Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
హామీల ముచ్చటేది? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 11,2019

హామీల ముచ్చటేది?

- కేసీఆర్‌ సర్కారు కొలువుదీరి ఎల్లుండికి యేడాది
- నిరుద్యోగభృతి జాడేది.. రైతు రుణమాఫీ ఊసేది
- డబుల్‌ బెడ్‌ రూంలు, దళితులకు మూడెకరాలు అంతే సంగతులు
- ఒక్క కొలువూ లేదు
         తెలంగాణ ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖరరావు రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఎల్లుండికి (శుక్రవారం) సరిగ్గా యేడాది పూర్తవుతుంది. గతేడాది డిసెంబరు 13న రాజ్‌భవన్‌లో ఆయనతోపాటు హోం మంత్రి మహమూద్‌ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అంతకు ఒకరోజు ముందు మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు అనేక వరాలు కురిపించారు. తమ మీద నమ్మకముంచి రెండోసారి అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామనీ, ఈ క్రమంలో మరిన్ని కొత్త పథకాలను అమలు చేస్తామంటూ హామీనిచ్చారు. ఆసరా పెన్షన్ల పెంపు, రైతుబంధు కింద ఇచ్చే సాయం పెంపు, నిరుద్యోగ భృతి, దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు, ఇందుకోసం కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు తదితరాంశాలు ఆయన వాగ్దానాల్లో ముఖ్యమైనవి.
బి.వి.యన్‌.పద్మరాజు
వీటిలో ఆసరా పెన్షన్లను రూ.వెయ్యి నుంచి రూ.2,016కు పెంచారు. దీంతోపాటు రైతుబంధు సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. ఇవిగాకుండా ఈ యేడాది కాలంలో సీఎం ఇచ్చిన హామీల్లో అత్యంత ప్రధానమైన అంశాలు మాత్రం అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతికి ఇప్పటి వరకూ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించకపోవటం గమనార్హం. దీనిపై ముఖ్యమంత్రిగానీ, ఉన్నతాధికారులుగానీ నోరు మెదపటం లేదు. అప్పట్లో సీఎం నిరుద్యోగ భృతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు..? వారు విద్యార్హతలేమిటి..? వారు ఏయే పనులు చేస్తున్నారు..? అనే వివరాలను వయసుల వారీగా సేకరిస్తామని ఆయన ఆ సందర్భంగా చెప్పారు. తద్వారా ఒక జాబితా రూపొందించి.. ఉన్నతాధికారులతో మాట్లాడి మార్గదర్శకాలు రూపొందిస్తామంటూ తెలిపారు. కానీ అందుకనుగుణంగా ఇప్పటి వరకూ ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదు. దీంతోపాటు అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ విషయంలోనూ సర్కారు వైపు నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కొద్ది నెలల క్రితం ఇదే విషయంపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ... 'రైతులు బ్యాంకుల్లో ఉన్న అప్పులు పూర్తిగా చెల్లించి ఖాతాలు రెన్యూవల్‌ చేయించుకోవాలి. వారి డబ్బుల్ని మేం అణా పైసాతో సహా చెల్లిస్తాం. కాకపోతే కొంత సమయం పడుతుంది...' అని ప్రకటించారు. ఇది జరిగి దాదాపు ఆరేడు నెలలు గడిచినా రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవటం గమనార్హం. దీంతో రైతులకు వడ్డీ భారం పెరిగిపోతుంది. బ్యాంకులు కొత్తగా అప్పులివ్వకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ యేడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కొలువునూ భర్తీ చేయలేకపోయింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఒక్క నోటిఫికేషన్‌ వెలువడలేదు. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నియామకాలు చేపట్టాలంటూ వికలాంగ అభ్యర్థులు మంగళవారం ప్రగతి భవన్‌ను ముట్టడించారంటే రాష్ట్రంలో
నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామంటూ ఆ సందర్భంగా సీఎం హామీనిచ్చినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేకపో యింది. దీంతోపాటు 2018 ఏప్రిల్‌ చివరి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా నీరు అందిస్తామంటూ సీఎం చెప్పారు. కానీ వాస్తవంలో మాత్రం ఆ పథకం పనులు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. టీఆర్‌ఎస్‌ సర్కారు 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్పుడు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య తదితర పథకాలను ప్రతిష్టా త్మకంగా ప్రకటిం చింది. దాదాపు నాలుగున్నరేండ్లపాటు వీటి కోసం ఎదు రు చూసిన లబ్ది దారులు.. కనీసం కేసీఆర్‌ రెండోసారి సీఎం అయిన తర్వాతైనా ఆయా పథకాలను అమలు చేస్తారని భావించారు. కానీ గత యేడాది కాలంలో ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి కూడా వీటి గురించి ప్రస్తావించలేదు. దీన్ని బట్టి ఆయా స్కీములు అటకెక్కినట్టేననే వాదనలు వినబడుతున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పోరాటమే...
సుప్రీం తీర్పు వెనుక దురుద్దేశం
దళితుల ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు
సామాజికంగా, ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష అంతం : మల్లు లక్ష్మి
మహనీయుల మార్గదర్శి కేవీపీఎస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ
స్టే కాదు.. చట్టాలను రద్దు చేయాలి
ఓయూలో కాంట్రాక్టర్‌ ధనదాహం!
గిరిజన సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ చట్టాల కాపీలు దహనం
వరి ఎక్కువగా పండే జిల్లాల్లో డ్రై పోర్టులు
రైతు వ్యతిరేక చట్టాల్ని తిప్పికొట్టాలి
ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం క్యూ లైన్‌
కార్పొరేట్‌ విద్యలో విలువలు ఉండవు
సంక్రాంతికి పట్నం వాసులు పల్లెబాట
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండి
నిజామాబాద్‌లో కోళ్లు మృత్యువాత
బావిలో చిరుత
జిల్లాలకు తరలిన వ్యాక్సిన్‌
ప్రజలకు గవర్నర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
అన్ని తరగతులనూ ప్రారంభించాలి : టీపీఏ
ఇంటర్‌ విద్యలో అక్రమాలపై చర్యలు తీసుకొండి
28 ప్రభుత్వాస్పత్రుల్లో పేషెంట్లు నిల్‌
మెక్‌టెక్‌ సంస్థ రూ.5 కోట్లను ఇచ్చేయండి
పెరుగనున్న చలి తీవ్రత
రైతుల పాక్షిక విజయం..
ఆ చట్టాలు దుర్మార్గం..
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌
గోస పట్టేనా?
గ్రేటర్‌ వాసులకు నీటి కష్టాలుండవ్‌
కల్తీకల్లు, మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టాలి
కళతప్పిన సంక్రాంతి

తాజా వార్తలు

09:05 PM

ఈ కల్వర్టులో నాణ్యత లేదు, గట్టిగా వరదొస్తే కొట్టుకుపోతుంది.

09:03 PM

చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

08:11 PM

సిరాజ్‌పై మరసారి జాత్యహంకార వ్యాఖ్యలు

08:02 PM

మరో ఐదుగురికి కరోనా స్ట్రెయిన్

07:53 PM

19న మరోసారి రైతులతో చర్చలు

06:43 PM

రేపు నల్గొండలో పర్యటించనున్న కేసీఆర్

06:36 PM

గుడిసెకు నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

06:30 PM

గారాలు పోయిన చిరుత.. వైరల్ అవుతున్న వీడియో

05:39 PM

అంబర్‌ పేట లో మహిళ అదృశ్యం

05:24 PM

జనవరి 24న హీరో వరుణ్ పెండ్లి

05:07 PM

35కి చేరిన ఇండోనేసియా భూకంపం మృతుల సంఖ్య

04:56 PM

కేంద్రం - రైతులు మధ్య కోనసాగుతున్న చర్చలు..

04:16 PM

పిఆర్సీ నివేదిక వెల్లడించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

03:44 PM

ఫౌంటెయిన్‌ తలపించిన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ

03:37 PM

రామమందిరానికి రాష్ట్రపతి 5లక్షలు విరాళం

01:57 PM

విద్యార్థులకు అలర్ట్.. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఇవే

01:33 PM

నేటి నుండి శంషాబాద్‌ - చికాగో నాన్‌స్టాప్‌ సర్వీస్

01:19 PM

18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వం : డీఎంఈ రమేష్ రెడ్డి

01:01 PM

నల్గొండలో యువకుడి దారుణ హత్య

12:50 PM

ముఖ్యమంత్రివి దిగజారుడు రాజకీయాలు : అచ్చెన్న

12:43 PM

ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌

12:32 PM

ఘోర రోడ్డుప్ర‌మాదం..11 మంది మృతి

12:20 PM

ఘనంగా ఆర్మీ దినోత్సవ వేడుకలు

12:06 PM

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్‌‌

12:01 PM

నేటి నుంచి రామ మందిరం నిర్మాణానికి విరాళాల సేకరణ

11:36 AM

లైక్‌ బటన్‌ కనిపించదు.. ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్స్

11:23 AM

పేస్ బౌలింగ్‌తో రోహిత్ శ‌ర్మ స‌ర్‌ప్రైజ్

10:58 AM

పెను విషాదం..సముద్రంలో కుప్పకూలీన విమానం

10:40 AM

17 మంది ఎస్ఐలకు స్థానచలనం

10:32 AM

అమెరికన్‌ రెస్క్యూ ప్లాన్‌ .. బైడెన్‌ కీలక ప్రతిపాదన

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.