ఎందుకు చర్చించరు? అని హైకోర్టు మెట్టికాయలు వేసినా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేకపోవడం దారుణం. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలవి ఒకేదారి. కేంద్ర ప్రభుత్వం రైల్వేలను ప్రయివేటీకరిస్తుంటే...రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని 50 శాతం ప్రయివేటీకరించే కుట్రకు తెరలేపింది. అలాగైతే రూట్లపై నియంత్రణ ఉండదు. ప్రయివేటు బస్సులు ఇష్టమొచ్చినట్టు చార్జీలు వసూలు చేస్తాయి. ప్రయాణికుల ప్రాణాలకూ భద్రత ఉండదు. ఇటీవల మోడీ సర్కారు తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం సవరణల్లో అన్ని రాష్ట్రాల్లో 20 శాతం ప్రయివేటు బస్సులను నడపాలని పొందుపరిచిన విధంగానే రాష్ట్రంలో 20 శాతం ప్రయివేటు బస్సులను నడుపుతామని కేసీఆర్‌ ప్రకటించడం అంటే..పైకి విమర్శలు చేసుకుంటున్నప్పటికీ వారిద్దరూ కలిసేపోతున్నారని ఇట్టే అర్థమవుతుంది. సర్కారు ఎంతకూ స్పందించకపోవడంతోనే దిక్కులేని పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ప్రజలు దీన్ని గమనించాలి. ప్రజారవాణా బలోపేతం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. 19న జరిగే సమ్మెలో, బంద్‌లో ప్రజలు పూర్తిగా పాల్గొనాలని సీఐటీయూగా పిలుపునిస్తున్నాం.
- ఎం.సాయిబాబు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హామీల ముచ్చటేది?
ఎనుమాముల మార్కెట్‌లో.. మద్దతు ధర బోర్డు ఏర్పాటు
ప్రభుత్వాల వల్లే వ్యవసాయ సంక్షోభం
22 ఏండ్లకు కోర్టుతీర్పు!
ఘర్షణకు దిగిన వారిపై చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
అంగన్‌వాడీల కుదింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
అంతర్రాష్ట్ర దొంగల ముఠాల అరెస్ట్‌
రోగులు పెరిగినా ఎంఎన్‌జే ఒక్కటే దిక్కు
టీఆర్టీ వికలాంగుల ఫలితాలు ప్రకటించాలి
ఆర్టీసీ కార్మికులతో బలవంతపు సంతకాలొద్దు
నేడు గజ్వేల్‌కు సీఎం కేసీఆర్‌
రైౖతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోండి
ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి
ముచ్చర్ల ఫార్మాతో కాలుష్య ముప్పు
సీజీజీకి పరీక్షల నిర్వహణ బాధ్యత
ఆ వైఫల్యాల వల్లే అఘాయిత్యాలు
ఇద్దరు విద్యార్థినులపై లైంగికదాడికి యత్నం
యూనియన్లతోనే కార్మికులకు రక్షణ : ఆర్‌.సుధాభాస్కర్‌
ఆర్టీసీ చార్జీలను తగ్గించండి: ఎల్‌రమణ
ఇంటర్‌ పరీక్షలపై విశ్వాసంతో ఉండాలి
పోలీసులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
మహిళా సమస్యలు పరిష్కరించాలి...
శరవేగంగా సీఎం కొత్త ఇంటి పనులు
ఏసీబీకి చిక్కిన కోర్టు క్లర్కు
ఉపాధిలేక.. వలస బాట
గురుకులంలో ర్యాగింగ్‌
పత్తి మార్కెట్‌లో దళారుల దోపిడీ
ఆ భౌతికకాయాలను 13 వరకూ భద్రపరచండి..
బాలాలయం మెట్లపై పాదరక్షలు

తాజా వార్తలు

07:32 PM

మహేశ్ రికార్డును బీట్ చేసిన బన్నీ

07:27 PM

దూకూడుగా ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్లకు భారత్‌ 58/0

07:22 PM

రూ 93,900 విలువైన ఐఫోన్‌ను ఆర్డర్‌ చేస్తే.. నకిలీ ఐఫోన్‌

07:19 PM

దిశ ఘటనలు ఏపీలో జరగకూడదనే ఈ యాక్టు : ఏపీ హోం మంత్రి

07:15 PM

మగాళ్లు, జోకర్లు ఇప్పుడు రండి..సవాల్ విసిరిన వర్మ

07:08 PM

వాహనాల రేట్లను పెంచిన నిస్సాన్

07:01 PM

కాళేశ్వరం అద్భుత నిర్మాణం : గవర్నర్‌

06:41 PM

సమత భర్తకు ప్రభుత్వ ఉద్యోగం

06:39 PM

ఎన్‌కౌంటర్ కేసు.. ముగిసిన కమిషన్ పర్యటన

06:37 PM

టాస్‌ గెలిచిన విండీస్‌.. భారత్‌ బ్యాటింగ్‌

06:27 PM

వాచ్ మెన్ పై దాడి ఘటనలో నాకు సంబంధం లేదు : మంత్రి మల్లారెడ్డి

06:20 PM

విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్

06:16 PM

అస్సాంలో బ‌స్సుకు నిప్పు.. ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌

06:08 PM

31 లోగా తప్పనిసరిగా 'పాన్-ఆధార్' లింక్ చేయాల్సిందే

06:05 PM

న్యూయార్క్ తో పోల్చుకుంటే మన హైదరాబాద్ బెటర్: సీపీ

06:03 PM

బ్యాగులో రష్యన్ కుక్కపిల్లల రవాణా..

06:01 PM

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ విడుదలకు హైకోర్టు మళ్లీ బ్రేక్

05:59 PM

టెర్ర‌ర్ ఫండింగ్ కేసు.. దోషిగా హ‌ఫీజ్ స‌యీద్

05:32 PM

బాలయ్య సినిమా కోసం బోయపాటి పారితోషికం 15 కోట్లు..!

05:26 PM

కమల్ హాసన్‌కు టీషర్ట్ బహుకరించిన డ్వేన్ బ్రావో

05:23 PM

సంజు శాంసన్‌కు మరోసారి మొండిచేయి..!

05:22 PM

శంషాబాద్‌లో దారుణం.. కర్రతో కొట్టి భార్యను చంపేశాడు

05:20 PM

కేటీఆర్ పీఏ నంటూ మోసం.. ఇద్దరు అరెస్ట్

05:16 PM

ప్రగతి భవన్‌లో మంత్రివర్గ భేటీ ప్రారంభం

05:16 PM

కోహ్లీ మరో కొత్త రికార్డు ఆరు పరుగులు చేస్తే..

05:12 PM

మహిళా భద్రత బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం

04:38 PM

లంచం కేసులో బీజేపీ కార్పొరేటర్‌కు జైలుశిక్ష

04:36 PM

ఇండియా - వెస్టిండీస్‌‌ అమీతుమీ.. ట్రోఫీ ఎవరిది?

04:31 PM

సెన్సార్ బోర్డు వద్ద 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' యూనిట్ ఆందోళన

04:26 PM

స‌మ‌త‌ కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.