Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రెండేండ్ల వరకు..గుర్తింపు ఎన్నికలొద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2019

రెండేండ్ల వరకు..గుర్తింపు ఎన్నికలొద్దు

- ఆర్టీసీ కార్మికుల నుంచి లేఖలు తీసుకుంటున్న ప్రభుత్వం
- సంతకం పెట్టని వారి జాబితా విడిగా ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు..
- ప్రగతిభవన్‌ నుంచే లేఖల డ్రాఫ్టింగ్‌!
- చట్టాలను కాలరాయడమే : కార్మికసంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వెల్ఫేర్‌ కౌన్సిళ్ల పేరుతో కార్మిక చట్టాలను కాలరాచే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. రెండేండ్ల పాటు ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేది లేదని తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌ దానికి అనుగుణంగా ఆర్టీసీ కార్మికులనే పావులుగా ఉపయోగించి, వారి వేలితో వారి కండ్లను పొడిచే చర్యకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచీ రెండేండ్లపాటు కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని లేబర్‌ కమిషనర్‌ను కోరుతూ కార్మికులతోనే లేఖలు ఇప్పిస్తున్నారు. ఆర్టీసీలోని 49వేల మంది కార్మికులు తప్పనిసరిగా ఈ లేఖలు ఇవ్వాల్సిం దేనంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈమేరకు డిపో మేనేజర్లు విధులకు హాజరయ్యే కార్మికులతో అప్పటికే ప్రిపేర్‌ చేసిన లేఖలపై సంతకాలు పెట్టించుకుంటున్నారని కార్మికులు చెప్తున్నారు. ప్రగతిభవన్‌లో డ్రాఫ్టింగ్‌ చేసిన లేఖనే అన్ని డిపోలకూ ఫార్మాట్‌ రూపంలో పంపినట్టు సమాచారం.
పోరాటం చేస్తాం : వీఎస్‌రావు, ప్రధాన కార్యదర్శి టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌
రెండేండ్లు ఆర్టీసీలో ఎన్నికలు జరపొద్దంటూ ప్రభుత్వం డ్రాఫ్ట్‌ చేసిన లేఖల్ని డిపోలకు పంపడం దారుణం. వాటిపై కార్మికులతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నారు. కాదన్న వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఈ చర్యల్ని ఎస్‌డబ్ల్యుఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రభుత్వం కార్మిక చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నది. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించం. తప్పకుండా ఈ చర్యల్ని నిరసిస్తూ పోరాటం చేస్తాం.
రాజకీయాల కోసమే..: కె రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి,టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌
అన్నదమ్ములుగా ఐక్యంగా ఉన్న ఆర్టీసీ కార్మికులను కౌన్సిళ్ల పేరుతో విడ గొట్టి, ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదే సందర్భంలో కౌన్సిళ్లు వద్దని కోరుతూ మేం కూడా కార్మికుల నుంచి సంతకాలు సేకరించి, లేబర్‌ కమిషనర్‌కు పంపుతాం.
ఐక్యత విచ్ఛిన్నం కోసమే: థామస్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, టీఎమ్‌యూ
ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఇతర శాఖలు, విభాగాలకు ఆదర్శంగా నిలుస్తుందనే భయంతో ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నది. ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కోసమే ఎన్నికల వాయిదా లేఖల డ్రామా ఆడుతున్నది. సమ్మెవల్లే ఆర్టీసీ కార్మికులకు ప్రగతిభవన్‌ ద్వారాలు తెరుచుకున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.
ఎన్నికలు నిర్వహించాలి: కె హన్మంతు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌
ఆర్టీసీలో తక్షణం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు వద్దు అనే హక్కు ప్రభుత్వానికి లేదు. కార్మికులతో బలవంతంగా లేఖలు ఇప్పించినా, కార్మిక శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందనే భావిస్తున్నాం. సమ్మె డిమాండ్ల కేసు ఎలాగూ ట్రిబ్యునల్‌ వద్దే ఉంది. దానికీ, ఎన్నికలకు సంబంధం లేదు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆర్టీసీ కార్మికులు ఐక్యంగానే ఉంటారు. ప్రభుత్వ బెదిరింపులకు జడిసేదిలేదు.

లేఖ పూర్తి సారాంశం..
''మేము.. డిపోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నాము. ఇందుమూలముగా మీకు తెలియచేయునది ఏమనగా మేము మా సమస్యల సామరస్య పరిష్కారం కోసం వెల్ఫేర్‌ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మేము కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్న వేల్ఫేర్‌ కౌన్సిల్స్‌ ద్వారా మా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని మాకు నమ్మకం ఉంది. కనుక కార్మిక సంఘాల గుర్తింపు కోసం జరిగే ఎన్నికలు కనీసం రెండు సంవత్సరాలపాటు నిర్వహించవద్దని కోరుకుంటున్నాము''. ఈ లేఖ క్రింద ఉద్యోగి పేరు, స్టాఫ్‌ నెంబరు, హోదా, సంతకం కాలమ్స్‌ కూడా ఉన్నాయి. డిపోల్లో ఈ కాగితంపై కార్మికులు తమ వివరాలు నింపి సంతకం చేస్తే సరిపోతుంది. సంతకం చేయని కార్మికుల జాబితాను విడిగా ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు ఉన్నట్టు ఓ డిపో మేనేజర్‌ తెలిపారు. ఈ చర్యను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫిట్‌ మెంట్‌ 7.5 శాతం
అప్పుల బాధతో ముగ్గురు రైతుల మృతి
రైతుల పక్షమా.. కార్పొరేట్ల పక్షమా..
లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరు
పల్లెల అభివృద్ధికి ఫ్రీజింగ్‌
వంటి మామిడి మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌
రైతులకు అండగా నిలుద్దాం
సాగు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
పీఆర్సీ నివేదిక చెత్తబుట్టలో వేస్తున్నాం...
మాకొద్దీ పీఆర్సీ ...
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి
కుబేరులకు దోచిపెడుతున్న కేంద్రం
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
మహిళా సిబ్బంది పనితీరు భేష్‌
వికలాంగుల చట్టాల అమలుకు ఉద్యమం
వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్ల స్కేలు ఇవ్వాలి
ఐదో అంతస్తు నిర్మాణం అనుమతి కోసం చర్యలేం తీసుకున్నారో చెప్పండి
నింబోలి అడ్డా హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన పడొద్దు
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మిస్తాం- మంత్రులు
ఏఎంఆర్‌పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి
ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా : బండి
ప్రభుత్వ కనుసన్నల్లోనే పీఆర్సీ నివేదిక : చాడ
క్యారెక్టర్‌ లేని జగదీశ్‌ రెడ్డి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవో 34 అమలుకు గడువు కావాలి
ఆర్టీసీ రక్షణకు నిధులు కేటాయించండి
తిరోగమన దిశలో పీఆర్సీ రిపోర్టు..పోరుబాటే కరెక్టు : సీఐటీయూ

తాజా వార్తలు

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

10:52 AM

దేశంలో కొత్తగా మరో 11వేల పాజిటివ్ కేసులు

10:43 AM

మొసలితో ఓ వ్యక్తి చలగాటం.. చివరకు..

10:32 AM

వేలం పాటలో సర్పంచ్ పదవికి రూ.33లక్షలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.