Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
యాసంగి గోస..! | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Jan 22,2021

యాసంగి గోస..!

- ధాన్యం కొనుగోళ్లపై అనుమానం
- కొన్నది 4.94 లక్షల మెట్రిక్‌ టన్నులే
- ఇప్పటికే 361 కేంద్రాలు మూసివేత
- యాసంగిలో వరిసాగే అత్యధికం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
రైతన్నకు యాసంగి గోస తప్పేటట్లు లేదు. ధాన్యం కొనుగోళ్లపై అనుమానాలు రేకెత్తు తున్నాయి. ఖరీఫ్‌లోనూ ప్రభుత్వం అనుకున్న మేరకు కొనుగోలు చేయలేదు. ఇప్పటికే 40 శాతానికిపైగా కొనుగోలు కేంద్రాలు ఎత్తివేశారు. యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేయడం కష్టమని మంత్రులే చెబుతున్నారు. ప్రభుత్వమే చేతులు ఎత్తేస్తే రైతుల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ ఉడాది ఖరీఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 7లక్షల65వేల ఎకరాల్లో సాగైంది. 12 లక్షల 42 వేల 549 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 4 లక్షల 94 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గతేడాది యాసంగిలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 10 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గతేడాది యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి ఈ ఏడాది ఖరీఫ్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి చాలా తేడా ఉంది. దీనితో ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తారా..లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు
ఈ ఏడాది వర్షాకాలంలో 12 లక్షల 42 వేల 549 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం కోసం 978 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత మూడు మాసాలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ కొనుగోలు చేసింది మాత్రం 4 లక్షల 94 వేల మెట్రిక్‌ టన్నులే. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో 361 ఎత్తేశారు. అంతకు ముందు ప్రభుత్వం సన్న దిగుబడి చేయాలని రైతులకు ఆంక్షలు పెట్టింది. కనీసం మద్దతు ధర లభిస్తుందని రైతులు
ఆశించారు. కానీ దొడ్డు ధాన్యం, సన్న ధాన్యాన్ని ఒకే ధరకు కొనుగోలు చేశారు. దీనితో రైతులు భారీగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయకపోతే మరికొందరు రైతులకు న్యాయం జరిగేది. కానీ తీరుతో పలు గ్రామాల రైతులు ప్రయివేట్‌ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాసంగిలో వరిసాగే అత్యధికం
వర్షాకాలంలో దిగుబడైన ధాన్యంలో 50 శాతం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయ లేదు. అయినా రైతులు యాసంగిలోనూ వరిపంటనే అత్యధికంగా సాగు చేస్తున్నారు. నీరు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికారులు నిర్ణయించిన యాసంగి సాగు అంచనా 5 లక్షల 4 వేల 429 ఎకరాలు. అందులో వరి సాగు 2 లక్షల 81 వేల 607 ఎకరాలు. ఇతర పంటలు 2 లక్షల 22 వేల 822 ఎక రాలు. అంటే 60 శాతం వరిపంట సాగు చేస్తున్నారు. 80 శాతం నాట్లు పూర్త య్యాయి. వర్షా కాలంలోనే వరి సాగు చేసి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అతి తక్కువకు అమ్ము కొని నష్టపోయిన రైతన్న యాసంగిలోనూ నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. రైతులు ఇష్టం వచ్చిన పంటలు దిగుబడి చేయొచ్చని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో వరిసాగుపై దృష్టి పెట్టిన రైతులు కొనుగోళ్లపై కిరికిరి పెడితే ఎలా అన్న విషయమై పునరాలోచనలో పడ్డారు.
కొనుగోళ్లపై అనుమానాలు
యాసంగి పంట కొనుగోళ్లపై రైతులకు ఇప్పటి నుంచే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గతేడాది ప్రభుత్వ సంస్థలైన పీఏసీఎస్‌, ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన సంఖ్యకు, ఈ ఏడాది వర్షాకాలంలో కొనుగోలు చేసిన పంటకు చాలా తేడా ఉంది. సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా తగ్గింది. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా యాసంగి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే యాసంగి రైతులు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. వర్షాకాలం ధాన్యం లాగే రూ.1200-1400లకు క్వింటాలు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : సారంపల్లి వాసుదేవరెడ్డి
రైతు పండించిన అన్ని పంటటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అలిండియా కిసాన్‌ సభ జాతీయ నాయకుడు సారంపల్లి వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రం కార్పొరేట్‌ వ్యవసాయానికి అర్రులు చాస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను పూర్తిగా విస్మరించే ప్రయత్నం చేస్తోంది. రైతు పండించిన చివరి గింజనూ కొనుగోలు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. కొనుగోళ్లను విస్మరిస్తే పోరాటాలు తప్పవు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వామపక్షాలు పుంజుకోవాలి
టీఆర్‌ఎస్‌ మంత్రాంగం
ఉద్యమ నేపథ్యమున్న మహిళగా గుర్తించండి
విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటాలి
కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు
బహుభాషా కోవిదురాలు జెడ్పీటీసీ డాక్టర్‌ పిట్టల శ్రీలత
కాళేశ్వరం ఇసుక క్వారీల్లో 'జేసీబీ బకెట్‌' దందా !
కలెక్టరేట్‌లో కాంగ్రెస్‌ ప్రచారం
వాడీవేడీగా పీఏసీఎస్‌ సమావేశం
టీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేయాలి
పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి
మిషన్‌ భగిరథ పైపు లైన్‌ లీకేజీ
రికార్డులు పూర్తి చేస్తేనే బిల్లులు చెల్లించాలి : కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య
ఈ నెల చివరిలోగా పనులు పూర్తి చేయాలి : పమేలా సత్పతి
అరాచక పాలనకు చరమగీతం పాడాలి : కాంగ్రెస్‌
ఉద్యోగ కల్పనపై 'పల్లా' అబద్ధాలు
బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలి
మిర్చి రైతులకు శిక్షణా కార్యక్రమాలు
కొరగుట్టపై అదనపు కలెక్టర్‌ విచారణ
కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించండి
కూలీలు జరభద్రం...
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరం
రాజాసింగ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి
రాములునాయక్‌ను గెలిపించాలి
ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసుల ఉక్కు పాదం
ప్రశ్నించే గొంతును గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకోవాలి
అన్నారం షరీఫ్‌ దర్గాలో భారీ పోలీసు బందోబస్తు
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌ కేటాయించాలి

తాజా వార్తలు

05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

01:15 PM

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

01:02 PM

పెద్దపల్లిలో వృద్ధుడు దారుణ హత్య

12:48 PM

రాజేంద్రనగర్‌లో వివాహిత ఆత్మహత్య

12:21 PM

టీడీపీ సీనియ‌ర్ నేత‌ కన్నుమూత

12:13 PM

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభం

12:00 PM

నేడు విశ్వాస పరీక్ష ఎదుర్కొనున్న పాక్ ప్రధాని

11:40 AM

టీమిండియా 365 పరుగులకు ఆలౌట్

11:36 AM

హాస్పి‌ట‌ల్ బిల్లు‌లు క‌ట్ట‌లేద‌ని పాప‌కు స‌ర్జ‌రీ చేసి కుట్లు వేయ‌కుండా..!

11:07 AM

మేయర్ నుంచి ప్రాణహాని ఉందంటూ టీఆర్ఎస్​ నేత సంచలన వ్యాఖ్యలు

11:01 AM

బ‌డ్జెట్ స‌మావేశాల‌పై నేడు సీఎం కేసీఆర్ స‌మీక్ష‌!

10:40 AM

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు శుభవార్త

10:24 AM

భార‌త్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:33 AM

రిషభ్ పంత్ పీట్‌ను చూసి షాకైన కోహ్లి

09:14 AM

నేడు ఢిల్లీ కేఎంపీ ఎక్స్‌ప్రెస్ వే దిగ్బంధనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.