Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మారిపోతుందోరు కాలం మారిపోతోందీ'' అంటూ మన కళాకారులు పాడుకుంటూ ఉంటారు. నిజమే మరి.. కాలం మారిపోవడమంటే ప్రకృతిలో, సమాజంలో ప్రతిదీ మారిపోతూ ఉంటుందని అర్థం. పదార్థ భౌ తిక చలనాల కారణంగా ఆలోచ నలు కూడా మారుతాయి. మా ర్పు ఎల్లప్పుడూ జరుగుతూ ఉం టుందని చాలాసార్లు చెప్పుకు న్నాం. కొన్ని త్వరగా మారతాయి. మరికొన్ని ఆలస్యంగా మారతాయి. వడ్ల గింజ మూడునాలుగు రోజుల్లో మొక్కగా మారుతుంది. కోడి గుడ్డు పిల్లగా మారటానికి మూడు వారాలు పడుతుంది. మానవ పిండం తొమ్మిది నెలలకు మారుతుంది. భూమి లక్షల సంవత్సరాలు తీసుకుంటుంది. ఖండాలు, సముద్రాలు, గ్రహాలు కూ డా మారతాయి. అదేవిధంగా సమాజమూ మారుతుంది. బానిసలు పోయారు. రాజ్యాలు పోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. కాబట్టి ప్రతి దాంట్లో మార్పు తథ్యం. అయితే ఈమార్పు ఎందుకు జరుగుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మౌలికమైనది కూడా. ప్రకృతి, సమాజం మన ఆలోచనలు నిరంతరం చలనంలో ఉంటూ మార్పుకు ఎలా లోనవుతాయో వాటి కారణాలు ఏంటో గతితార్కిక నియ మాలు అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఈ ప్రపంచ గతినీ స్థితినీ అర్థం చేసుకోవ డానికి చైతన్యయుతంగాకలుగజేసుకోవటానికి గతితార్కికనియమాలే మనకు సాధ నాలు. అవేమిటంటే ఒకటి విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ నియమం. రెండో ది పరిణామాత్మక మార్పునుండి గుణాత్మకమార్పుకూ గుణాత్మక మార్పు నుండి ప రిమాణాత్మక మార్పుకూ జరిగే పరివర్తన. మూడోది అభావం అభావం చెందటం.
అయితే మూడింటిలో ముఖ్యమైనది వైరుధ్య నియమం. ఇది గతితర్కం యొ క్క అంతస్సారం. ప్రతి వస్తువులోనూ జీవిలోనూ పరస్పర విరుద్ధ శక్తులున్నవి. అవి విడదీయరానివిగా, విభజన చేయవీలు లేకుండా ఉన్నవి. అవి నిరంతరం ఘర్షి స్తూ ఉంటాయనీ దాని ఫలితంగానే చలనం, మార్పు కలుగుతున్నదనీ గతితార్కిక సూత్రంతెలుపుతున్నది. అందుకనే గతితార్కికసూత్రాల్లో ఈ వైరుధ్య నియమం ప్ర ధానమైనది. ఈసారి ఈ వైరుధ్యాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
వైరుధ్యమంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఒకటిగా కనిపించేది ప్రతి ఒక్కటీ నిజానికి రెండు విరుద్ధాంశాల కలయిక. పరమాణువు ఒకటే అనుకుంటాం. అందు లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. విద్యుత్లో ధన విద్యుత్తు, రుణ విద్యుత్తు. అలాగే మన శ్వాసలో ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసాలు. హృదయస్పందనలోనూ సంకోచం, వ్యాకోచం. నడకలోనూ చలనం, నిశ్చలనాలు. గ్రహాల మధ్య ఆకర్షణ, వికర్షణ. వ్యక్తిత్వంలో మంచి, చెడ్డా. రోజులో పగలూ రాత్రి. కొలతలో పొడవు, వెడల్పు. లెక్కల్లో కూడిక, తీసివేత. వెలుగు, చీకటి. స్త్రీ, పురుషుడు. సమాజంలోనైతే భూస్వాములు, కౌలు రైతులు. పెట్టుబడిదారులు, కార్మికులు. యుద్ధం, శాంతి. సామ్రాజ్యవాదం, వలసలు. విమర్శ, ఆత్మ విమర్శ. నలుపు, తెలుపు. జననం, మరణం. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. అన్నీ రెండు విరుద్ధాంశాలతోనే ఉంటాయి.
ఈ రెండు విరుద్ధాంశాలూ ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధమైనవి. ఒకటి, ఇం కొకదాన్ని నిరాకరించుకుంటుంది. ఒకదాని స్థానంలోకి ఒకటి రావడానికి నిరంత రం ఘర్షణ పడుతుంది. అలా వాటి స్థానాలనూ మార్చుకుంటాయి. ఇదే సందర్భ ంలో ఆరెండు విరుద్ధాంశాలుఒకేక్రమంలో, వస్తువులో కలిసిసహజీవనం చేస్తుంటా యి. అంతేకాదు. ఒకదాని అస్తిత్వంతో మరొకదాని అస్థిత్వం ముడిపడి ఉంటుంది. విరుద్ధాంశాలు విడిగా ఉండవు. ఒకటి ఉంటేనే మరోటి ఉంటుంది. ఈ విరుద్ధాం శాల మధ్య ఘర్షణ, ఐక్యతనే వైరుధ్యమని అంటాము. కాబట్టి ఈ ప్రపంచమంతా వైరుధ్యాల పుట్ట అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వైరుధ్యాల మధ్య ఘర్షణ అంటే ఏమిటి? ఐక్యత అంటే ఎలా ఉంటుంది? పరస్పరం నిరాకరించుకునేవి ఐక్యంగా ఎలా ఉంటాయి? ఐక్యత, ఘర్షణలో అభివృద్ధిని నిర్ణయించేది ఏది? మొదలైన విషయాలను మనం అవగాహన చేసుకోవాలి.
ముందుగా ఐక్యత గురించి చూద్దాం. రెండు విరుద్ధాంశాలు వాటివాటి మనుగడ కోసం సహనివాసం చేస్తాయి. అంటే కలసి ఉంటాయి. ఒకటి ఇంకొక దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకటి లేకుండా ఇంకోటి మనలేదు. ఒకటి పోతే రెండోదీ పోతుంది. ఉదాహరణకు శ్వాసక్రియను తీసుకోండి. గాలి పీల్చడం, గాలి వదలడం ఈ రెండూ జరిగితేనే ప్రాణం ఉంటుంది. శ్వాస క్రియ ఉన్నదీ అంటే రెండూ జరుగుతున్నాయని అర్థం. ఇందులో పీల్చుకోవడం లేకపోతే వదలడం అనేదే ఉండదు. అయస్కాంతం తీసుకోండి. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం రెండూ ఉంటాయి. దాన్ని ముక్కలు చేయండి. ప్రతి ముక్కకూ ఉత్తర, దక్షిణ ధృవాలు ఉంటాయి. అంటే అయస్కాంతం ఉన్నంత కాలం ఈ ఉత్తర దక్షిణ ధృవాలుంటాయి. ఇవి లేకపోతే అది అయస్కాంతంగానే ఉండదు.
అలాగే సమాజంలోని ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడిదారుడు, కార్మికుడు రెం డు విరుద్ధాంశాలు. పెట్టుబడిదారుడున్నంత కాలం అదనపు విలువ దోపిడీకి గుర య్యే కార్మికుడూఉంటాడు. వేతన కార్మికుడున్నాడంటే పెట్టుబడిదారుడున్నాడనే అ ర్థం. ఈ రెండు విరుద్ధాంశాలు రద్దవడమంటే ఆ పెట్టుబడిదారీ ఉత్పత్తి రద్దవడం.
విరుద్ధాంశాల మధ్య ఐక్యత అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడుతూనే, ఒకటి ఇంకొకదానిగా రూపాంతరం చెందడమూ ఉంటుంది. రెండు అంశాలు ఒకే ఒక ఎంటిటీలో ఉంటూనే ఒకానొక పరిస్థితిలో ఒకటి ఇంకొకదానిగా రూపాంతరం చె ందుతాయి. ఐక్యత అంటే అర్థం ఇదే. ఉదాహరణకు శ్వాస ప్రక్రియలో ఉచ్ఛాస స్థా నాన్ని నిచ్ఛ్వాసం, నిచ్ఛ్వాస స్థానాన్ని ఉచ్ఛ్వాసం ఆక్రమించుకుంటాయి. ఆ స్థానాల మార్పిడిశ్వాస కొనసాగినంతకాలం ఉంటుంది. పెట్టుబడిదారులు, కార్మికులు విరు ద్ధాంశాలు. శ్వాస ప్రక్రియలోలాగా క్షణక్షణమూ వారి స్థానాల్లో మార్పు రాకపోయి నా స్థానాలమార్పిడి జరుగుతుంది. సామ్యవాద వ్యవస్థలో ఇప్పుడు పాలన వర్గంగా ఉన్న పెట్టుబడిదారీ వర్గం పాలించబడే వర్గంగా మారుతుంది. నేడు పాలించబడే కార్మికవర్గం పాలకవర్గంగా మారుతుంది. కాబట్టి విరుద్ధాంశాలు ఒకదానిపైన ఒక టి ఆధారపడడమే కాదు. అసలు ముఖ్యమైనదేమంటే అవి పరస్పరం రూపాంత రం చెందడం. అంటే కొన్ని పరిస్థితుల్లో ఒక వస్తువులోని రెండు విరుద్ధాంశాలు వ్య తిరేకాంశం స్థానంలోకి మారుతాయి. వైరుధ్యం యొక్క ఐక్యతకు పూర్తి అర్థం ఇదే. విరుద్ధాంశాలు ఐక్యంగా ఉండడమంటే ఒక విరుద్ధాంశం లేకుండా మరోటి ఉండ దు. ఏ ఒక్కటీ స్వతంత్రంగా ఉనికిలోనే ఉండదు. ప్రాణమే లేకపోతే చావనేదే ఉండదు. చావు లేకపోతే ప్రాణముండదు. దురదృష్టం లేనిదే అదృష్టం ఉండదు. అసౌకర్యం లేకుండా సౌకర్యం లేదు. కష్టం లేనిదే సుఖం ఉండదు. భూస్వాములు లేకపోతే కౌలుదార్లు ఉండరు. కౌలుదార్లు లేకపోతే భూస్వాములుండరు. బూర్జువాలు లేకపోతే కార్మికవ్గం ఉండదు. కార్మికవ్గం లేకపోతే బూర్జువాలు ఉండరు. ఇదే విరుద్ధాంశాల మధ్య ఉండే ఐక్యత. నిర్థిష్ట పరిస్థితుల్లో అవి ఒక వంక పరస్పరం వ్యతిరేకిస్తాయి. మరోవంక సంబంధం కలిగి ఉంటాయి. పరస్పరం ప్రవేశిస్తాయి. వ్యాపిస్తాయి. ఆధారపడతాయి. ఈ లక్షణాన్నే ఐక్యత అంటాము.
ఇక ఘర్షణను గురించి చూద్దాం. రెండు విరుద్ధాంశాలంటేనే వాటి మధ్య ఘ ర్షణ ఉన్నదని అర్థం. ఈ రెండు విరుద్ధాంశాలు ఒకదాని స్థానాన్ని మరొకటి ఆక్రమి ంచటం కోసమై నిరంతరం పెనుగులాడుతుంటాయి. ఒకదాన్ని మరొకటి నిరాకరి ంచుకుంటాయి. దీన్ని ఘర్షణ అంటాము. పెట్టుబడిదారులు, కార్మికుల ప్రయోజ నాలు పరస్పర విరుద్ధమైనవి. పెట్టుబడిదారునికి లాభాలు పెరగడమంటే కార్మికు నిపై అదనపు విలువ దోపిడీ భారం పెరగడమని అర్థం. కార్మికుని వేతనం పెరగ డమంటే ఆ మేరకు పెట్టుబడిదారుడు దోచుకునేది తగ్గడమని అర్థం. ఈ విరుద్ధాం శాలు పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య ఘర్షణ.. అంటే వర్గ పోరాటం. ఈ వర్గ పోరాటం ద్వారా పై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. వర్గ పోరాట ఫలితంగానే కార్మిక వర్గం పాలకవర్గంగా, పెట్టుబడిదారీవర్గం పాలితవర్గంగా మారుతుంది. విరుద్ధాంశాల మధ్య ఘర్షణ కారణంగానే ఒక విరుద్ధాంశం, దాని వ్యతిరేకాంశంగా మారుతుందని చూశాము. అంటే విరుద్ధాంశాల మధ్య ఐక్యతకు మూలం ఘర్షణే. రెండు విరుద్ధాంశాల మధ్య ఘర్షణ నిరంతరమూ ఉంటుంది. అయితే వాటి స్థానా ల మార్పు సమాజ పరంగా చూస్తే ఎక్కువ కాలం పడుతుంది. స్థానాల మార్పు జరిగేంత వరకూ విరుద్ధాంశాలు స్థిరంగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. విరుద్ధాంశాల మధ్య వైరుధ్యం పరిష్కారమయ్యే వరకూ ఘర్షణ ఉంటుంది. అయితే విరుద్ధాంశాల మధ్య ఐక్యత తాత్కాలికమైనది. సాపేక్షమైనది. ఘర్షణ మాత్రం నిత్యమైనది. ఈ ఘర్షణ, పరిమాణాత్మక మార్పుల దశలో ఉన్నప్పుడు విరుద్ధాంశాలు సహ నివాసం చేస్తాయి. సాపేక్ష స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. గుణాత్మక మార్పు దశలో వాటి ఐక్యత భగమవుతుంది. తిరిగి నూతన ప్రాతిపదికపై ఐక్యత నెలకొంటుంది. ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ప్రకృతిలోగానీ, సమాజంలోగానీ గుణాత్మక మార్పులకు కారణం ఈ వైరుధ్యాలే.
ఉదాహరణకు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యం (ప్రభుత్వం) ఇవి రెండు విరుద్ధాంశాలు. కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. (ఘర్షణ). తమంతతాముగానే సమ్మె విరమించారు. యాజమాన్యంతో కలిసి పని చేయడానికి సమ్మతించారు. ఈ ఘర్షణ పరిష్కారమయ్యే పరిస్థితులు రానికారణంగా తిరిగి ఐక్యతలోకి వచ్చారు. అంటే దానర్థం ఘర్షణ లేదని కాదు. ఈ ఐక్యత సాపేక్షమూ తాత్కాలికమైనదే. ఘర్షణకు విరామం మాత్రమే. తిరిగి ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఇది అంతర్గతంగా కొనసాగే క్రమం. ఘర్షణ అనేది బాహ్యం కాదు. అంతర్గతమైనది. వ్యతిరేకాంశాలు స్వతంత్రమైనవి కావు. అవి మొత్తం ప్రకియలో భాగాలు. పార్టీల నిర్వహణలో కూడా ఈ విరుద్ధాంశాలు ఉంటాయి. రెండు రకాల ఆలోచనలు ఘర్షణ పడుతుంటాయి. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం పార్టీలో రెండు పంథాల మధ్య ఐక్యత నెలకొంటుంది. అంటే మెజారిటీ పంథాను మైనారిటీ అమలు చేస్తుంది. అయితే రెండు పంథాలు వాటి మధ్య ఘర్షణ అంతరించిపోవు. ఆచరణ అనే గీటురాయిపై ఏది సరైనదో రుజువైన తర్వాత ఘర్షణ అంతరిస్తుంది.
ఈలోపు ఐక్యత భగమవుతూనే ఉంటుంది. కాబట్టి ఘర్షణ నిత్యం. ఐక్యత తాత్కాలికం. ఈ ఘర్షణ పడటమనేది కేవలం ఘర్షణ కోసమే కాదు. అభివృద్ధి క్ర మంలో ఒక అడుగు ముందుకేయటం కోసమే. ఘర్షణ లేకుంటే అక్కడ అభివృద్ధి ఉండదు. పార్టీలో అంతర్గత వైరుధ్యాన్ని విమర్శ, ఆత్మవిమర్శ పరిష్కరిస్తుంది. ఆ రకంగా వైరుధ్య నియమంలోని ఐక్యత, ఘర్షణలను అర్థం చేసుకోవాలి. అది పదా ర్థంలోనూ, పనిలోనూ, సమాజంలోనూ, సకల చలనాలలోనూ, ఆలోచనలలోనూ ఈ వైరుధ్యమే మార్పులకు దారిస్తుంది.
- కె.ఆనందాచారి