Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్
ముందస్తు సమాచారం లేకుండానే అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడ మేంటనే అంబేద్కర్ సంఘ నాయకులు, ఎమ్మార్పీఎస్, వివిధ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి ఎల్ అండ్ టీ అధికారులు బుధవారం ప్రయత్నించగా ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహనికి నాయకులు లోనయ్యారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కొయ్యడ మల్లేష్, ఇతర నాయకులు ఎల్ అండ్ టీి అధికారులతో తీవ్ర వాగ్వివాదం నెలకొంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇంతటి చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ఎల్ అండ్ టి అధికారులు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన అనంతరమే ఈ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఏసీపీ వినోద్, సీఐ, ఎస్సైలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సమస్య సద్దుమణిగేలా నచ్చజెప్పినా నాయకులు వినకపోవడంతో బలవంతంగా అరెస్ట్ చేసి పోలిస్స్టేషన్కు తరలించారు.