Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రయివేటు హాస్టళ్లు అధ్వానం..! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 14,2020

ప్రయివేటు హాస్టళ్లు అధ్వానం..!

- చెత్తగా నిర్వహణ.. కనీస వసతులు కరువు
- రూ.3500 నుంచి రూ.పదివేలు వసూలు చేస్తున్న నిర్వాహకులు
- పట్టించుకోని అధికారులు
హైదరాబాద్‌ మినీ భారతం. ఇతర జిల్లాలతోపాటు రాష్ట్రాల ప్రజలూ విద్య, ఉద్యోగం, ఇతరత్ర అవసరాల నిమిత్తం నగరానికి వస్తుంటారు. వీరిలో చాలా మంది ప్రయివేటు వ్యక్తులు, సంస్థలు నిర్వహించే హాస్టళ్లలో ఉంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఈ తరహా హాస్టళ్లుండగా లక్షలాది మంది వాటిల్లో వసతి పొందుతున్నారు. ప్రాంతం, సౌకర్యాలను బట్టి ఒక్కో హాస్టల్‌లో ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ కనీస వసతులు మాత్రం కల్పించడం లేదు. దీంతో వినియోగదారులు, విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు నష్టపోతున్నారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
గ్రేటర్‌ హైదరాబాద్‌లో దాదాపుగా ఐదు వేలకుపైగా ప్రయివేటు హాస్టళ్లు ఉన్నాయి. సాధారణ సదుపాయాలు కల్పించే హాస్టల్‌ నిర్వాహకులు రూ.3,500 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తుండగా, ఐటీ కారిడార్‌, డీలక్స్‌ హాస్టళ్లలో రూ.ఆరు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. కానీ నాణ్యమైన ఆహారంతోపాటు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వసతి పొందుతున్న వారు చెబుతున్నారు. పుచ్చులున్న, పాడైన కూరగాయలు, రేషన్‌ బియ్యంతో వడ్డిస్తున్నారు. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నతున్నది. 20 మందికి కలిపి ఒకే బాత్‌రూం, శుభ్రత పాటించకపోవడం, నలుగురు ఉండే గదుల్లో పది మందిని నింపేస్తున్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి వీల్లేకుండా ఉంటున్నది. ఇలాంటి హాస్టళ్లు నగరంతోపాటు ఆయా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కువగా కనిపిస్తాయి. లైబ్రరీ దగ్గరగా ఉండటంతో ఇక్కడ ఉంటున్నామని కొంతమంది బాధితులు చెబుతుండగా, ఆయా సంస్థలకు దగ్గరగా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఫైర్‌ సేప్టీ లేకపోవడం, గదులు, కిచెన్‌ శుభ్రంగా లేకపోవడం, వాడిపోయిన దొండకాయ, ముదిరిన బెండకాయలతో కూరలు, రాత్రి మిగిలిన అన్నంతో పులిహోర, జీరా రైస్‌ చేస్తున్నారు. ఇలాంటి హాస్టళ్లు నారాయణగూడ, చిక్కడపల్లిలో చాలానే ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లి రద్దీ ప్రాంతాలు కావడంతో హాస్టళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులు, సీసీ కెమెరాలు లేక లోపలికి ఎవరు వెళ్తున్నారు.. ఎవరు వస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదు. వాహనాలు ఉంచడానికి సైతం స్థలం లేక బయట పార్కు చేయడంతో ఎవరైనా దొంగతనాలు చేసే అవకాశాలు ఉన్నాయని వసతి పొందుతున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్‌ హాస్టళ్ల వద్ద సెక్యూరిటీ గార్డులు లేకపోవడంతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.సొంత గృహాల్లో నిర్వహణ ఉండటంతో మెజార్టీ నిర్వాహకులు అనుమతులు తీసుకోకపోవడంతోపాటు, కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వారికి సంబంధించిన వ్యక్తుల హాస్టళ్లు కావడంతో ఎలాంటి అనుమతులు పొందడం లేదు. ఓ మాజీ ఎమ్మెల్యేకు ఏకంగా గ్రేటర్‌లో 50కిపైగా హాస్టళ్లు ఉన్నట్టు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించి ఏడు హాస్టళ్లను సీజ్‌ చేశారు. కొద్ది రోజుల తర్వాత స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి మొత్తం ఎన్ని హాస్టళ్లు ఉన్నాయి? ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి? అనే లెక్కలు తేలుస్తామన్న అధికారులు అటువైపే చూడటం లేదు. దీంతో నిర్వాహకులు తాము వడ్డించేదే అన్నం, పెట్టిందే తినాలి అన్నట్టుగా మారింది పరిస్థితి.హాస్టళ్ల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకోకుండానే సొంత ఇండ్లల్లో యధేచ్ఛగా నడిపిస్తున్నారు. దీంతో కమర్షియల్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా కేవలం రెసిడెన్సియల్‌ ట్యాక్స్‌ మాత్రమే చెల్లిస్తుండటంతో ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతున్నది.
నలుగురు ఉండే గదుల్లో ఏడుగురిని ఉంచుతున్నారు
సౌమ్య, విద్యార్థిని
నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ కావడానికి హైదరాబాద్‌కు వచ్చాను. మా హాస్టల్‌లో కనీస సౌకర్యాలు లేవు. ఇరవై మందికి కలిపి ఒకే బాత్రూం ఉంది. ఉదయం సమయంలో అందరూ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాల్సి ఉండటంతో క్యూ కట్టాల్సి వస్తున్నది. నలుగురు ఉండాల్సిన గదిలో ఏడుగురిని కుక్కడంతో నడవడానికి రాక ఇబ్బందులు పడుతున్నాం.
శుభ్రత లేదు..
సత్యనారాయణరెడ్డి, చిరు ఉద్యోగి
నేను ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. ఆఫీసుకు ఆర్టీసీ క్రాస్‌రోడ్డు దగ్గర కావడంతో ఇక్కడే హాస్టల్‌లో ఉంటున్నా. నిర్వాహకులు శుభ్రత పాటించకపోవడంతో ఆహారంపై దోమలు, ఈగలు వాలుతున్నాయి. దీంతో అనారోగ్యాల బారినపడుతున్నాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ
చార్జీలు పెంచక తప్పదు
దళితులపై కాషాయ మూకల దాడి
అందరినీ ముంచే చట్టాలు
పీఆర్సీ ఇంత జాప్యమా?
స్వాతంత్ర పోరాటాన్ని మరిపించేలా రైతాంగ పోరాటం
ఈఎస్‌సీఐ సేవలను..సద్వినియోగం చేసుకుంటాం
బీడీరంగంపై మరో పిడుగు
బూర్గుల నర్సింగ్‌ రావు బహుముఖ ప్రజ్ఞాశాలి
కేజీవీబీ నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి కనీసవేతనాలివ్వాలి
కాబోయే సీఎం కేటీఆర్‌ కు శుభాకాంక్షలు
భూమిలో ఉందాం...లేకుంటే జైళ్లోనే
సింగరేణిలో 372 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
రవాణాశాఖలో ఏవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుకోండి
టీకా తీసుకునేందుకు నిరాకరణ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు
గీత కార్మికులను ఆదుకోవాలి
ఐకమత్యమే మహాబలం
నేటినుంచి లాసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్‌ కసరత్తు
రేపటినుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌
'బదిలీల మార్గదర్శకాలు వెంటనే ఇవ్వాలి'
బీజేపీ చెప్పినట్టుగానే సీఎం మార్పు : జగ్గారెడ్డి
50 శాతానికి ఫీజులు తగ్గించాలి : జాజుల
నియామకాలు నాలుగు వారాల్లో చేయాలి
ఆర్టికల్‌ 46 ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
కార్మిక కోడ్‌లు, కర్షక చట్టాలు రద్దు చేయాల్సిందే
ప్రాణాలైనా ఇస్తాం.. భూములు వదలం

తాజా వార్తలు

02:43 PM

ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌: ఏడుగురికి అస్వస్థత

02:31 PM

మమతా బెనర్జీకి మరో షాక్

02:14 PM

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై జూన్ 21 వరకు స్టే

02:00 PM

గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ రమేశ్ భేటీ

01:50 PM

మే 29న కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక.!

01:38 PM

క్షమాపణ చెప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

01:26 PM

సెర్చ్ ఇంజిన్ ఆపేస్తామంటూ.. గూగుల్ హెచ్చరిక

01:14 PM

విద్యాశాఖ మంత్రికి కరోనా పాజిటివ్.. అధికారుల్లో టెన్షన్

01:03 PM

రైతులు అప్పు చెల్లించలేదని పొలం వేలం పెట్టిన బ్యాంకు అధికారులు

12:54 PM

పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు : ఈటల

12:44 PM

లాలూ ప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత..

12:34 PM

కొమిరేపల్లిలోనూ వ్యాప్తి చెందిన వింత వ్యాధి..

12:23 PM

సగం ఉడికిన చికెన్, గుడ్లు తినకండి : FSSAI

12:13 PM

డ‌యాగ్నోస్టిక్ మినీ హ‌బ్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్

12:07 PM

శివమొగ్గ భారీ పేలుడు ఘటనలో ఇద్దరు అరెస్ట్

11:56 AM

శశికళ ఆరోగ్య పరిస్థితి విషమం.. నేతల్లో టెన్షన్

11:46 AM

రూ.18వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

11:42 AM

స్నేహం ముసుగులో బాలిక​పై సామూహిక లైంగిక దాడి

11:34 AM

వరంగల్ జిల్లాలో దారుణం..

11:17 AM

100 రోజులు ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి : బైడెన్

11:09 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

11:01 AM

కార్మిక,కర్షక రాష్ట్ర జాతరకు కార్మికుల ఘన స్వాగతం..

10:50 AM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రి..

10:39 AM

నోయిడాలో ఆస్పత్రి వద్ద బాంబు కలకలం..

10:30 AM

దేశంలో కొత్తగా 14వేల పాజిటివ్ కేసులు నమోదు..

10:02 AM

తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్..

09:51 AM

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

09:37 AM

దేశంలో కరోనా కట్టడి చేయలేకపోయాడని.. ప్రధాని రాజీనామా

09:25 AM

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ఉతప్ప

09:15 AM

టాలీవుడ్ యంగ్ హీరోకు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.