Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 14,2020

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి

- అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
బడ్జెట్‌లో కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయని అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఈ నిధులను ప్రత్యేక నోడల్‌ అధికారి ద్వారా ఖర్చు చేయించాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దళిత బహుజన రీసోర్స్‌ సెంటర్‌ ఎస్సీ, ఎస్టీ బడ్జెట్‌ మానిటరింగ్‌ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో గురు వారం 'ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధికి నిధుల కేటాయింపు -ఖర్చులపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం' నిర్వహించా రు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు కేటా యించిన నిధులు ఖర్చు చేసి ఉంటే 50శాతం మంది దారిద్య్రరేఖ నుంచి ఎగువకు వెళ్లేవారన్నారు. రూ.1.80 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్‌ను కేసీఆర్‌ ఆర్థిక మాంద్యం పేరుతో రూ.1.43 లక్షల కోట్లకు తగ్గించారనీ, మాంద్యం 2008 నుంచి వస్తున్నదనీ, ఇది సీఎంకు తెలియదా? అని ప్రశ్నించారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఎస్సీ, ఎస్టీలకు 15శాతం వైద్యం ఉచితంగా అందించాలని ఉన్నా అలా జరగడం లేదన్నారు. అందు బాటులో ఉన్న భూమిని చూపిస్తాం దళితులకు పంపిణీ చేస్తావా అని ప్రశ్నించారు. 2.5 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 60వేల ఇండ్లు మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయని గుర్తు చేశారు.
చట్టం అమలు కావడం లేదు :
విశ్రాంత ఐఏఎస్‌ అధికారి గోపాల్‌రావు
చట్టం వస్తే ప్రభుత్వాలకు బాధ్యత పెరుగుతుందనీ, ఆ చట్టాన్ని అమలు చేస్తాయనుకుంటే అదీ జరగడం లేదని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి గోపాల్‌రావు అన్నారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 40-50శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. ప్రజా ఉద్యమం, న్యాయ పోరా టాల ద్వారానే చట్టాలు అమలవుతాయని చెప్పారు. బడ్జెట్‌ కంటే ముందే చలో అసెంబ్లీ చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, అసెంబ్లీలో ప్రశ్నించేవారే కరువయ్యారని తెలిపారు. సబ్‌ప్లాన్‌ నిధుల మళ్లింపుపై హైకోర్టులో పిల్‌ చేయాలని సూచించారు.
హిమాన్షు సీఎం అయినా మూడెకరాల
భూ పంపిణీ కాదు : స్కైలాబ్‌ బాబు
మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు సీఎం అయినా దళితులకు మూడెకరాల భూపంపిణీ జరగదని కేవీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. దళితుడే సీఎం, మూడెకరాల భూమి పంపిణీ, సంక్షేమం కోసం ఏటా రూ.10వేల కోట్లు కేటాయిస్తాం లాంటి హామీలివ్వడంతో దళితులు కేసీఆర్‌ వైపు మొగ్గు చూపారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుడే సీఎం, నేను కాపలా కుక్కలా ఉంటా అన్న కేసీఆర్‌ నేడు సీఎం సీటులో కూర్చుంటే దళితులు కాపలాదార్లుగా మారారని విమర్శించారు. భూ పంపిణీ కోసం పోరాటం తప్పదనీ, ముందుగా ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించాలని పిలుపునిచ్చారు.
సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు చేయడం లేదు : భాస్కర్‌
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను వారి కోసం ఖర్చు చేయడం లేదని కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తు న్నారని విమర్శించారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో భూ పంపిణీ చేయడం లేదన్నారు. అధికారులందరూ కేసీఆర్‌ జీతగాళ్లని, అందుకే ఎవరూ ఎదిరించడం లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై సర్కార్‌ నిర్లక్ష్యం : నాగేశ్వరరావు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తున్నదని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. ఊకడదంపుడు ఉపస్యాసాలే తప్ప కేసీఆర్‌ వీరికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థతి దారుణంగా తయారైందన్నారు.
చట్టాల అమలు కోసం పోరాటం చేయాలి : ఝాన్సీ
చట్టాల అమలు కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు ఝాన్నీ అన్నారు. చట్టం అమలులో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. బడ్జెట్‌ కేటాయింపులో 50శాతం నిధులను భూముల కొనుగోలుకు ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

షరతులు... ఆంక్షల నడుమ..హైదరాబాద్‌ లో భారీ ప్రదర్శన
నల్ల చట్టాలు రద్దు చేయకపోతే...మోడీతోపాటు కేసీఆర్‌ను బొంద పెడతారు
దేశానికే తెలంగాణ ఆదర్శం
రాజ్యాంగ పరిరక్షణే ముందున్న సవాల్‌
ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ సస్పెన్షన్‌
హైకోర్టులో గణతంత్ర వేడుకలు
ఇంటి వద్దకే డయాలసిస్‌ సేవలు
ఒకదానికి బదులు మరో ఇంజక్షన్‌.. బాలుడు మృతి
రోడ్డెక్కిన రైతులు
ఇఫ్లూలో స్టూడెంట్స్‌ను అడ్డుకున్న అధికారులు
సైకో కిల్లర్‌ అరెస్ట్‌
ఇది మరిచిపోని రోజు
కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్ల ప్రతినిధి
మతస్వేచ్ఛ పేరుతో.... మహిళా హక్కులకు ఇబ్బందులు : ప్రొఫెసర్‌ పద్మజా షా
కేటీపీఎస్‌ ఏడవ దశలో తప్పిన ప్రాణనష్టం
తరగతికి 30 మంది... బెంచికి ఒకరే
రైతులపై నిర్బంధాన్ని ఆపాలి
అడవి పందులను చంపించే అధికారం సర్పంచ్‌లకు
రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగం అమానుషం : టి.సాగర్‌
దేశంలోనే అగ్రగామిగా విజయ డెయిరీ
టీఆర్‌ఎస్‌ అవినీతిపై పార్లమెంటులో ప్రస్తావన :కాంగ్రెస్‌ ఎంపీలు
పనుల్లో వేగం పెంచండి
0.64 శాతం మందికి కరోనా
నేడు డీఈవోలతో విద్యామంత్రి సమావేశం
విద్యాశాఖలో అన్ని క్యాడర్లకూ పద్నోతులివ్వాలి : జీటీఏ
ఇక తిరుగుబాటే..
బీజేపీ విధానాలతో సంక్షోభంలో రవాణారంగం
19 నెలలుగా ఒక్కపైసా రాలే
రాజ్యాంగంపై దాడి..
నాలుగు వేళ్లు నోట్లోకెళ్లాలంటే..

తాజా వార్తలు

09:01 AM

యువకుడి మర్మాంగంపై కత్తి, రాడ్‌తో దాడి చేసి..!

08:44 AM

నేడు గవర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ

08:29 AM

ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి

08:19 AM

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి బంపర్ ఆఫర్

08:08 AM

గొర్రెల డీసీఎం వ్యాన్‌ బోల్తా..70 గొర్రెలు మృతి

08:04 AM

ఫోన్ కోసం తండ్రిని కొట్టి చంపిన కూతురు

07:50 AM

సంగారెడ్డికి మెట్రోరైలు విస్తరించేలా కృషి చేయాలి : కాంగ్రెస్

07:40 AM

ఏపీలో ఇద్దరు కలెక్టర్ల బదిలీకి సీఎస్‌ ఉత్తర్వులు

07:23 AM

నాంపల్లిలో తమ్ముడ్ని వెంటాడి మరీ చంపిన అన్న

07:07 AM

నేడు జైలు నుంచి విడుదల కానున్న శశికళ

07:03 AM

వనస్థలిపురంలోని అపార్టుమెంటులో అగ్నిప్రమాదం

06:56 AM

క‌రోనా వ్యా‌క్సి‌న్ తీసుకున్న‌ వైద్యు‌రాలికి అస్వ‌స్థ‌త‌

06:46 AM

ఏకగ్రీవాలకు భారీ నజరానా

06:39 AM

విమానాల రాకపోకలపై బ్రెజిల్ నిషేధం

10:01 PM

కోహ్లీయే నా కెప్టెన్ : రహానే

09:48 PM

టీడీపీ మాజీ మహిళ ఎమ్మెల్యే కన్నుమూత

09:24 PM

డిజిటల్ నగదు యోచనలో ఆర్బీఐ

09:11 PM

పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం.. కార్మికులకు గాయాలు

09:01 PM

భూ తగాదాల దాడిలో ఒకరి మృతి

08:56 PM

ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో..ఎందుకో

08:35 PM

దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగం ధ్వంసం: బృందా కారత్

08:11 PM

వింత గొర్రె జననం..

08:04 PM

ఏపీలో 172 పాజిటివ్‌ కేసులు

07:59 PM

ఎప్పుడో చెప్పకపోతే.. లీక్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా..

07:39 PM

భార్య లేచిపోయిందనే కోపంతో ఏకంగా 17 మందిని..

07:14 PM

గోల్నాకలో ఉరివేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య

06:57 PM

కరోనాతో రక్షణ మంత్రి మృతి

06:42 PM

పద్మజ, పురుషోత్తంనాయుడులకు 14 రోజుల రిమాండ్

06:31 PM

రైతులపై దాడికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రేవంత్‌రెడ్డి

06:21 PM

రైతులపై నిర్బంధాన్ని ఆపాలి - రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.