Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయొద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Dec 15,2019

పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయొద్దు

- మత సామరస్యానికి ప్రతీకగా రాష్ట్రం ఉండాలి: సీఎంకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతప్రాతిపదికన మెజార్టీని దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలను మంట కలిపే విధంగా ఇటీవల పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లు-2019ని ఆమోదించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నదని విమర్శించారు. పౌరసత్వానికి - మతానికి ముడిపెడుతూ, లౌకికతత్వానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నందున దేశవ్యాప్తంగా నిరసన ఆగ్రహజ్వాలలు పెల్లుబికుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతోపాటు, మైనార్టీలు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, కళాకారులు, రచయితలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ చట్టం వల్ల అన్యాయం జరుగుతుందని ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయని తెలిపారు.
దేశ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తెచ్చిన ఈ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారని గుర్తు చేశారు. మత కోణంలో తెస్తున్న ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడే విధంగా కృషి చేసారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల సీఎంల తరహాలో ఈ రాష్ట్రంలోనూ ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడి, మత సామరస్యానికి ప్రభుత్వం ప్రతీకగా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆహార భద్రతకు ముప్పు
సాగునీటి గోస లేకుండా చేయడమే లక్ష్యం
పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాజ్‌ భవన్‌ ముట్టడి ఉద్రిక్తం
మహిళా సంఘాలకు మిత్తి రాలే!
కార్పొరేట్ల ఊడిగం కోసమే...
ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆక్రమిస్తాం
రైతాంగ పోరాట స్ఫూర్తితో జీపీ, మున్సిపల్‌ కార్మికులు ఉద్యమించాలి
ఉదయ్, ఆదిత్యతో ఒరిగిందేమీ లేదు
జీవో 215 కేసులో కౌంటర్‌ ఎందుకు వేయలేదు ?
నేటి నుంచి కార్మిక-కర్షక పోరుయాత్ర
వినియోగదారుల సేవల్లో అలసత్వం వద్దు
తుది దశకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ట్రంప్‌ పాలసీలనే బైడెన్‌ అనుసరిస్తారు
వారంలో ఇంటర్‌ పరీక్షల తేదీలు
3.48 లక్షల వ్యాక్సిన్‌ డోసుల రాక
కరోనా చికిత్సకు మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌
రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
కృష్ణా బోర్డు విశాఖలో వద్దు
కాళేశ్వరంపై హైకోర్టులో రిట్‌
బడికో స్వచ్ఛ కార్మికున్ని నియమించాలి
ఐఈఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి సబిత
ప్రయివేటు అధ్యాపకుల సమస్యలపై స్పందించండి
పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమీక్ష
హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు అవసరం
కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి

తాజా వార్తలు

08:51 PM

సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ

08:28 PM

ఎస్‌ఐ ఆత్మహత్య.. ప్రియురాలు జైలుకు

08:01 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

07:42 PM

కేక్ కట్ చేసినందుకు మహిళ అరెస్ట్..

07:16 PM

బంజారాహిల్స్‌ కార్పొరేటర్ విజయలక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు

07:02 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

06:44 PM

హైదరాబాద్‌లో మరోసారి నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌

06:44 PM

ధరణిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష‌..

06:39 PM

ఏపీలో కొత్తగా 173 పాజిటివ్ కేసులు నమోదు

06:35 PM

మద్యం మత్తులో బైకుకు నిప్పు పెట్టిన మందుబాబు..

06:33 PM

ఐపీఎల్ 2021.. ఆర్సీబీ రిటెన్ ప్లేయర్స్ లిస్ట్ విడుదల

06:26 PM

రెడ్‌ అంబులెన్స్ సంస్థకు వ్యతిరేకంగా నిరసన

06:26 PM

జయలలిత సన్నిహితురాలు శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

05:54 PM

త్రిపురలో బీజేపీ కార్యకర్తల దాడులను నిరసిస్తూ సీపీఐ(ఎం) ర్యాలీ

05:52 PM

టీడీపీ నేత హత్య.. నిందితులు అరెస్ట్

05:43 PM

రాష్ట్రంలో కరోనా బారినపడ్డ జర్నలిస్టులకు 3కోట్ల ఆర్థిక సాయం..

05:36 PM

మరో 15 మెగావాట్ల సింగరేణి సోలార్‌ విద్యుత్తు ప్లాంట్ ప్రారంభం..

05:27 PM

కార్మిక కర్షక పోరు యాత్రను జయప్రదం చేయండి:- సీఐటీయ

05:21 PM

కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

05:03 PM

నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి..

04:55 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:40 PM

తగిన సమయంలో కేటీఆర్ సీఎం అవుతారు..

04:25 PM

సైనిక బలగాల రహస్యాలు బహిర్గతం చేయడం దేశద్రోహమే..

04:21 PM

వేడుకలు చేసుకోవడం కాస్త ఆపేయండి..

04:01 PM

ఆర్టీసీ బస్సు - డీసీఎం ఢీ.. 50 గొర్రెలు మృతి

03:55 PM

ప్రభాస్ పెళ్లి.. యాంకర్ పై కృష్ణం రాజు సీరియస్

03:43 PM

రైతులు, కేంద్రం మధ్య 10 దఫా చర్చలు ప్రారంభం

03:30 PM

వ్యవసాయశాఖ మంత్రిని అడ్డుకున్న రైతులు..

03:24 PM

కరోనా వ్యాక్సిన్..మందు బాబులకు షాక్‌

03:22 PM

CSK కు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.