Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడకండ్ల
ఉపాధ్యాయలు విధుల పట్ల నిర్లక్షం వహిస్తే చర్యలు తప్పవని మండల విద్యాధికారి (ఎంఈఓ) భిక్షపతి హెచ్చరించారు. మండలంలోని పోచంపల్లి, కాన్వాయి గూడెం, రేగుల, అవుతాపురం, గంట్లకుంట్ల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు గంట్లకుంట్లలోని శ్రీచైతన్య ప్రయివేటు పాఠశాలలను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్ధేశించి ఎంఈఓ భిక్షపతి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించి ఇతరులకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. విద్యార్థులు అర్ధమయ్యే రీతిలో బోధించి వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా తీరిదిద్దాలని చెప్పారు. అనంతరం విద్యార్థుల హాజరు పటిక, ప్రోగ్రెస్ రిపోర్టులు, మధ్యాహ్న భోజన వంటకాలు పరిశీలించారు. ఆయన వెంట అవుతాపురం క్లస్టర్ రిసోర్స్పర్సన్ (సీఆర్పీ) సంతోష్, ఉన్నారు.