Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆర్మీని దించే పరిస్థితి తేవొద్దు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 25,2020

ఆర్మీని దించే పరిస్థితి తేవొద్దు

-షూట్‌ఎట్‌ సైట్‌ ఆర్డర్‌కు అవకాశమివ్వొద్దు
-ఇష్టమొచ్చినట్టు రోడ్లమీదికి రావొద్దు
- అత్యవసరమైతే 100కి డయల్‌ చేయండి
- నిత్యావసరాలు అధికరేట్లకు అమ్మితే పీడీ యాక్ట్‌
- ప్రజాప్రతినిధులూ మీకు పట్టదా?
- రేపట్నుంచి బియ్యం.. ఖాతాలోకి రూ.1500 : ముఖ్యమంత్రి కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'కరోనా నివారణలో మనం ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాం. ప్రజలెవ్వరూ ఇష్టమొచ్చినట్టు రోడ్లమీదకి రావొద్దు. అమెరికాలోలాగా ఆర్మీని దించే పరిస్థితి మన రాష్ట్రంలో తేవొద్దు. ప్రజలు సహకరించకుంటే కర్ఫ్యూ విధిస్తాం. షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్‌కు అవకాశం ఇవ్వొద్దు. అత్యవసరమైతే 100కి డయల్‌ చేయండి. చావులు, వైద్యసేవలకు ప్రభుత్వమే వాహనాలను సిద్ధం చేస్తుంది' అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. వాహనాలను తిప్పడం ఆపకపోతే పెట్రోల్‌ బంక్‌లు బంద్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులందరూ పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ లాక్‌డౌన్‌లో ఎక్కడికక్కడ చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం అత్యవసర, అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఇప్పటివరకూ 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయనీ, వీరిలో ఒకరి చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారని తెలిపారు. మిగతావారందరూ కోలుకుంటున్నారనీ, ఎవ్వరికీ ప్రాణహాని లేదని చెప్పారు. ఏప్రిల్‌ ఏడో తేదీ నాటికి మిగతా వారందరూ డిశ్చార్జి అయ్యే అవకాశంఉందన్నారు. కరోనా సోకని దేశమంటూ లేదనీ, ఇప్పటికే దాదాపు 195 దేశాలకు వ్యాప్తి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఇక్కడకు వచ్చిన 19,313 మందిపై నిఘా ఉంచామన్నారు. వారందరి పాస్‌పోర్టులను సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. నిర్మల్‌కు చెందిన ఒక వ్యక్తి మూడు సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారనీ, అందువల్ల అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటివరకూ 114 మందిని కరోనా అనుమానితులుగా గుర్తించామన్నారు. వీరిలో 87 మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నారనీ, వీరు కాక 37 మంది స్థానిక వ్యక్తులకు సోకినట్టు గుర్తించామని వివరించారు. వారందరి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపామని త్వరలోనే నిర్ధారణ రిపోర్టులు వస్తాయన్నారు. ఈ వ్యాధి ఒక దేశానికో? రాష్ట్రానికో పరిమితం కాబోదనే విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఉన్నామనీ, అప్రమత్తతే దీనికి నివారణ అని నొక్కి చెప్పారు. ''అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. మనమందరం అప్రమత్తంగా ఉందాం. ప్రభుత్వం వైద్యాధికారులు ఇచ్చే సూచనలు పాటిద్దాం. అమెరికాలో స్థానిక పోలీసులు పౌరులను కట్టడి చేయలేకపోతే ఆర్మీ రంగంలోకి దిగింది. మన దగ్గర కూడా అదే పరిస్థితి తలెత్తితే 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది. ఈ రోజు నుంచే రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దయచేసి షఉట్‌ అండ్‌ ఆర్డర్‌ పరిస్థితిని రానివ్వొద్దు. రష్యాలో అధ్యక్షులు 'ఉంటే ఇండ్లల్లో ఉండండి..లేదంటే ఐదేండ్ల పాటు జైళ్లలో ఉండండి' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ పరిస్థితే ఇక్కడ తలెత్తే విధంగా చేద్దామా? దయచేసి అందరూ సిన్సీయర్‌గా గవర్నమెంట్‌ రూల్స్‌ పాటించండి' అని సీఎం విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి బియ్యాన్ని అందజేస్తామనీ, అకౌంట్లలో రూ.1500 జమచేస్తామని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో కూరగాయల, నిత్యావసర ధరలను విపరీ తంగా పెంచడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. అలాంటి చర్యలకు పాల్ప డితే దుకాణాదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామనీ, దుకాణాలను సీజ్‌ చేస్తామనీ, లైసెన్స్‌లు రద్దుచేస్తామనీ, జీవితంలో షాపులు పెట్టుకోకుండా బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులందరూ యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాలనీ, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఆదేశించారు. సర్పంచ్‌లు గ్రామాలకు కథానాయకులుగా మారాలన్నారు. వైద్యులు, పోలీసులు, మున్సిపల్‌, రవాణా శాఖ అధికారులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఏవిధంగా ఉంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొం దన్నారు. కరోనా అనుమానితులు, విదేశాల నుంచి వచ్చిన వాళ్లు సహకరిం చాలని కోరారు. గ్రామాల్లో, పట్టణాల్లో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. హైదరాబాద్‌ నగరంలోనే పరిస్థితి ...పోలీసులు అదుపులో లేదనీ, అసలు 150 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వెంటనే వారు పోలీసులు, అధికారులతో కలిసి చెక్‌పోస్టుల వద్ద నిఘా బృందాలతో కలిసి పనిచేయాలని ఆదేశించారు. రాచకొండ, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిష నరేట్ల పరిధిలోని ప్రజాప్రతినిధులందరూ పోలీసులు, వైద్యాధికారులు, మీడి యాకు సహకరించాలని కోరారు. ఇదే సమయంలో ప్రభుత్వమే మీడియాకు అనుమతి ఇచ్చిందనీ, ఈ విషయాన్నిడీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు అంద రూ గుర్తించి మీడియాకు సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫిట్‌ మెంట్‌ 7.5 శాతం
అప్పుల బాధతో ముగ్గురు రైతుల మృతి
రైతుల పక్షమా.. కార్పొరేట్ల పక్షమా..
లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరు
పల్లెల అభివృద్ధికి ఫ్రీజింగ్‌
వంటి మామిడి మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌
రైతులకు అండగా నిలుద్దాం
సాగు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
పీఆర్సీ నివేదిక చెత్తబుట్టలో వేస్తున్నాం...
మాకొద్దీ పీఆర్సీ ...
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి
కుబేరులకు దోచిపెడుతున్న కేంద్రం
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
మహిళా సిబ్బంది పనితీరు భేష్‌
వికలాంగుల చట్టాల అమలుకు ఉద్యమం
వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్ల స్కేలు ఇవ్వాలి
ఐదో అంతస్తు నిర్మాణం అనుమతి కోసం చర్యలేం తీసుకున్నారో చెప్పండి
నింబోలి అడ్డా హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన పడొద్దు
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మిస్తాం- మంత్రులు
ఏఎంఆర్‌పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి
ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా : బండి
ప్రభుత్వ కనుసన్నల్లోనే పీఆర్సీ నివేదిక : చాడ
క్యారెక్టర్‌ లేని జగదీశ్‌ రెడ్డి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవో 34 అమలుకు గడువు కావాలి
ఆర్టీసీ రక్షణకు నిధులు కేటాయించండి
తిరోగమన దిశలో పీఆర్సీ రిపోర్టు..పోరుబాటే కరెక్టు : సీఐటీయూ

తాజా వార్తలు

05:43 PM

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

05:24 PM

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రామ్ చరణ్ భార్య

05:09 PM

బెడ్లు ఖాళీ లేవని కరోనా పేషెంట్లను చంపిన డాక్టర్‌..!

05:04 PM

విద్యార్ధులకు ఫెలోషిప్స్ అందించాలని మంత్రి సబితాకి ఎస్ఎఫ్ఐ వినతిపత్రం

04:45 PM

నిరుద్యోగులకు కేటీఆర్‌ శుభవార్త

04:16 PM

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

03:57 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోడలికి ఉత్తమ పోలీసు సేవా పతకం

03:40 PM

ఇంజినీరింగ్‌ విద్యార్థి సజీవ దహనం

03:12 PM

ఘోర రోడ్డు ప్రమాదం..53మంది దుర్మరణం

02:50 PM

విద్యార్థి పిటిషన్‌.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

02:42 PM

రేపు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని బ‌హిష్క‌రిస్తున్నాం : ఆజాద్‌

02:27 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు కిలోల శిశువు జననం

02:01 PM

విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు నోటీసులు

01:47 PM

చేపల లోడ్ లారీ బోల్తా.. చేపల కోసం పరుగులు పెట్టిన జనం

01:37 PM

తెలంగాణలో చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ..

01:28 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..

01:19 PM

స్థానిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు..

01:08 PM

ఒలింపిక్స్ రద్దు చేసే ఆలోచన లేదు : థామస్ బాక్

12:53 PM

సాగు చ‌ట్టాలు రైతులకు ఇంకా అర్థంకాలేదు: రాహుల్ గాంధీ

12:52 PM

రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు..

12:38 PM

క్రికెటర్ శిఖర్ ధావన్ పై కోర్టులో చార్జీ షీట్ దాఖలు..

12:27 PM

స్కూల్స్ ఓపెన్.. మాస్కులు, శానిటైజర్లు అందజేసిన తలసాని..

12:18 PM

రైలు కింద పడి ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య..

12:08 PM

జేడీఎస్ సీనియర్ నేత మనగూళి కన్నుమూత

12:00 PM

దేశంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..

11:48 AM

మద్యం మత్తులో కోయిలమ్మ సీరియల్ హీరో హల్ చల్..

11:35 AM

తెలంగాణలో కొత్తగా మరో 186 పాజిటివ్ కేసులు

11:25 AM

రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడికి షాక్..

11:14 AM

ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..

11:00 AM

కరెంట్ పోల్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.