Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం

- పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టడంపై ఆవాజ్‌ ఆందోళన
- అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పౌరసత్వ సవరణ బిల్లు-2019 (ఎన్నార్సీ) రాజ్యాంగ విరుద్ధమని ఆవాజ్‌ (ఏ ఫోరం ఫర్‌ ది డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌) విమర్శించింది. బీజేపీ సర్కారు పౌరసత్వాన్ని మతంతో ముడి పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం తన మందబలంతో లోక్‌సభలో ఆమోదింప చేసుకోవడాన్ని ఖండించింది. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ మంగళవారం ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఎన్నార్సీ వాపస్‌ లేవో, బీజేపీ సర్కారు హోష్‌ మే ఆవ్‌, సేవ్‌ నేషనలిజం, బీజేపీ, ఎన్టీయే, ఆర్‌ఎస్‌ఎస్‌ డౌన్‌, డౌన్‌ అంటూ నాయకులు, కార్య కర్తలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద, ప్రజా స్వామ్య, గణతంత్ర వంటి మూ ల సూత్రాలను బీజేపీ తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆవాజ్‌ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్‌ మహమ్మద్‌ అన్సారీ, మహమ్మద్‌ అబ్బాస్‌ మాట్లాడు తూ దేశ సమైక్యతకు, సమగ్రత కు ప్రమాదం వాటిల్లేలా, ప్రజల మధ్య మత విభజన సృష్టించే ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో వలసలను ప్రోత్సహించేలా ఈ బిల్లు ఉందని విమర్శించారు. ఇప్పటి క ఈశాన్య రాష్ట్రాలు వలసలతో ఇబ్బందులకు గురౌవుతుంటే, దేశ వ్యాప్తంగా ఈ సమస్యను రుద్దాలని ప్రయత్నిం చడం దారుణమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 5 నుంచి 11 వరకు పౌరసత్వానికి సంబంధిం చిన వివరణ ఎక్కడా లేదని గుర్తు చేశారు. పౌరసత్వం విషయంలో మత విశ్వాసాలు పరిగణనలోకి తీసుకుంటు న్నట్టుగా రాజ్యాంగంలో పేర్కొనలేద న్నారు. ఇప్పటి వరకు జరిగిన పౌరసత్వ చట్టం సవరణలో ఎప్పుడు కూడా మతం ప్రాతిపదికగా సవరణలు జరగలేదని అభిప్రాయపడ్డారు. ఎవరికైనా పౌరసత్వం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం విచక్షణ ప్రకారం ఇప్పటికే ఉన్న చట్టాలకు అనుగుణంగా ఇవ్వవచ్చని తెలిపారు. కానీ కొన్ని మతాలకు దీనిని పరిమితం చేయాలని చూడటం సరైందికాదని తెలిపారు. దేశ ప్రజల మధ్య మత చిచ్చు పెట్టడానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు. దేశంలో మత కుంపట్లు రాజేసీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. సోషలిస్టు పార్టీ అధ్యక్షురాలు లుబ్న సర్వత్‌ మాట్లాడుతూ ఎన్నార్సీపై శాస్త్రీయ అధ్యయనం చేశారా? చేస్తే ఆ వివరాలు బహిర్గ తం చేయాలని డిమాండ్‌ చేశారు. పౌరసత్వం కావాలని ఎన్ని దరఖాస్తులు వచ్చాయో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో చెప్పలేదని విమర్శించారు. నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, మైనార్టీలు, దళితులపై దాడులతోపాటు అనేక సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ సర్కారు ఎన్నార్సీ బిల్లును ప్రజల ముందుకు తెచ్చిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసి ప్రతి పౌరుడికి ఆధార్‌కార్డు ఇచ్చిందనీ, ఈ సందర్భంగా ఆ కార్డులను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఆర్‌ అధ్యక్షులు ఎండీ అప్జల్‌, మైనార్టీ రైట్‌ ప్రొడక్షన్‌ నేత మహ్మద్‌ అబ్దుల్‌ అలీ, నాయకులు ఎండీ రజాక్‌, ఎండీ ఇఫ్తెఖార్‌, అబ్దుల్‌ సత్తార్‌, ఎల్‌ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాటమే...
సుప్రీం తీర్పు వెనుక దురుద్దేశం
దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు
సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష అంతం : మల్లు లక్ష్మి
మహనీయుల మార్గదర్శి కేవీపీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
స్టే కాదు.. చట్టాలను రద్దు చేయాలి
ఓయూలో కాంట్రాక్టర్‌ ధనదాహం!
గిరిజన సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల కాపీలు దహనం
వరి ఎక్కువగా పండే జిల్లాల్లో డ్రై పోర్టులు
రైతు వ్యతిరేక చట్టాల్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం క్యూ లైన్‌
కార్పొరేట్‌ విద్యలో విలువలు ఉండవు
సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
నిజామాబాద్‌లో కోళ్లు మృత్యువాత
బావిలో చిరుత
జిల్లాలకు తరలిన వ్యాక్సిన్‌
ప్రజలకు గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
అన్ని తరగతులనూ ప్రారంభించాలి : టీపీఏ
ఇంటర్‌ విద్యలో అక్రమాలపై చర్యలు తీసుకొండి
28 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్‌
మెక్‌టెక్‌ సంస్థ రూ.5 కోట్లను ఇచ్చేయండి
పెరుగనున్న చలి తీవ్రత
రైతుల పాక్షిక విజయం..
ఆ చట్టాలు దుర్మార్గం..
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌
గోస పట్టేనా?
గ్రేటర్‌ వాసులకు నీటి కష్టాలుండవ్‌
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి
కళతప్పిన సంక్రాంతి

తాజా వార్తలు

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

10:58 AM

పెను విషాదం..సముద్రంలో కుప్పకూలీన విమానం

10:40 AM

17 మంది ఎస్ఐలకు స్థానచలనం

10:32 AM

అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ .. బైడెన్‌ కీలక ప్రతిపాదన

10:12 AM

ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఏడుగురు మృతి

09:55 AM

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.