Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాళేశ్వరం ఇసుక క్వారీల్లో 'జేసీబీ బకెట్‌' దందా ! | వరంగల్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • వరంగల్
  • ➲
  • స్టోరి
  • Mar 06,2021

కాళేశ్వరం ఇసుక క్వారీల్లో 'జేసీబీ బకెట్‌' దందా !

- లారీ యజమానులతో కాంట్రాక్టర్ల కుమ్మక్కు
- ఇసుక రీచ్‌ల వద్ద లోడింగ్‌లో మోసాలు
- నామ మాత్రపు తనిఖీలు.. పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఇసుక క్వారీల యజమానులు, కాంట్రాక్లర్ల దందా జోరుగా సాగుతోంది. అనుమతులు తక్కువ ఇసుకదందా ఎక్కువ అన్న చందంగా మారుతోంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తూ రూ.లక్షల్లో సొమ్ముచేసుకుంటున్నారు. జేసీబీ బకెట్‌తో రోజుకు రూ.లక్ష అదనంగా దండుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టు ఆరోపణలూ ఉన్నాయి. ఒక్కో ఇసుక క్వారీ వద్ద అదనంగా ఒక్క జేసీబీ బకెట్‌ ఇసుకను అక్రమంగా తోలుకుపోతున్న పరిస్థితి. దీనిని నియంత్రించాల్సిన కొందరు అధికారులు పట్టనట్టు వ్యవహరంచడం గమనార్హం. నామమాత్రపు తనిఖీలు చేపట్టి ఓవర్‌ లోడ్‌ ఇసుక లారీలను సీజ్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇందుకు జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లోని ఇసుక క్వారీల యజమానులే నిదర్శనం.
జిల్లా లోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఒరిగిందేమీ లేకున్నా ఇసుకాసురులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. కాళేశ్వరం ప్రాంతంలో గతంలో 23 ఇసుక రీచ్‌లు ఉండగా ప్రస్తుతం 11 రీచ్‌లు నడుస్తున్నాయి. కాళేశ్వరం పరిధి పలుగుల వద్ద తొమ్మిది రీచ్‌లు, ముద్దులపల్లి వద్ద రెండు రీచ్‌లు, పూసలపల్లి వద్ద ఒకటి మొత్తం 11 ఇసుక రీచ్‌ల ద్వారా రోజుకు సుమారు 800కు పైగా లారీలు కొనసాగుతున్నాయి. ఇసుక కొనుగోలు చేయడం కోసం లారీ యజమానులు ప్రభుత్వానికి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించి ఇసుక క్వారీ వద్దకు వెళితే లోడ్‌ చేస్తారు. ఇదే అదునుగా కొందరు యజమానులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ప్రభుత్వానికి ఆన్లైన్లో చెల్లించిన దానికంటే ఎక్కువ లోడ్‌ చేసుకుంటున్న పరిస్థితి. లోడ్‌ చేసే సమయంలో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై జేసీబీ డ్రైవర్‌కు చెప్పి అదనంగా రెండు బకెట్‌ల ఇసుక లోడ్‌ చేసుకుంటున్న పరిస్థితి. ఒక బకెట్‌ సుమారు నాలుగున్నర టన్నుల ఇసుక ఉంటుంది. ఇలా ఒక్కో లారీ లోడ్‌లో అదనపు బకెట్‌కు రూ.1500 నుంచి రూ.3వేల వరకు ముడుపులందుకుంటున్నట్టు తెలిసింది. మహదేవ్‌పూర్‌ మండలం కుంట్లంలోని 3, పలుగుల 5, 6, 8 ,10, 11, 12 నెంబర్ల క్వారీల ఇసుకకు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌ ఉండడంతో ఇసుక దందా కొత్తపుంతలు తొక్కుతోంది. కాంట్రాక్టర్లు ఓవర్‌ లోడ్‌ ద్వారా వసూలు చేసిన డబ్బులో కొంత అధికార పార్టీ లీడర్లకు టీఎస్‌ ఎంబీసీ, మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌, ట్రాన్స్‌ పోర్ట్‌ ,డిపార్ట్మెంట్‌ ఆఫీసర్ల స్థాయిని బట్టి వాటాలు పంపుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలిసింది. గురువారం(4-3-2021) సాయంత్రం భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్‌లో స్థానిక ఎస్సై ఉదరు కిరణ్‌ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా అధిక లోడుతో వెళ్తున్న ఐదు ఇసుక లారీలు పట్టుబడ్డాయి. వాటిని సీజ్‌ చేసి సంబంధిత మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కు అప్పగించారు. తనిఖీలు ఇలానే కొనసాగితే అక్రమ ఇసుక దందా, ఓవర్‌ లోడ్‌ దందాను నియంత్రించొచ్చని పలువరు పేర్కొంటున్నారు.

అధిక లోడు చేస్తే చర్యలు తప్పవు
కాలేశ్వరం ఇసుక క్వారీల్లో పరిమితికి మించి అధిక లోడు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు ఇసుక అధిక లోడు విషయం మా దష్టికి రాలేదు. నిత్యం వాహనాల తనిఖీ చేపడుతున్నాం.
- భూక్య నరహరి, కాళేశ్వరం ఎస్సై

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మరిపెడ ఎస్సైగా శ్రీనివాస్‌రెడ్డి
అధికారులు నిర్లక్ష్యం వీడాలి
పది రోజుల్లో మర్మతు పనులు పూర్తి చేయాలి
ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఫారెస్ట్‌ అధికారులు వ్యవహరించాలి
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
'మధుకర్‌రెడ్డి'పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలి : టీజేఏ
దోపిడీ రహిత సమాజానికి ఉద్యమించాలి : సీపీఐ(ఎం)
పారదర్శకంగా 'గ్రేటర్‌ వరంగల్‌' రిజర్వేషన్లుఖరారు
ఉన్నతాధికారుల ఆరా.. !
నాసిరకంగా తహసీల్దార్‌ కార్యాలయ నిర్మాణం
తాటి ఈత చెట్లను తొలగించిన వారిపై కేసు
'గ్రేటర్‌ వరంగల్‌' ఎన్నికల కోడ్‌ అమలు
రూ.3 వేల కోట్లతో 'గ్రేటర్‌ వరంగల్‌' అభివృద్ధి
ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ముస్లిం సోదరులు సహకరించాలి
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
19న ఉచిత శిక్షణ, ఉపాధి మేళ..
ప్రజల కోసం పోరాడిన వారు అజరామరంగా నిలుస్తారు
మంత్రి కేటీఆర్‌ను కలిసిన కందుకూరి
'నగర'పోరు నగారా
అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగించాలి
మంత్రి ఎర్రబెల్లి ఘననివాళి
పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌ వెంటనే ప్రకటించాలి
మేయర్‌ పదవిపై టీఆర్‌ఎస్‌ నేతల నజర్‌
స్ఫూర్తి ప్రదాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌
అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
మానవతారాయ్ పై దాడి హేయం : కాంగ్రెస్‌
ప్రభుత్వ భూమి పలహారం !?
పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి : సీపీఐ(ఎం)
బామ్మర్దిని కత్తితో పొడిచి చంపిన బావ
గొప్ప తాత్విక వేత్త అంబేద్కర్‌ : కలెక్టర్‌

తాజా వార్తలు

07:37 PM

లవర్స్ ను తుపాకితో కాల్చిన పోలీస్.. వైరల్ అవుతున్న వీడియో

07:27 PM

ఏపీలో భారీగా పెరిగిన కేసులు..కరోనాతో 20 మంది మృతి

07:20 PM

డాక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి ప్రజలకు తీరని లోటు : సీపీఐ(ఎం)

07:18 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

07:12 PM

సీపీఐ మాజీ ఎంఎల్‌ఏ సుబ్బరాజు మృతికి సీపీఐ(ఎం)సంతాపం

07:10 PM

నా ఆరోగ్యం బాగుంది.. ఆందోళన చెందవద్దు: పవన్ కల్యాణ్

07:06 PM

బాలిక‌పై లైంగికదాడి..సెల్ఫీ తీసి

06:58 PM

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కరోనా..

06:33 PM

తిరుపతి ఉపఎన్నిక ముందు పార్టీలకు బిగ్ షాక్

06:07 PM

స్వచ్ఛందంగా లాక్ డౌన్..మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు

05:50 PM

యువ‌కుడి దారుణ‌ హ‌త్య

05:47 PM

కాకతీయ మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం

05:25 PM

విశాఖలో ఈదురు గాలుల బీభత్సం

05:15 PM

పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

04:47 PM

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:26 PM

కోవిడ్‌ ఆస్పత్రిగా గాంధీ..ప్రతి 10 నిమిషాలకు..

04:09 PM

మంత్రి ఈటలకు సొంత జిల్లాలోనే షాకిచ్చిన నిరుద్యోగులు

04:06 PM

తెలంగాణ ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

03:59 PM

తెలంగాణలో ఆక్సిజన్ కొరత ఉంది: ఈటల

03:55 PM

ఈరోజు రాత్రి నుంచి రెండ్రోజుల పాటు లాక్‌డౌన్‌

03:04 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌కు గుండెపోటు, పరిస్థితి విషమం

02:53 PM

సీఎంకు కరోనా..ఆస్ప‌త్రిలో చికిత్స‌

02:05 PM

లోటస్‌పాండ్‌లో కొనసాగుతున్న షర్మిల దీక్ష

01:50 PM

మాస్క్ లేకుండా రెండోసారి పట్టుబడితే ప‌దివేల జ‌రిమానా

01:37 PM

ఆదివారం సంపుర్ణ లాక్‌డౌన్

01:23 PM

చెరువులో దూకి తల్లి ఆత్మహత్య..అమ్మ వెంటే చిన్నారి.!

01:13 PM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

01:10 PM

చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ప‌లు పర్యాటక స్థలాలు మూసివేత

12:57 PM

కుంభ‌మేళాలో 30 మంది సాధువుల‌కు క‌రోనా పాజిటివ్‌

12:53 PM

ఘోర రోడ్డు ప్ర‌మాదం: ఇద్ద‌రు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.