Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జంపన్న వాగును దోచేస్తుండ్రు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 18,2019

జంపన్న వాగును దోచేస్తుండ్రు

- మేడారం కేంద్రంగా ఇసుక మాఫియా
- అనుమతులు పదింటికి.. తరలించేది వందల లారీలు
- ఓ మాజీ మంత్రి అండదండలు
మేడారం నుంచి పార్నంది వెంకటస్వామి
మేడారం కేంద్రంగా ఇసుక మాఫియా కోరలు చాస్తున్నది. రోజూ గోదావరి నుంచి ఏటూరునాగారం కేంద్రంగా వందలాది లారీల్లో ఇసుక తరలిస్తోంది. సాక్షాత్తూ మేడారంలోని జంపన్నవాగుపై ఇసుక మాఫియా కన్నేసింది. పదింటికి అనుమతి తీసుకొని వందల లారీల్లో ఇసుక తరలిస్తూ కోట్ల రూపాయలు పోగేస్తోంది. ఇసుక మాఫియాకు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల అండదండలు ఉండగా, ఈ దందా వెనుక ఓ మాజీ మంత్రి హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అధికారుల అండదండలూ పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.
ఉమ్మడి వరంగల్‌ జిల్లా (ప్రస్తుత ములుగు)లో రెండేం డ్లకు ఒకసారి సమ్మక్క-సారలమ్మల జాతర జరుగుతుంది. గద్దెలకు కూతవేటు దూరంలోనే జంపన్న వాగు ఉంది. జాతరకు వచ్చిన వారు జంపన్న వాగులో స్నానం చేయడం ఆనవాయితీ. అందువల్ల వాగులోని కట్టె పుల్లను సైతం ఎవరూ ముట్టరు. స్థానికులు తమ ఇండ్ల నిర్మాణాలకూ ఈ ఇసుకను వాడటానికి భయపడతారు. కానీ ఇసుక మాఫియా మాత్రం వాగునే మాయం చేసే పనిలో ఉంది. జంపన్నవాగులోని ఇసుకను అడ్డగోలుగా తోడేస్తున్నారు. రోజుకు 50 నుంచి 100 లారీల ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొన్నింటికే అనుమతి..
ములుగు జిల్లా కేంద్రంలో ఇండ్లు, మరుగుదొడ్లతో పాటు ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం జంపన్నవాగు నుంచి ఇసుక తోడేందుకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. దాంతో ఊరట్టం సమీపంలో ఇసుక తీసేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు రోజుకు 10 నుంచి 20 లారీలకు అనుమతి ఇస్తున్నారు. ఒక్కొక్క లారీ ఇసుకకు 2,400 రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. లారీలో 12 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలిస్తున్నారు. అయితే, అనుమతి కొన్నింటికే ఉంటే వందల లారీల్లో ఇసుక తరలిస్తున్న పరిస్థితి. వారం రోజుల కింద తహసీల్దార్‌ పాలకుర్తి భిక్షం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతి లేకుండా ఇసుక నింపిన 27 లారీలను సీజ్‌ చేశారు. ఒక్కొక్క లారీకి రూ.50వేల చొప్పున జరిమానా విధించినా.. పై నుంచి ఒత్తిడి రావడంతో కొన్నింటిని వదిలేసినట్టు తెలుస్తోంది. జంపన్నవాగు కేంద్రంగా ఊరట్ట గ్రామాన్ని ఆనుకొని అధికారుల కండ్లు కప్పి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు స్థానికులు వాపోతున్నారు.
టీఆర్‌ఎస్‌ నాయకుల అండదండలు !
మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెం, నార్లాపూర్‌ గ్రామాలకు చెందిన కొందరు టీఆర్‌ఎస్‌ నాయకుల అండదండలతో ఇసుక మాఫియా జంపన్న వాగును తోడేస్తున్నట్టు తెలుస్తోంది. వారికి ఓ మాజీ మంత్రి సహాయం అందిస్తున్నట్టు సమాచారం. జంపన్నవాగు నుంచి లారీల్లో ఇసుకను ములుగుకు తరలించి అక్కడ డంపింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రికి రాత్రి హన్మకొండ, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. లారీ ఇసుకను 40వేల నుంచి 60వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. వీరికి స్థానిక పోలీస్‌, రెవెన్యూ అధికారుల అండదండలు కూడా పూర్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
జంపన్న వాగునే మాయం చేస్తుండ్రు:రైతు జంగా వెంకట్రాంరెడ్డి
జంపన్న వాగు నుంచి ఇసుకను తాసుకెళ్లడానికి మేము భయపడతాం. ఇసుక మాఫియా మాత్రం అడ్డూ అదుపు లేకుండా వాగును తోడేస్తోంది. భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంది. రాత్రి వేల లారీలు వస్తుండటంతో జనం భయపడుతున్నారు. అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతోంది. జాతర సందర్భంగా పంట నష్టపోయినా రైతులకు ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వడం లేదు.
అనుమతి లేకుంటే సీజ్‌ చేస్తున్నాం:పాలకుర్తి భిక్షం- తాడ్వాయి తహసీల్దార్‌
స్థానిక అవసరాల కోసం మాత్రమే అనుమతి ఇచ్చాం. అనుమతి లేకుండా లారీల్లో ఇసుక నింపితే సీజ్‌ చేస్తున్నాం. తాను ఆకస్మికంగా తనిఖీ చేసి 27 లారీలు సీజ్‌ చేశాం. పర్మిట్‌ లేకుండా తరలిస్తున్న విషయం వాస్తమే. ఇక నుంచి రోజూ తనిఖీలు చేస్తాం. స్థానికంగా వీఆర్‌ఓను ఏర్పాటు చేస్తాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రెండేండ్ల వరకు..గుర్తింపు ఎన్నికలొద్దు
దిశ కేసుపై సిట్‌
అడుగుపెట్టాలంటే ఆధార్‌ కావాల్సిందే..
ధాన్యం కొనుగోళ్లలో కోత
ఉద్యోగుల సమస్యలపై సర్కారు తీరు ఆందోళనకరం
దుమ్ముగూడెం వద్ద మరో బ్యారేజీ
దిశకు న్యాయం జరగాలంటే ఉరేసరి
వీఎన్‌ జీవితం నేటితరానికి ఆదర్శం
కాళేశ్వరం ప్రాజెక్టుపై పుస్తకం
ఐఎంఎస్‌ స్కాంలో దేవికారాణి భర్త డాక్టర్‌ గురుమూర్తి అరెస్ట్‌
ఏకగ్రీవ సర్పంచ్‌ కులబహిష్కరణ
ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలి
ఎకరాకు రూ.6లక్షలు పరిహారమివ్వాలి
వెల్ఫేర్‌ కౌన్సిల్‌కు.. ఎన్నికలకు లింకేంటి
పేరుకే వీఐపీలు...
కేటాయింపులకనుగుణంగానే ఖర్చు చేయాలి
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
మద్యపానంపై నిషేధం విధించాలి
భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌కు భారీ బందోబస్తు
వారికి సీఎం హామీలిచ్చినప్పుడు...
దళితులకు మొబైల్‌ టిఫిన్‌ సెంటర్లు
నేటి రాజకీయాల్లో బానిసత్వం, దొరతనం
మద్యంపై యుద్ధం
అన్ని వసతులున్న పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు
'చేనేత'కు చేయూతనివ్వాలి..
గణాంకాల సేకరణ పక్కాగా ఉండాలి..
బీజేపీది.. కుల మతాల రాజకీయం
'దిశ'కు ఆటా నివాళి
టీఆర్టీ పీఈటీ ఫలితాలు విడుదల
ఇంటర్‌ ఫలితాల నిర్వహణ సీజీజీకి!

తాజా వార్తలు

08:48 AM

ఎన్‌కౌంట‌ర్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న దిశ త‌ల్లిదండ్రులు

08:19 AM

ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపాం: పోలీసులు

08:15 AM

ఇండియ‌న్ 2 పోస్ట‌ర్ ఫేక్: లైకా

08:10 AM

ఎన్‌కౌంటర్‌ ఘ‌టనా స్థ‌లానికి చేరుకున్న సీపీ స‌జ్జ‌నార్

07:46 AM

దిశ నిందితుల ఎన్‌కౌంటర్

07:32 AM

మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

07:16 AM

శబరిమలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

07:05 AM

నేడు టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయం ప్రారంభం

06:49 AM

రాష్ట్రంలో మళ్లీ స్వన్‌ప్లూ విజృంభణ: గాంధీలో ఇద్దరికి చికిత్స

06:39 AM

కడప రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

06:27 AM

నేటి నుంచి జేఈఈ మెయిన్‌ హాల్‌టికెట్లు

06:25 AM

ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

06:19 AM

9న హస్టళ్లలో వసతులపై హైకోర్టులో విచారణ

11:51 PM

అట్లాంటాలో ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

11:48 PM

టీ-20 నేపథ్యంలో అర్థరాత్రి వరకూ మెట్రో సేవలు

11:38 PM

14న ప్రేక్షకుల ముందుకు 'క్వీన్' గా రమ్యకృష్ణ

11:33 PM

సమాజంలో ఇలాంటి అకృత్యాలు జరగకూడదు: విక్టరీ వెంకటేష్

11:27 PM

స్మార్ట్ టీవీ రంగంలో అడుగుపెట్టిన నోకియా

09:59 PM

దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

09:49 PM

అఖిలపక్ష కార్మిక సంఘాలతో మంత్రి అవంతి సమావేశం

09:34 PM

రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు : కేసీఆర్‌

09:30 PM

కిడ్నాప్ కేసులో మాజీ క్రికెటర్‌ అరెస్ట్

08:38 PM

ఉద్యోగాల పేరుతో మోసం వ్యక్తి అరెస్ట్

08:23 PM

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

07:52 PM

ఢిల్లీలో ఎంపీలతో జగన్ భేటీ

07:27 PM

వచ్చే ఏడాదిలో టీఎన్జీఓఏ జిల్లాల వారీ సమావేశాలు

07:23 PM

కారులో మంటలు చెలరేగి మహిళ సజీవ దహనం

07:09 PM

తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవి నాకే ఇవ్వాలి: వీహెచ్‌

07:06 PM

అలా అయితే, జగన్ పైనా కేసులు పెట్టాలా?: పవన్ కల్యాణ్

07:03 PM

ఎస్సెస్సీ అడ్మిట్ కార్డులు జారీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.