Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
వ్యాధులను నివారించి ఆరోగ్యాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత కోసం కృషి చేయాలని వైద్యాధికారిని యామని అన్నారు. శుక్రవారం గూడూరులో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల ఉధృతిని అరికట్టేందుకు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమ తెరలు వాడాలని సూచించారు. వైద్య సిబ్బంది అరుణ, లక్ష్మీబాయి, ఖయ్యూం, సుమన్, చంద్రకళ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.