Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఇలాగైతే విద్యాప్రగతి ఎలా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

ఇలాగైతే విద్యాప్రగతి ఎలా?

- అందనిద్రాక్షలా నాణ్యమైన చదువు
- సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత
- వెక్కిరిస్తున్న ఉపాధ్యాయ ఖాళీలు
- 6.76 శాతం నిధులు కేటాయించిన టీఆర్‌ఎస్‌ సర్కారు
- మోడల్‌ విద్యను అందిస్తున్న ఢిల్లీ ప్రభుత్వం
- విద్యారంగానికి ఏకంగా 26 శాతం ఖర్చు
- వైద్యరంగానికీ పెద్దపీట వేస్తున్న ఆప్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఢిల్లీలో విద్యా,వైద్య రంగాలకు ఆప్‌ ప్రభుత్వం పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలు కల్పించడం, అవసరమైన నిధులు కేటాయించడం, పర్యవేక్షణ మెరుగుపర్చడం, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం వల్ల ఢిల్లీలో విద్యాభివృద్ధి దేశానికే తలమానికంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్లతో ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇందులో విద్యారంగానికి రూ.15,601 (26 శాతం) కోట్లు కేటాయించింది. ఇక వైద్యరంగానికి రూ.7,485 (12.47 శాతం) నిధులు ప్రతిపాదించింది. విద్యావైద్య రంగాలకే బడ్జెట్‌లో 38.47 శాతం నిధులు కేటాయించారు. అంటే మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధి చేసి చూపడంలో ఆప్‌ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. అందుకే అక్కడి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ స్కూళ్లను తలపిస్తున్నాయి. ఇక సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన ఆతిషి మారలెనాను విద్యారంగ సలహాదారుగా నియమించింది. హ్యాపినెస్‌ అంశాల బోధనను ప్రవేశపెట్టింది. 8 వేల తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీలు, ఆప్‌ ప్రతినిధులు విద్యాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. దీంతో ఢిల్లీలో విద్యారంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సర్కారు బడుల్లో సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత 91 శాతం ఉంటే, ప్రయివేటు పాఠశాలల్లో 83 శాతమే నమోదు కావడం గమనార్హం. ఇది ఢిల్లీ ప్రజలపై బలమైన ముద్ర వేసింది. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించడానికి దోహదపడింది.
ఏటా తగ్గుతున్న విద్యారంగ కేటాయింపులు
తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. విద్యారంగానికి కేటాయిం పులు ఏటా తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇంకోవైపు సర్కారు బడుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉన్నది. ఇక ఉపాధ్యాయ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. 20 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తున్నది. నాణ్యమైన విద్య అందడం లేదని అనేక సర్వేలు, స్వచ్చంధ సంస్థల నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. అన్ని రంగాల్లో ముందున్న తెలంగాణ, అక్షరాస్యతలో మాత్రం వెనుకంజలో ఉన్నామనీ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అక్షరాస్యత పెంపు, విద్యాప్రగతికి సరిపోయినన్ని నిధులు మాత్రం కేటాయిం చడం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చి ఆరేండ్లయినా విద్యావిధానం ప్రకటించకపోవడం గమనార్హం. కేజీ టు పీజీ ఉచిత విద్య అని ప్రకటించినా అది గురుకుల విద్యాలయాలకే పరిమితమైంది. ప్రస్తుత బడ్జెట్‌లో విద్యారంగానికి 6.76 శాతం నిధులు మాత్రమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేటాయించింది. మొత్తం రూ.1,46,492 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.9,899.79 (6.76 శాతం) కోట్లే ప్రతిపాదించింది. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,74,453 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.13,278 (7.61 శాతం) కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాదిలో రూ.2,923.72 కోట్లు తగ్గించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో రూ.1,00,637 కోట్లకుగాను విద్యారంగానికి రూ.10,956 (10.88 శాతం) కోట్లు కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత బడ్జెట్‌లో 4.12 శాతం నిధులకు కోత విధించింది. ఇలాగైతే విద్యాప్రగతి తెలంగాణలో ఎలా సాధ్యమవుతుం దన్న ప్రశ్న తలెత్తుతున్నది. విద్యాభివృద్ధి, నిధుల కేటాయింపు, అక్షరాస్యతలో దేశానికే కేరళ ఆదర్శంగా ఉన్నది. అటు ఢిల్లీ, ఇటు కేరళ ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకొని అధిక నిధులు కేటాయించి విద్యారంగాన్ని ప్రగతిబాట పట్టించాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
వైద్యరంగంపై నిర్లక్ష్యం
వైద్యరంగం అభివృద్ధి పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రస్తుత బడ్జెట్‌లో వైద్యరంగానికి అరకొర నిధులు కేటాయించింది. 2019-20 బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.5,694.17 (3.89 శాతం) కోట్లు ప్రతిపాదించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.7,357 (4.21 శాతం) కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇప్పుడు రూ.1,663 కోట్లు తగ్గించింది. 2014-15 బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.4,062 (4.04 శాతం) కోట్లు ప్రతిపాదించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏటా నిధులు తగ్గిస్తున్నది. ఇంకోవైపు జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులను సూపర్‌స్పెషాలిటీ స్థాయికి ఆధునీకరిస్తామని ఇచ్చిన హామీ ఇంకా పట్టాలెక్కలేదు. అదే ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌ల పేరుతో పేదలకు ఆధునిక వైద్యాన్ని అందించేందుకు ఆప్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్యరంగంలో మెరుగైన వసతులు కల్పించడం వల్లే ఆప్‌ ప్రభుత్వానికి ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. అదే తరహాలో తెలంగాణలో వైద్యరంగానికి నిధులు పెంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతువులు మెరుగుపర్చాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

షరతులు... ఆంక్షల నడుమ..హైదరాబాద్‌ లో భారీ ప్రదర్శన
నల్ల చట్టాలు రద్దు చేయకపోతే...మోడీతోపాటు కేసీఆర్‌ను బొంద పెడతారు
దేశానికే తెలంగాణ ఆదర్శం
రాజ్యాంగ పరిరక్షణే ముందున్న సవాల్‌
ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌
హైకోర్టులో గణతంత్ర వేడుకలు
ఇంటి వద్దకే డయాలసిస్‌ సేవలు
ఒకదానికి బదులు మరో ఇంజక్షన్‌.. బాలుడు మృతి
రోడ్డెక్కిన రైతులు
ఇఫ్లూలో స్టూడెంట్స్‌ను అడ్డుకున్న అధికారులు
సైకో కిల్లర్‌ అరెస్ట్‌
ఇది మరిచిపోని రోజు
కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ల ప్రతినిధి
మతస్వేచ్ఛ పేరుతో.... మహిళా హక్కులకు ఇబ్బందులు : ప్రొఫెసర్‌ పద్మజా షా
కేటీపీఎస్‌ ఏడవ దశలో తప్పిన ప్రాణనష్టం
తరగతికి 30 మంది... బెంచికి ఒకరే
రైతులపై నిర్బంధాన్ని ఆపాలి
అడవి పందులను చంపించే అధికారం సర్పంచ్‌లకు
రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం అమానుషం : టి.సాగర్‌
దేశంలోనే అగ్రగామిగా విజయ డెయిరీ
టీఆర్‌ఎస్‌ అవినీతిపై పార్లమెంటులో ప్రస్తావన :కాంగ్రెస్‌ ఎంపీలు
పనుల్లో వేగం పెంచండి
0.64 శాతం మందికి కరోనా
నేడు డీఈవోలతో విద్యామంత్రి సమావేశం
విద్యాశాఖలో అన్ని క్యాడర్లకూ పద్నోతులివ్వాలి : జీటీఏ
ఇక తిరుగుబాటే..
బీజేపీ విధానాలతో సంక్షోభంలో రవాణారంగం
19 నెలలుగా ఒక్కపైసా రాలే
రాజ్యాంగంపై దాడి..
నాలుగు వేళ్లు నోట్లోకెళ్లాలంటే..

తాజా వార్తలు

08:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

08:19 AM

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్

08:08 AM

గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి

08:04 AM

ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు

07:50 AM

సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్

07:40 AM

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

07:23 AM

నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న

07:07 AM

నేడు జైలు నుంచి విడుదల కానున్న శశికళ

07:03 AM

వనస్థలిపురంలోని అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

06:56 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న‌ వైద్యు‌రాలికి అస్వ‌స్థ‌త‌

06:46 AM

ఏకగ్రీవాలకు భారీ నజరానా

06:39 AM

విమానాల రాకపోకలపై బ్రెజిల్ నిషేధం

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

06:05 PM

మహిళల ఉపాధికి కొత్త పథకం...

05:44 PM

అమిత్‌ షా అత్యవసర భేటీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.