Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కల్తీ కల్లు, స్థలాలపై ఆరా తీసినందుకు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

కల్తీ కల్లు, స్థలాలపై ఆరా తీసినందుకు..

- నిరుపేద దళిత కుటుంబంపై దాడి
- కర్రలతో కొట్టిన టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ కుటుంబం
- బాధితులకు మద్దతు తెలపొద్దని గ్రామంలో బెదిరింపు
- కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి..
నవతెలంగాణ-నిజామాబాద్‌
గతంలో కల్తీ కల్లు విషయం, గ్రామ స్థలాలపై ఆరా తీసినందుకు ఓ దళిత కుటుంబంపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో పశువులు కట్టేస్తున్నారని నోటీసు జారీ చేయించారు. వివాదం అధికారుల సమక్షంలో పరిష్కరిం చాల్సిందిపోయి వారిపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌, కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. కర్రలతో కొట్టడంతో వృద్ధుడి తల భాగం పగిలింది. వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. పది రోజులు గడిచినా ఈ విషయం బయటకు పొక్కనీయకుండా టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామస్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం కంషెట్‌పల్లిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితుల వివరాల ప్రకారం... దళిత కుటుంబానికి చెందిన సైదులు, మల్లమ్మ, వారి కుమారుడు సాయిబాబా గత ముప్పై ఏండ్లుగా కంషెట్‌పల్లిలో ఉంటున్నారు. భూములు లేకపోవడంతో మూడు గేదెల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నారు. గతే పదిహేనేండ్లుగా ఇంటి ముందు ఖాళీ స్థలంలో బర్లను కట్టేసుకుంటుండగా.. కొంతకాలంగా ప్రభుత్వ స్థలమంటూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామంలో కల్తీ కల్లు విచ్చలవిడిగా సరఫరా అవుతోందనీ, పలువురు ప్రమాదాలకు గురవుతున్నారనీ సాయిబాబ ఆరా తీశాడు. రెండు దుకాణాలు ప్రస్తుత సర్పంచ్‌ భర్త సాయగౌడ్‌కు చెందినవి కావడంతో అతనిపై ఆగ్రహం పెంచుకున్నాడు. పశువులు కట్టేస్తున్న స్థలం ప్రభుత్వానిదని పంచాయతీ కార్యదర్శి నుంచి రాతపూర్వక నోటీసు వచ్చింది. అనంతరం గ్రామంలో ఎన్ని కబ్జా భూములున్నాయో తెలుసుకునేందుకు ఆర్‌టీఐకి సాయిబాబ దరఖాస్తు పెట్టాడు. అప్పటికే ఎన్నికల్లో మరో సర్పంచ్‌ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని కక్ష పెంచుకోవడం, కల్తీ కల్లు, స్థలంపై ఆరాతీయడంతో సర్పంచ్‌ భర్త ఆగ్రహంతో రగిలిపోయాడు. డిసెంబర్‌ 5న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఉద్దేశపూర్వకంగానే సాయిబాబ, అతని తల్లిదండ్రులపై దాడికి దిగారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సైదులు తల పగిలింది. మల్లమ్మపై పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. వాళ్ల కుమారుడు వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారమే వారు డిశ్చార్జి అయి కూతురి ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. గొడవ జరుగుతుందని ముందే ఫిర్యాదు వెళ్లినా కిలోమీటరు దూరంలో ఉన్న పోలీసులు చేరుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పంచ్‌ విజయలక్ష్మి, ఆమె భర్త సాయగౌడ్‌, ఆయన తమ్ముడు అరవింద్‌గౌడ్‌, గ్రామస్థుడు బాబుపై కేసు నమోదైనా ఇప్పటిదాకా వాళ్లపై న్యాయపరమైన చర్యలేవీ తీసుకోలేదు. బాధిత కుటుంబానికి ఎవరు మద్దతు తెలిపినా, పరామర్శించినా వాళ్లను కూడా వదలబోమని సదరు టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామస్థులను బెదిరించినట్టు తెలిసింది. అప్పటికే స్థల వివాదంపై అధికార పార్టీ ముఖ్య నాయకులు కొందరు రాజీకి యత్నించినా.. దాడి అనంతరం బాధిత కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి
పీఆర్‌ ఇంజినీరింగ్‌లో ప్రమోషన్ల గొడవ
పథకాల చేరవేతలో అంగన్‌వాడీల పాత్ర కీలకం :మంత్రి సత్యవతి
ఎస్సీ, ఎస్టీలు ఔత్సాహికవేత్తలుగా మారాలి
'జీహెచ్‌ఎమ్‌సీ చట్ట సవరణలపై పిల్‌ ఇప్పుడా...?'
రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలి
దోషులకు శిక్షలు పడాలి
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత
అప్పుల ఊబిలో డిస్కంలు
రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు... : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
సీపీఎస్‌ను రద్దు చేయండి

తాజా వార్తలు

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

04:02 PM

గవాస్కర్ రికార్డును తిరగరాసిన శుభమన్ గిల్..

03:51 PM

బీజేపీ మళ్లీ డిపాజిట్ కోల్పోతుంది : ఉత్తమ్ కుమార్

03:38 PM

మోడీ ఫొటో లేదని..

03:37 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి..

03:20 PM

టీమిండియాకు కేసీఆర్, కేటీఆర్ అభినందనలు..

03:16 PM

సాగు చట్టాలు..వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయి : రాహుల్ గాంధీ

03:07 PM

అనుమానించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి : కోహ్లీ

03:03 PM

ఘోర విషాదం.. రెండు కార్లు ఢీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.