Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
లైంగికదాడులు, హత్యలకు సంబంధించిన కేసుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట కాలపరిమితిలో దోషులకు వేగంగా శిక్షపడేలా చట్టాల్లో మార్పు తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దిశ హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించినట్టు పోలీసులు ప్రకటించారని తెలిపారు. దిశ ఘటనపై సత్వర న్యాయం కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసినట్టుగానే, ఇటీవల కొమురంభీం జిల్లాలో దళిత మహిళపై జరిగిన లైంగికదాడి, హత్య, వరంగల్లో జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలపై ఫాస్ట్ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లైంగికదాడికి సంబం ధించిన ఘటనలు జరిగి ఏండ్లు గడుస్తున్నా, శిక్ష అమలులో జాప్యం జరుగు తుండడంతో ప్రజల ఆగ్రహానికి కారణమవు తున్నాయని తెలిపారు.
ప్రజల్లో నమ్మకం పెరిగింది : టీఎన్జీవో
దిశ హత్యకేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులు (టీఎన్జీవో) కేంద్ర సంఘం అధ్యక్షులు కారం రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాజేందర్, నాయకులు బి రేచల్, ఉమాదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి శిక్ష వల్ల మహిళల పట్ల సమాజంలో గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.